Home » Latest News
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ కారు కదలికలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
మణిపూర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం జవాన్లు కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారు.
మహారాష్ట్రలో భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీటమునిగాయి. థానే జిల్లా భివండి, పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో స్పైడర్ మ్యాన్ వేషధారణలో అందరికీ సహాయం చేస్తున్న ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి విజయవాడ కోర్టు షరతులు విధించిన విషయం తెలిసిందే. ఈ షరతులను సవరించాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
గుజరాత్ భావ్నగర్ జిల్లాలో పలిటానా తాలూకాలోని గరజియా గ్రామంలో పశువుల కాపరిపై సింహం దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో శీనూ నాయక్ పర్యవేక్షణలో నిర్వహించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలపై నిషేధానికి అమలు తేదీ ఖరారైంది. జులై 13వ తేదీ నుంచి పోస్టుల సృష్టి, అప్గ్రేడేషన్పై ఏపీ ప్రభుత్వం నిషేధం అమలు చేయనుంది.
గ్రామాల్లో విలేజ్ మార్ట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాల అమ్మకాలు జరగనున్నాయి.