Home » Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్లో సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. ఎన్నికల్లో ప్రచారం, కూటమితో కలిసి జనంలోకి వెళ్లే అంశాలపై నేతలకు అగ్ర నాయకత్వం నిర్దేశించింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఎన్నికల మేనెజ్ మెంట్ కమిటీతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Andhrapradesh: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు మరికొంతమంది నామినేషన్ వేశారు. విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్ని మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో కేశినేని చిన్ని ర్యాలీ కోలాహలంగా సాగింది. ర్యాలీ కేశినేని నాని కార్యాలయం వద్దకు రాగానే...
Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయడం లేదంటూ ఎస్ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికి ఎటువంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఫామ్-12 ఇవ్వాలని..
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై మాట్లాడకూడదంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడంపై వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి స్పందించారు. ‘‘న్యాయం కోసం ఇప్పుడు నేను ప్రజల ముందుకు వస్తే.. ఏం చేయాలో తోచక వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టు కెళ్లారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పులివెందులలో వైఎస్ సునీతా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గమైన టెక్కలిలో వైసీపీ (YSR Congress) అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు (Duvvada Sreenivas) ఇంటిపోరు మొదలైంది. తాను ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆయన సతీమణి, టెక్కలి జడ్పీటీసీ వాణి శుక్రవారం ప్రకటించడంతో అధికారపార్టీలో కలకలం మొదలైంది..
టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదని హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంను ఏ విధంగా అభివృద్ధి చేశామో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న హిందూపురం అభివృద్ధి కోసం పని చేస్తున్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 20 నుంచి 30 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు.
Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. న్నికలకు కొద్ది రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన అభ్యర్థుల తరపున వారి కుటుంబసభ్యులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. భర్త కోసం భార్య, తండ్రి కోసం కొడుకు, అన్న కోసం తమ్ముడు ఇలా అభ్యర్థుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ...
Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం ఆలూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల.. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి మీద చిత్తశుద్ది లేదని విమర్శించారు. ‘‘ఇదే ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. ఇక్కడ చెత్త తీసి వేరే చోటకి పంపాడట. ఈ నియోజకవర్గానికి పనికి రాడని వేరే నియోజక వర్గం ఇచ్చాడట’’...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా కాకుండా.. సతీమణి నారా భువనేశ్వరితో (Nara Bhuvaneshwari) నామినేషన్ దాఖలు చేయిస్తున్నారు. మధ్యాహ్నం 01:27 గంటలకు రిటర్నింగ్ అధికారికి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు..