Home » Hyderabad
2024-25 వార్షిక బడ్జెట్పై శాసనసభ, మండలిలలో శనివారం సాధారణ చర్చ జరగనుంది.
జీవో 317 వల్ల అన్యాయం జరిగిన వారిని గుర్తించి, వివరాలను త్వరలోనే అందజేయాలని మంత్రివర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది.
తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
వచ్చే అక్టోబరుకల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎ్స)లోని మొదటి దశలో రెండు యూనిట్లు(ఒక్కోటి 800 మెగావాట్లు) పూర్తి కావాలని ఇంధన శాఖ కార్యదర్శి, జెన్కో సీఎండీ రొనాల్డ్రాస్ ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసమే బడ్జెట్లో నిధులు కేటాయించి ఆర్టీసీని గాలికి వదిలేసిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. బాబు, ఈ. వెంకన్న విమర్శించారు.
కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ మెడలోంచి పుస్తెల తాడు కొట్టేసేందుకు యత్నించి ఇద్దరు దొంగలు అడ్డంగా బుక్కయ్యారు. అంతకు ముందు ఆమె దుకాణంలో సిగరెట్లు కొని.. చేసిన పేటీఎం చెల్లింపు వారి వివరాలను బట్టబయలు చేసింది.
నకిలీ పురుగుమందులను అరికట్టకపోతే ప్రజారోగ్యానికి, పంట భూములకు తీవ్ర నష్టం జరుగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నకిలీ పురుగుమందులను కట్టడి చేసేందుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ, ఆరోగ్య భద్రతా విభాగం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
‘‘స్విస్ చాక్లెట్ లేదంటే బెల్జియన్ చాక్లెట్స్ మాత్రమే అత్యుత్తమం’’ అని చాలామంది అనుకుంటారు! కానీ.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా రైతులు పండించిన కోకోతో ప్రపంచం మెచ్చే చాక్లెట్లను రూపొందించి సంచలనం సృష్టించిన హైదరాబాదీ ‘మనం చాక్లెట్స్’ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది.
గత ప్రభుత్వం దురుద్దేశంతో హైదరాబాద్ రోడ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్)ను ఏర్పాటు చేసిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపై కేంద్రం ఆంక్షలు కొనసాగుతోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రుణం లభించనుంది. తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంక్(టీజీక్యాబ్)కు రూ.5000 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) అంగీకరించింది.