Home » LATEST NEWS
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలకు అధికారులు సీలు వేశారు. ఈ నేపథ్యంలో, మైలాడుదురై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్కుమార్(Congress MLA Rajkumar)
ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
Supreme Court Verdict On Kavitha Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) పిటిషన్పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరుగుతోంది. ఇదివరకే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్ను కోర్టు నుంచి కవిత లాయర్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు..
ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. షెడ్యూల్ విడుదలతో రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఐదేళ్ల తమ భవిష్యత్తును తామే రాసుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఏ పార్టీకి అధికారం వస్తుంది..? ఏపీ కాబోయే సీఎం (AP CM) ఎవరు..? ఇదే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రజల మూడ్ మారినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే విషయం అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అహ్మదాబాద్లోని గుజరాత్ ( Gujarat ) యూనివర్సిటీ హాస్టల్లోకి ప్రవేశించిన కొందరు దుండగులు అక్కడ నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం కలగించింది. దీనిపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నీర్జా గుప్తా స్పందించారు.
Andhrapradesh: తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని జనసేన- టీడీపీ - బీజేపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి పాదాల చెంత కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామన్నారు. 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
కర్ణాటక రాష్ట్రం హుబ్లీ - రామేశ్వరం(Hubli - Rameswaram) మధ్య వారాంతపు ప్రత్యేక రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 30వ తేది వరకు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
దేశరాజధాని ఢిల్లీ నగరం మరోసారి చెత్త రికార్డును దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా వరుసగా నాలుగోసారి ఢిల్లీ పేరు నమోదైంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, దేశ రాజధానుల జాబితాను ఇటివల విడుదల చేసిన క్రమంలో వెల్లడించింది.
తెలంగాణ కొత్త గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సోమవారం తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు మే మొదటి వారంలో చేపట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.