Home » Telugu News
రాజ్యాంగమంటే ఏమాత్రం గౌరవంలేని శక్తులే నేడు దేశాన్ని పాలిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షుడు కె.నారాయణ విమర్శించారు.
ఒక ట్రావెల్స్ సంస్థ కేవలం గంటలోనే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కల్పిస్తామని చెప్పి తీసుకువచ్చి చివరకు ఉచిత దర్శనం క్యూలో పంపారని బెంగళూరుకు చెందిన భక్తబృందం ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రీహరికోటలోని షార్ నుంచి ఆదివారం జరిగే రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బెయిల్తో బయటకొచ్చే గంజాయి బ్యాచ్.. మళ్లీ కనిపించడం లేదు. కోర్టు విచారణకు రావడంలేదు.
తిరుమలలో ఎవరైనా అనుమానితంగా కనిపిస్తే తమకు సమాచారమివ్వాలని భద్రతాధికారులు స్థానిక మహిళలను కోరారు.
ఇళ్ల వద్దనే ఉంటూ పనిచేసే విఽధానం తీసుకువస్తామని సీఎం చంద్రబాబునాయుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో వెల్లడించారు.
ఇప్పటికే లెక్కకుమించిన కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం అనుభవిస్తున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మెడకు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు కూడా చుట్టుకుంది. ఓట్లే ఎరగా, పేదలను మభ్యపెట్టి నాడు ఎమ్మెల్యే స్థానంలో ఉండి వంశీ చేసిన ఈ నకిలీ పట్టాల కేసులో ఈనెల 29 వరకు నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి రిమాండ్ విధించడంతో నియోజకవర్గవ్యాప్తంగా చర్చ మొదలైంది.
బుడమేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. రూ.28 కోట్లు కేటాయించి గండ్లు పడిన చోట అర కిలోమీటర్ మేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల ప్రారంభించారు.
అన్నవరం, మే 16 (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ కిలేడీలు. దొంగతనానికి నిర్ణయించుకున్నారంటే ఎంతదూరమైనా ప్రయాణిస్తారు. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్లలో ప్రయాణికుల ఆభరణాలు, నగదు తస్కరించడమే లక్ష్యంగా పెట్టుకుని చాకచక్యంగా ప్రయాణికులతో మాటలు కలిపి దృష్టిమరలిచి నగదు, ఆభరణాలు తీసుకుపోతుంటారు. అలాంటి అత్తాకోడళ్లను కాకినాడ జిల్లా అన్నవరంలో పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే విజయవాడ రామవర
విజయవాడ జిల్లాజైలు సూపరింటెండెంట్ హంసపాల్పై వేటు పడింది. ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో పోస్టింగ్ ఇస్తూ, నెల్లూరులోని శిక్షణా కేంద్రానికి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లాలో సబ్జైళ్ల అధికారిగా ఉన్న మహ్మద్ ఇర్ఫాన్కు పదోన్నతి కల్పించి నియమించారు.