Home » Hyderabad
2026లో లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... 15 నెలల కాలంలో 60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను, భూములను హైడ్రా రక్షించిందని ఆయన అన్నారు.
యూకేలో డాక్టర్ గా పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను మోసం చేసిన వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి ఆ మహిళ నమ్మించి రూ.3.38 లక్షలకు వసూలు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అసెంబ్లీలో బీసీల వాణి వినిపిస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ...బీసీలు సంఘటితంగా ఉంటూ రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఇస్టారికల్ అని అభివర్ణించారు
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో టమోటా రూ. 50 నుంచి రూ. 60 వరకు ఉండగా.. ప్రస్తుతం ధర తగ్గిపోయింది. కిలో రూ. 31కి విక్రయిస్తున్నారు. అలాగే.. గోరుచిక్కుడును రూ. 45లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా రైతుబజార్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్కు చెందిన పలువురిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలను కొట్టేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.8.24 లక్షలను కొల్లగొట్టారు. తమ ఖాతాల్లో ఉన్న నగదు మాయం కావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సినిమా పైరసీకి పాల్పడ్డ ఇమంది రవి అలియాస్ ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్కు సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది.
ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించిందని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రజల ఆస్తిని సరైన పద్ధతిలో వినియోగించాలని సూచించారు.
బీఆర్ఎస్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
హిడ్మా ఎన్కౌంటర్పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో సంచలన లేఖ విడుదలైంది. హిడ్మా, శంకర్లు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వస్తే పోలీసులు పట్టుకుని చంపేశారని ఆరోపించారు.
పుష్ప-2 సినిమా విడుదల రోజున జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. అటు శ్వాస తీసుకోలేడు.. అటు అన్నం తినలేక ఈ బాలుడు పడుతున్న బాధ అర్ణనాతీతం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి ఏడాది కావస్తున్నా.. ఆ బాలుడు మాత్రం ఇంకా కోలుకోలేదు.