Home » Telugu News
చిన్నారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరమైన్ మేలియేట్, ఫినైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ అనే రెండు రసాయనాలతో కూడిన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందుల తయారీ, విక్రయాలు, పంపిణీపై ఆంక్షలు విధించింది. నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ మందులను ఉపయోగించరాదని స్పష్టం చేసింది.
కామన్వెల్త్ క్రీడల్లో రెండో స్థానానికే పరితమైన భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్లోనూ అదే స్థానంలో నిలిచాడు. గ్లాస్గోలో స్వర్ణం చేజిక్కించుకున్న శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పతిరగె... ఇక్కడా అగ్రస్థానం సాధించాడు.
కరవు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు వరమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల నీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
‘‘నా ఇద్దరు పిల్లల సాక్షిగా చెబుతున్నా. మెరిట్లోనే ఉద్యోగం తెచ్చుకున్నాను. డీఎస్సీలో అక్రమాలు జరగలేదు’’ అని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన డీఎస్సీ విజేత జ్యోతి తెలిపారు.
పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్మ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం 4.20 గంటలకు లక్కవరపుకోట మండల కేంద్రంలో ఉన్న శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి నివాసానికి రానున్నారు.
జానపదాలకు ప్రఖ్యాతిగా విజయనగరం జిల్లా బాసిల్లుతోంది. బుర్రకథలు.. హరికథలు.. సాంఘిక నాటికలు.. నాటకాలు.. రేలారే రేలా... తప్పెటగుళ్లు.. తూర్పుభాగవతం తదితర ప్రదర్శనలతో జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. మరోవైపు సోషల్ మీడియా పుణ్యమా అని జిల్లాలో ఎంతోమంది వర్దమాన కళాకారులు విశేష ప్రాచుర్యం పొందుతున్నారు. షేర్లు, లైక్లు, సబ్స్రైబ్లతో జనాధరణ సొంతం చేసుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మరోవైపు అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు లోపు ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతుండడంతో మన్యంలోని పట్టణ, గ్రామీణ ప్రాం తాల్లో రాజకీయ వేడి మొదలైంది. నాలుగు నియోజకవర్గాల్లోని ఆశావహులు అధిష్ఠానం ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తమ గ్రామానికి రోడ్డు మంజూరైందని ఆ గిరి శిఖర వాసులు ఎంతో ఆనందించారు. ఇక తమకు డోలీ మోతలు తప్పుతాయని భావించారు. అయితే రోడ్డు మంజూరైనా.. ఎర్క్ వర్క్ చేసి ఆపేయడంతో వారి ఆనందం ఆవిరైంది. ప్రస్తుతం గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా ఆ గ్రామస్థులకు డోలీ కష్టాలు తప్పడం లేదు.
జానపదాలకు ప్రఖ్యాతిగా మన్యం బాసిల్లుతోంది. థింసా నృత్యం, కోలాటం, కర్రసాము, గిరిజన సంప్రదాయ వాయిద్యాలు , తప్పెటగుళ్ల ప్రదర్శనలతో జిల్లావాసులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని జానపద కళలు చాలా వరకు కనుమరుగు అవుతున్నాయి.