Home » Andhra Pradesh
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎవరైనా విమర్శ చేస్తే విధాన పరంగా ఉండాలన్నారు.
వైసీపీ నేతల బెదిరింపుల వ్యవహారం పరాకాష్టకు చేరింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ చదివిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మధురవాణికి ఫోన్లో బెదిరింపులు వచ్చాయి.
ఏపీ హైకోర్టు సమీపంలో న్యాయవాదుల ఆధ్వర్వంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతిని కాపాడిన ప్రాణదాతగా నాటి మండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్కు పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు రాజధాని రైతులు.
హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతల దాడి యత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల చర్యలపై ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన విశ్లేషణను జీర్ణించుకోలేక.. జగన్ పార్టీ నేతలు దాడులకు దిగడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు.
రాజధాని అమరావతి విషయంలో విషం చిమ్మిందే జగన్ అని ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. మూడుసార్లు మూడు మాటలు మార్చిన జగన్ను వైసీపీ శ్రేణులు నిలదీయాలని అన్నారు.
రౌడీమూకలతో కలిసి మాజీ మంత్రులు.. మీడియా సంస్థపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్తో పాటు అనేక మీడియా సంస్థలపై వైసీపీ వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు.
ఇవాళ హైదరాబాద్లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించారు. ఈ దాడులను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.
అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే మీడియాపై దాడులు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రశ్నించిన మీడియాపై వైసీపీ దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.