Home » ABN Andhrajyothy
డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన చట్టాలను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిపాలన వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కదులుతున్న రైలులో ఓ మహిళ మర్చిపోయిన చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బెంగళూరు-మైసూర్ ఎక్స్ప్రెస్వేపై ఒక కుటుంబంపై కొందరు దుండగులు మూకదాడికి తెగబడ్డారు. చిన్న ప్రమాదం కారణంగా కారును వెంబడించి, డ్రైవర్ను రోడ్డుపై లాగి కొట్టిన దృశ్యాలు వెనుక వాహనం డ్యాష్క్యామ్లో రికార్డయ్యాయి.
ఐర్లాండ్ పర్యటన నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్న స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ను రెండో టీ20లో తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో క్రొయేషియా జట్టు నాకౌట్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జట్టు ఫిఫాపై అధికారికంగా ఫిర్యాదు చేసింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అమెరికా ఓడిపోవడంతో ట్రంప్పై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత బెల్జియం స్టార్ ప్లేయర్ రొమేలు లుకాకు చేసిన సెలబ్రేషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి.. జయలలితకు ఒక న్యాయం, జగన్కు మరో న్యాయమా? అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అని ప్రశ్నించారు.
ములుగు జిల్లాలోని పాలంపేట శివాలయానికి కేంద్రం జాతీయ ప్రాధాన్యత హోదా కల్పించింది. రామప్ప చెంతనే ఉన్న ఈ చారిత్రక ఆలయం ఇకపై పురావస్తు శాఖ, ఎన్ఎంఏల పర్యవేక్షణలో జాతీయ వారసత్వ సంపదగా రూపుదిద్దుకోనుంది..
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన విషాదాంతమైంది. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.