ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Nov 05 , 2025 | 02:45 PM

బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి మాజీ సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి .

CM Revanth Reddy Fires BRS

హైదరాబాద్, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి మాజీ సీఎం కేసీఆర్ (KCR) తాకట్టు పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థులకు ఎనిమిది చోట్ల డిపాజిట్ కూడా రాలేదని విమర్శించారు. ప్రధామంత్రి నరేంద్రమోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ తెలంగాణకి అత్యంత ప్రమాదకరమని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లేనని ఆరోపించారు. జూబ్సీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ సీఎం రేవంత్‌రెడ్డిని ఇవాళ(బుధవారం) కలిశారు. ఈ క్రమంలో సీఎంతో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సమావేశం అయ్యారు.

ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Election) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు. అలాగే, తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలపై సానుకూలంగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. వారి సమస్యలని వెంటనే పరిష్కారిస్తానని మాటిచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. భారత్ జోడో పాదయాత్ర ద్వారా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోని మైనార్టీలకు ఒక భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేసీఆర్ ఒక వైపు ఉన్నారని.. రాహుల్ గాంధీ, తాను మరోవైపు నిలబడ్డామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ ఇప్పటి వరకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు... ? అని ప్రశ్నించారు. ఈ కేసుల విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను ఎందుకు విచారణకు పిలవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉందని ఆరోపించారు. గతంలో కవితనే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసేందుకు జూబ్లీహిల్స్‌ను ప్రయోగశాలగా చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క దళితుడే మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. తమ మంత్రివర్గంలో నలుగురు దళితులకు అవకాశం కల్పించామని ఉద్ఘాటించారు. అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌కి అవకాశం ఇచ్చామని నొక్కిచెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.

అత్యంత నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలని ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అయితే క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో జరిగిన భేటీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, ఏఐసీసీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు అనిల్ థామస్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...

అమెరికాలో ఘోర ప్రమాదం.. పేలిన కార్గో విమానం

మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన.. ప్రముఖ సంస్థల ఛైర్మన్లతో

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 03:05 PM