Home » Latest News
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీవీ ఎక్స్ప్రెస్వేలోని పిల్లర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు ఏపీ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువుల మీద జరుగుతున్న దాడులు నరమేధాన్ని ఖండించని వారు అసలు భారతీయులేనా అని ప్రశ్నించారు.
కర్నూలు జిల్లా ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. రోజు రోజుకూ చలి తీవ్రత ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రముఖ సినీనటి ఆమని శనివారం భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరనున్నారు. ఈ చేరిక కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరగనుంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు.
వాతావరణంలో మార్పులు, చలి తీవ్రతతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. విష జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.
యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మీప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
కోడుమూరు పట్టణంలో డీజిల్ దొంగలు పడ్డారు. గురువారం అర్థరాత్రి రోడ్డుపై ఉన్న పలు లారీల డీజిల్ ట్యాంకులను పగులగొట్టి దొంగలు డీజిల్ ఎత్తుకెళ్లారు. నంద్యాలకు చెందిన సత్యరాజ్ అనే డ్రైవర్ తన లారీలో మొక్కజొన్నను లోడ్ చేసుకొని ఆదోనికి వెళ్లారు.