క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం..
ABN, Publish Date - Feb 26 , 2026 | 07:26 PM
వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణతో పాటు శ్రీ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నూతన విగ్రహాల వాయు ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
1/14
వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణతో పాటు శ్రీ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నూతన విగ్రహాల వాయు ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు
2/14
ఈ మహోత్సవాన్ని కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
3/14
భక్తుల నడుమ భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
4/14
ఈ మహోత్సవ కార్యక్రమంలో ABN ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు కోగంటి భాను ప్రకాష్, కోగంటి అనూష దంపతులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. వారు ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన హోమాధి పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
5/14
ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి.
6/14
ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్ల విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు.
7/14
వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు జలాధివాసం, శయనాధివాసం, ధాన్యాధివాసం వంటి పూజా కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు.
8/14
ఇందులో భాగంగా హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామినామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
9/14
ఈ కార్యక్రమాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
10/14
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నూతన విగ్రహాలకు వాయు ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.
11/14
అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
12/14
మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదాన్ని అందజేశారు.
13/14
ఈ ఊరేగింపులో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు హారతులు ఇస్తూ, మంగళవాయిద్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
14/14
గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated at - Feb 26 , 2026 | 07:47 PM