కూకట్పల్లి ప్రధాన రహదారిపై నిర్లక్ష్యం..
ABN, Publish Date - Feb 26 , 2026 | 05:27 PM
కూకట్పల్లిలో అనుమతులు లేకుండా జరుగుతున్న రోడ్డు తవ్వకాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తవ్వకాల కారణంగా పైప్లైన్ దెబ్బతిని త్రాగునీరు వృథాగా పారిపోతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
1/4
కూకట్పల్లి ప్రధాన రహదారిలోని వివేకానంద నగర్ డివిజన్, సుమిత్ర నగర్ బస్టాప్ సమీపంలో అనుమతులు లేకుండా రోడ్డు తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
2/4
గత మూడు రోజులుగా ఇష్టానుసారంగా రహదారిని తవ్వుతూ పనులు చేపట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
3/4
తవ్వకాల కారణంగా పైప్లైన్ దెబ్బతిని త్రాగునీరు వృథాగా పారిపోతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
4/4
వేసవి కాలం మొదలైన ఈ సమయంలో నీటి వృథాపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Updated at - Feb 26 , 2026 | 05:28 PM