Home » Telugu News
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూడా గ్రామస్థాయిల్లో సమావేశాలు నిర్వహించి క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్కు తీసుకెళ్లిన బ్యాలెట్ బాక్సులు 13వ తేదీన తిరుపతికి రానున్నాయి. వీటిని నగరంలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ఉన్న గోదాములో భద్రపరచనున్నారు.
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి విచ్చేశారు. దీంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. వెలుపల వరకు వ్యాపించాయి. ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం కల్పించడానికి చైర్మన్ మణినాయుడు,ఈవో పెంచలకిషోర్ క్యూల్లను క్రమబద్ధీకరించారు.
దోపిడీకి వచ్చి కాపలాదారును హతమార్చిన సంఘటన కలకలం రేపింది. చిత్తూరు మండలం మంగాపురంలో జరిగిన ఈ వైనంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పట్టాభినాయుడు అమోరికాలో స్థిరపడ్డారు. ఇక్కడ పెద్ద నివాసభవనం ఉంది. పొలాలు కూడా ఉన్నాయి.
డీఎస్సీలో ఆక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రోజులుపాటు నిర్వహించిన జెన్ జీ రిలే నిరాహారదీక్షల్లో ఎక్కడా విద్యార్థులు, యువత కనిపించలేదు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం నగరంలో ప్రతిపాదించిన లాంజ్ల నిర్మాణం ఇప్పట్లో కార్యరూపం దాల్చే సూచనలు కనిపించడం లేదు.
జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 12, 13 తేదీల్లో అటవీ శాఖ నగరంలో సదస్సు నిర్వహించనున్నది.
భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం (కనెక్టివిటీ) కోసం వీఎంఆర్డీఏ హడావిడిగా నిర్మించిన వేపగుంట-పినగాడి మాస్టర్ప్లాన్ రోడ్డు ఇంకా వాహనాల రాకపోకలు సరిగా ప్రారంభం కాకముందే కుంగిపోయింది.
ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన లక్ష్మీదేవిపేట ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనులను రైల్వేశాఖ ఆధ్వర్యంలో రూ.90 కోట్లతో చేపట్టనున్నట్టు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. దీనికి సంబంధించి పది రోజుల్లో టెండర్ల కూడా పిలవనున్నట్టు ఆయన చెప్పారు.
ఆక్రమణలకు గురై మురికి కూపంగా ఉన్న పట్టణ శివారు అన్నవరం వెంకయ్యగారిపేటలో ఉన్న ఏడెకరాల కోమటి చెరువు యువకుల సంకల్పంతో ఇప్పుడు కొత్తరూపు సంతరించుకుంది. గ్రామస్థుల సహకారంతో యువకులు చందాలు వేసుకుని శ్రమదానంతో చెరువును అభివృద్ధి చేశారు.