Home » LATEST NEWS
మన అభిరుచికి తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ముఖ్యంగా కొందరు వ్యక్తుల పర్యవేక్షణలో పని చేయడం మరింత కష్టం. కానీ, చాలా మంది జీతం కోసం, కుటుంబ పోషణ కోసం వేరే దారిలేక కష్టమైనా పని చేస్తూనే ఉంటారు. మరికొందరు మాత్రం అలాంటి విషపూరిత వాతావరణంలో పని చేయలేక ఉద్యోగం వదిలేస్తుంటారు.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు మొదట్నించీ పట్టు ఉన్న అమేథి , రాయబరేలి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎవరిని తమ అభ్యర్థులుగా బరిలోకి దింపనుందనే సస్పెన్స్కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. అమేథీ, రాయబరేలికి చెందిన పార్టీ విభాగం నేతలతో కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.
బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27న 24 వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇన్నాళ్లు ఫేస్ బుక్కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాంలైన ఎక్స్, ఇన్ స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపై సోషల్ మీడియాని ఫుల్గా వాడేసుకోవడానికి రెడీ అయిపోయారన్నమాట.
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం 2 పేజీల్లోనే 9 హామీలను పొందుపరిచారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోనే తమకు ఖరాన్, బైబిల్, భగవద్గీత అంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్ వివిధ వేదికల మీద పలుమార్లు ప్రకటించిన విషయం విధితమే. మరి గత ఎన్నికల వేళ... అంటే 2019లో ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ తాము అధికారంలోకి వస్తే.. ఇవి చేస్తామంటూ పలు హామీలతో మేనిఫెస్టో పొందుపరిచారు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మేనిఫెస్టో-2024ను (YSRCP Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఇదేంట్రా బాబోయ్ అని తప్పకుండా మీకూ అనిపిస్తుంది. ఇంతకీ జగన్ రిలీజ్ చేసిన 2024 మేనిఫెస్టోకు.. 2019 మేనిఫెస్టోకు ఉన్న తేడాలేంటి..? అని బేరీజు చేసే పనిలో జనాలు, వైసీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు..
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రిని దారుణంగా హతమార్చాడో కుమారుడు. బాధ్యత మరచి, అల్లరిచిల్లరగా తిరుగుతున్న కుమారుడిని మందలించడంతో పాటు అతడు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో డెబ్భై యేళ్ల తండ్రిపై ముష్ఠిఘాతాలు కురిపిస్తూ, కాళ్లతో తన్నుతూ రాక్షసంగా వ్యవహరించాడా ప్రబుద్ధుడు.
వేసవి సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మీ పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్లో హైదరాబాద్(hyderabad) నుంచి వెళ్లే మంచి టూర్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అనారోగ్యం ఏదీ లేకపోయినా శరీరానికి కొన్ని చిన్న చిన్న అసౌకర్యాలు ఉండనే ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. చాలామందికి నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలలో వెరికోస్ వెయిన్స్ కూడా ఒకటి.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే ఇప్పుడిస్తున్న అమ్మ ఒడి సాయాన్ని పెంచుతామని సీఎం జగన్(CM Jagan) ప్రకటించారు. తాడేపల్లిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడారు. వైసీపీ గెలవగానే జగనన్న అమ్మఒడి కింద ఇస్తు్న్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతామని ప్రకటించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమన్వయంపై బీఆర్ఎస్(BRS) ప్రత్యేక దృష్టి సారించింది. నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో ప్రచారపర్వాన్ని పరుగెత్తించేలా.. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించారు.