• Home » Telugu News

Telugu News

కౌలు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

కౌలు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

జిల్లాలో కౌలు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి ఆదేశించారు. సీసీఆర్‌ కార్డులు బ్యాంకు రుణాల మంజూరులో నిర్లక్ష్యం తగదన్నారు. అర్హులైన కౌలు రైతులకు అండగా నిలవాలని సూచించారు.

230 మందికి పైగా విద్యార్థినులకు  కేజిన్నర పప్పుతో సాంబారా?

230 మందికి పైగా విద్యార్థినులకు కేజిన్నర పప్పుతో సాంబారా?

సీతంపేట కేజీబీవీలో 230కి పైగా విద్యార్థినులు ఉండగా.. కేవలం కేజిన్నర కందిపప్పుతో సాంబారు ఎలా తయారు చేస్తారని వార్డెన్‌, కుక్‌ను రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు బి.కాంతారావు ప్రశ్నించారు. బాలికలు పెట్టే మెనూ ఇలా ఉంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం తొలుత సీతంపేట ఐటీడీఏ సమీపంలో ఉన్న సివిల్‌ సప్లైస్‌ గోడౌన్‌ను పరిశీలించారు.

పారదర్శకంగా ‘సర్‌’

పారదర్శకంగా ‘సర్‌’

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పారదర్శంగా జరుగుతుందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఎరువులను అక్రమంగా తరలిస్తే చర్యలు

ఎరువులను అక్రమంగా తరలిస్తే చర్యలు

ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా తరలించినా కఠిన చర్యలు తప్పవని పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ హెచ్చరించారు. మంగళవారం భామినిలో ఎరువుల దుకాణంలో విక్రయాలు, నిల్వల నమోదును తనిఖీ చేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు   ఉత్తరాంధ్ర మణి కిరీటం

భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర మణి కిరీటం

భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకే మణి కిరీటంగా మారనుందని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. భోగాపురం ఎయిర్‌ పోర్టును ఆయన మంగళవారం సందర్శించి అణువణువూ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టును తొలిసారిగా 2024 జూలై 10న సందర్శించానని, తరువాత అదే ఏడాది జూలై12న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుతో సందర్శించానని గుర్తుచేశారు.

కాకర్లవలస భూ వివాదం సుఖాంతం

కాకర్లవలస భూ వివాదం సుఖాంతం

కాకర్లవలస గిరిజనులకు ఊరట లభించింది. వారి భూ వివాదం పరిష్కారమైంది. భూమిని నమ్ముకుని జీవిస్తున్నామని గిరిజనులు, ఆ భూములను కొనుగోలు చేశామని ఏపీఐఐసీ కొన్నాళ్లుగా వాదనలకు దిగడంతో ఇరువర్గాల మధ్య వివాదం నడిచింది. ఎమ్మెల్యే బేబీనాయన రంగంలోకి దిగి మంత్రి, కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారానికి చొరవ తీసుకున్నారు.

ఖరీఫ్‌లో కష్టాలేనా?

ఖరీఫ్‌లో కష్టాలేనా?

ఖరీఫ్‌ వచ్చేసింది. సంతృప్తిగా వర్షాలు కురవలేదు. ఈ పరిస్థితిలో ధీమాగా ఉండాల్సిన తోటపల్లి పంట కాలువ అధ్వానంగా ఉంది. పిచ్చిమొక్కలు, పూడికతో కనిపిస్తోంది. శివారు ఆయకట్టుదారులకు నీరందే పరిస్థితే లేదు. అయినా కాలువలో చేపట్టాల్సిన పనులు చేయకుండా అధికారులు నీరు విడుదల చేసేశారు. ఎందుకిలా చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ప్రతీకారంతో దారుణ హత్య

ప్రతీకారంతో దారుణ హత్య

అన్నదమ్ముల మధ్య భూవివాదం రక్తపాతానికి దారితీసింది. కుటుం బాల మధ్య కక్షను పెంచి గొడవలు, కేసులు చివరికి ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది.

జీఆర్‌టీ జువెలర్స్‌.. స్వర్ణ ఆషాఢ ఆఫర్లు

జీఆర్‌టీ జువెలర్స్‌.. స్వర్ణ ఆషాఢ ఆఫర్లు

జీఆర్‌టీ జువెలర్స్‌.. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని స్వర్ణ ఆషాఢ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగం గా బంగారు ఆభరణాల కొనుగోలుపై...

కృత్రిమ మేధతో అపార అవకాశాలు

కృత్రిమ మేధతో అపార అవకాశాలు

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయని నాస్కామ్‌ మాజీ ప్రెసిడెంట్‌, ఐటీ, టెలికాం శాఖ మాజీ కార్యదర్శి రెంటాల చంద్రశేఖర్‌...

తాజా వార్తలు

మరిన్ని చదవండి