Home » ABN Andhrajyothy
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. దీంతో చలి పంజా విసురుతోంది. ఇంకో నాలుగు రోజులపాటు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్కు భారత ప్రధాని మోదీ భగవద్గీతను కానుకగా ఇచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన అనంతరం.. విందు సందర్భంగా ఈ పవిత్ర గ్రంథాన్ని అందజేసినట్టు తెలిపారు.
టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముందని ప్రశ్నించింది. అది ప్రాథమిక అభిప్రాయం మాత్రమే అని కోర్టు పేర్కొంది.
టీటీడీ పరకామణి కేసుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని.. ఈ కేసులో దొరికింది 9 డాలర్లు అని చెప్పుకొచ్చారు.
ఓ తండ్రి తన కూతురు రైలు ఎక్కించడానికి వచ్చాడు. కూతురు రైలు ఎక్కినా కూడా అక్కడే నిలబడి చూస్తున్నాడు. రైలు బయలుదేరే ముందు కూతురు తన తండ్రికి బాయ్.. నాన్నా అని చెబుతుంది. అందుకు ఆ తండ్రి కూడా వీడ్కోలు చెప్పాడు. అయితే ఈ సందర్భంలో..
దత్త జయంతి పర్వదినాన పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ. 2 కోట్ల విలువైన ఇంటి స్థలాన్ని కాకినాడకు చెందిన సి. కుక్కుటేశ్వరరావు ఇచ్చారు.
ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ వ్యక్తి బైకర్ వద్దకు వెళ్లి అతడిపై సడన్గా దాడికి దిగాడు. అతడి మెడను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఆ బైకర్ ఎలాగోలా అతని నుంచి విడిపించుకున్నాడు. ఆ తర్వాత బైకు నుంచి కిందకు దిగాడు. ఈ క్రమంలో..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పరకామణి చోరీ కేసుపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం ఈ కేసుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏపీ ప్రజలందరూ ఆనందంగా ముందుకెళ్తుంటే జగన్ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఏదో ఆయనకు సంబంధించిన నాలుగు ఛానళ్లను పెట్టుకుని హంగామా చేస్తున్నారని విమర్శలు చేశారు. కనీసం ప్రెస్మీట్లో విలేకర్లు వేసే ప్రశ్నలకు కూడా జగన్ సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అవగాహన లేదని మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. అమరావతికి వచ్చి చూస్తే ఆ పనులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. భూ సమీకరణకు, సేకరణకు కూడా జగన్కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.