Home » ABN Andhrajyothy
హైదరాబాద్లో గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టురట్టైంది. విశాఖపట్నం నుంచి ముంబైకి రైలు మార్గంలో 39 కిలోల గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని గాంధీనగర్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారనే ఆరోపణలపై ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లోనే బైఠాయించారు.
ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును ఇంకా కొనసాగిస్తోంది. 16 ఏళ్లుగా ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ జట్టు.. టెస్టుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోతోంది.
హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఓ అపార్ట్మెంట్ ఏడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులే హత్య చేసి కిందకు తోసేశారని ఆరోపిస్తూ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
కొంతకాలంగా ఆల్ప్రాజోలం అక్రమ రవాణా నెట్వర్క్పై ఈగల్ ఫోర్స్ భారీ చర్యలు చేపట్టింది. బోధన్లో 15 మంది నిందితులను అరెస్ట్ చేసి 32.5 కిలోల ఆల్ప్రాజోలం స్వాధీనం చేసుకోగా.. డ్రగ్ దందాతో కూడబెట్టినట్లు ఆరోపణలున్న రూ.6 కోట్ల ఆస్తులను గుర్తించి జప్తు ప్రక్రియ ప్రారంభించింది.
దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మనీల్యాండరింగ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసింది. హైదరాబాద్, కడప నగరాల్లోని దాదాపు ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించింది.
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు.
భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్షిప్లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది.
బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా హైదరాబాద్లో పట్టుబడింది. టాస్క్ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నలుగురిని అరెస్ట్ చేసి, 50 ఇంజెక్షన్ వాయిల్స్ను స్వాధీనం చేసుకున్నారు.