Home » Telangana
రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ చేస్తున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్, పెద్దెల్లి ప్రకాష్ ఆరోపించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం గోదావరిఖని చౌరస్తాలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ హెచ్చరించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో నిర్వహించిన మూడో విడత ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించా మని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఋధవారం కలెక్టర్ ఓదెల మండలం కొలనూరు జెడ్పీహెచ్ఎస్, పెద్దపల్లి మండ లం పెద్దకల్వల మండల పరిషత్ ప్రాథమికో న్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు పదవీ ప్రమాణక్వీకారం ఎంతో ప్రధానమైనది. గెలుపొందిన వారు పదవీ ప్రమాణం చేస్తేనే సాంకేతికంగా అధికారాన్ని పొందుతారని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం చెబుతోంది. మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికల్లో అదే రోజున ఓట్లు లెక్కింపు అనంతరం గెలిచిన రోజునే సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు అప్పటికప్పుడే వారు ఎన్నికైన ట్లుగా రిటర్నింగ్ అధికారులు ధ్రువపత్రాలను అభ్యర్థులకు అందజేశారు.
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లాలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని సాలెగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించి స్టేజ్ ఆరోలకు పలు సూచనలు చేశారు.
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం జరిగిన తుది విడత ఎన్నికల పోలీంగ్ ప్రశాంతంగా జరిగింది.జిల్లాలో తుది విడత 108 గ్రామ పంచాయతీ సర్పంచులు, 938 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే కాగజ్నగర్ మండలంలోని రేగుల గూడ, చింతగూడ రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు , 186 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి , చిలాటి గూడ గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో ఆ రెండు స్థానాల్లో నామినేషన్లు ఽధాఖలు కాకపోవడంతో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరుగలేదు.
కొమురం భీం జిల్లాలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఇల్లిల్లు తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి..
సిద్ధిపేట జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తంగా 508 గ్రామ పంచాయతీలకు, అదే విధంగా 4508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 399 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 3000 మందిని బైండోవర్ చేశారు.
తెలంగాణలో విద్యుత్ రంగంలో కీలక మార్పులకు సీఎం రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా మూడో డిస్కం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.