Home » Telugu News
హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత సర్వేలు నిర్వహించేవారు చాలా స్తబ్దంగా కనపడుతున్నారు. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల గురించి అడిగితే చాలా ఆచితూచి స్పందిస్తున్నారు. సర్వేలు నిర్వహించేవారు మాత్రమే కాదు...
జడ్పీ సర్వసభ్య సమావేశం అర్థవంతంగా సాగింది. గత రెండు సమావేశాలకు భిన్నంగా అందరూ హాజరయ్యారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అంతా వైసీపీ వారే కాగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు వారే అధికంగా ఉండి గత మూడేళ్లు సమావేశాలు ఏకపక్షంగా సాగాయి.
దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుస్థిరత కోసం, ప్రజాస్వామ్య సంస్థల శ్రేష్ఠతను కాపాడేందుకుగాను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. 1985లో ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతూనే...
నామినేటెడ్ పదవుల విషయంలో జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. అలాగే రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు జనసేన, బీజేపీలను కూడా కలుపుకుపోయి అవసరమైన మేరకు వారికీ పదవులు కేటాయించాలనుకున్నారు.
ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత అందరి దృష్టీ హైదరాబాద్ మీద పడింది. అంచనాకు మించిన జనం, కంపెనీలు వేగంగా తరలిరావడంతో దాని ప్రభావం మూసీ నది మీద పడింది. 1990 నాటికి మూసీలోకి మానవ వ్యర్థాలు, ఫ్యాక్టరీ నుంచి...
స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ఆరు కొత్త పాలసీలను రూపొందించింది కూటమి ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు కీలక రంగాలకు ఒకేసారి తీసుకొచ్చిన ఈ పాలసీలు ఆకర్షణీయం, ఆదర్శంగా నిలవనున్నాయి....
జిల్లా పంచాయతీ పరిధిలోని గ్రేడ్-5, 6 (సచివాలయ ఉద్యోగుల) బదిలీల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు త్రిసభ్య కమిటీ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కమిటీ చైర్మన్ అయిన ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్ లోకేశ్వరరావు, ఇద్దరు సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి బదిలీలు పొందిన ఉద్యోగులతో మాట్లాడి వివరాలను సేకరించారు.
‘‘విజయవాడ నగరాన్ని వణికించిన బుడమేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా బుడమేరు ఆక్రమణపై దృష్టి పెట్టాం. మరో పక్షం రోజుల్లో బుడమేరు యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నాం. ‘హైడ్రా’ తరహా దూకుడు మాత్రం ఇక్కడ ఉండదు. మానవీయ కోణంలోనే ఆక్రమణలు తొలగిస్తాం. ప్రధానంగా పెద్ద పెద్ద ఆక్రమణదారులపైనే తమ చర్యలు ఉంటాయి’’ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) స్పష్టం చేశారు. నగరవాసులను వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు ఫ్లై వోవర్లు, బైపాస్ రోడ్డుల నిర్మాణంతో చెక్ పెట్టనున్నట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో విజయవాడ పార్లమెంటు రూపురేఖలను మార్చే దిశగా కృషి చేస్తున్నానని వివరించారు. ఇంకా పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. - (విజయవాడ - ఆంధ్రజ్యోతి)
ఇసుక తవ్వకాలకు వరద బ్రేక్ వేసింది. ఇసుక తవ్వేందుకు అధికారులు 15 రీచ్లను గుర్తిస్తే అందులో 11 రీచ్ల్లో వరద నీరు నిలిచిపోయింది. మరో నాలుగు రీచ్ల్లో అప్రోచ్ రోడ్లు నీట మునిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇసుక తవ్వకాలకు మరో వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానదిలో అడుగుపెట్టడానికి అవకాశం లేకుండా పోయింది.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెలకు పండగ తేవాలన్నా, పంచాయతీలను నిజంగా బలోపేతం చెయ్యాలన్నా, రాష్ట్ర ప్రభుత్వ తక్షణం చేయాల్సింది– జాబ్ కార్డులు పొంది ఉన్న లక్షలమంది అనర్హులను...