Home » Telangana
సైబర్ నేరగాళ్లు పండుగలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రంజాన్ మాసం ప్రారంభమైన తరుణంలో సామాజిక మాధ్యమాల్లో డొనేషన్, రంజాన్ ఆఫర్ల సందేశాల పేరుతో వల విసురుతున్నారు.
ఇద్దరు పిల్లలతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చి 20 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు కేసు మిస్టరీ వీడలేదు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 65, బజ్జి మిర్చి 35, కాకరకాయ 35, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.
సమా జంలో జరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులను చైతన్య వంతులను చేయాలని రామగుండం కమిషనరేట్ షీ టీమ్ ఇన్చార్జి స్నేహలత అన్నారు. పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్లో శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీవో పొల్సాని శశికళ అధ్యక్షతన జరుగుతున్న వార్డుసభ్యుల శిక్షణ తరగ తులకు శుక్రవారం ఎస్ఐ నూతి శ్రీధర్ హాజర య్యారు. ఆయన వార్డు సభ్యులతో మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతిని ధులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
పెద్దపల్లి నియోజవకవర్గంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు యాప్లో నమోదు చేసుకుని ఎరువులు పొందాలని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. కనుకులలో తెలంగాణ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని హాక కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు (3-6 ఏళ్ల లోపు) ఏక రూప దుస్తులు ప్రభుత్వాలు అందించనున్నాయి. గత ఏడాది అక్టోబరులో మహిళా శిశు సంక్షేమ శాఖ కమి షనరేట్ నుంచి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమాధి కారుల కార్యాలయాలకు దుస్తులకు సంబంధించిన వస్త్రం పంపిణీ చేశారు. మండలాల్లోని ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో టైలరింగ్ ద్వారా ఉపాధి పొందే మహిళా సంఘాల సభ్యులకు కుట్టు పనులు అప్పగించారు.
క్రీడల్లో రాణించడం అభినందనీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. హైదరాబాద్లో ఈ నెల 17న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో రాణించిన జిల్లా విద్యార్థులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆటల పోటీల్లో పాల్గొని జిల్లా జట్టు రెండో స్థానం సాధించినందున విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్, షీల్డ్లు అందజేశారు