తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. పండుగ వాతావరణం
ABN, Publish Date - Feb 25 , 2026 | 02:07 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి (బుధవారం) నుండి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వేల సంఖ్యలోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయాన్నే చేరుకున్నారు.
1/10
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం
2/10
హనుమకొండ, హైదరాబాద్లోని పరీక్షా కేంద్రాల వద్ద నెలకొన్న సందడి
3/10
ఉదయం 8 గంటల నుండే విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి కేంద్రానికి చేరుకున్నారు.
4/10
హనుమకొండలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం దగ్గర విద్యార్థులు
5/10
నిబంధనల ప్రకారం విద్యార్థినులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు.
6/10
ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటి సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు.
7/10
అధికారులు 'నిమిషం నిబంధన'ను కఠినంగా అమలు చేయడంతో, విద్యార్థులు పరుగులు తీస్తూ కేంద్రాలకు చేరుకోవడం కనిపించింది.
8/10
పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.
9/10
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది.
10/10
హనుమకొండ, హైదరాబాద్ సహా వివిధ జిల్లాల కలెక్టర్లు పలు కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.
Updated at - Feb 25 , 2026 | 02:07 PM