Home » Hyderabad
సైబర్ మోసగాళ్లు జనాల బలహీనతలు, భయాలను క్యాష్ గా చేసుకుని కోట్ల రూపాయాలు కాజేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఏదో ఒక మార్గంలో మనపై సైబర్ కేటుగాళ్లు దాడి చేశారు. తాజాగా ఓ వైద్యుడికి మహిళను ఎరగా వేసి.. రూ.14 కోట్లు కాజేశారు.
నగర టాస్క్ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ బిగ్ షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ర్యాంక్ అధికారులందరినీ అటాచ్ చేశారు. కొందరు అధికారులు టాస్క్ఫోర్స్ డిపార్ట్మెంట్ కొన్నేళ్లుగా పాతుకుపోయినట్లు తెలుస్తోంది.
పరీక్షలకు వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగ నియామకాల జాప్యం యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని, ముందస్తు ప్రణాళికతోనే వారిలో విశ్వాసం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము నిన్ననే నగరానికి రాగా.. ఈరోజు(శనివారం) సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్న సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోగా.. మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై నిఘా పెంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో న్యూ ఇయర్ (2026) వేడుకలను టార్గెట్ చేసుకొని నగరంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ని అరెస్ట్ చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వడ్డెర బస్తీలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే పోలీసుల అప్రమత్తతతో ఈ ఘటనలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కీలక మార్పులు జరగడంతో విచారణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీవీ ఎక్స్ప్రెస్వేలోని పిల్లర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు ఉందంటూ పనిలేని వాళ్లు చేసిన ఆరోపణలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.