Home » Andhra Pradesh
ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మృతిపట్ల ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో శివాలయం శంకుస్థాపన మహోత్సవానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ప్రభుత్వ సహకారంతో వందల ఏళ్లనాటి ఆలయాన్ని గ్రామస్థులు తిరిగి నిర్మిస్తున్నారు.
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలిసే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు చీటీల పేరుతో మోసం చేశాడు. వైసీపీ నేతగా చలామణి అవుతున్న మండాది శ్రీనివాసరావు దంపతులు చీటిల ముసుగులో రూ.70 లక్షలు కాజేశారు.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.
వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మీ స్వరూపంగా పూజిస్తామని అన్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది.
అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.