Home » Telangana
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా కేంద్రా నికి ప్రయాణికుల తాకిడి పెరగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో బస్టాండులో రద్దీ పెరిగింది. కానీ ఆ మేరకు వసతులు మాత్రం కరువయ్యాయి. జిల్లాలో ఉన్న ఏకైక బస్ డిపో ఆసిఫాబాద్. జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ లో రద్దికి తగినంత సదుపాయాలు లేవు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిలో బాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు జిల్లాలోని అన్ని పంచాయతీల సర్పంచ్లు, కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని అదనపు కల్టెర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, జిల్లా రెవెన్యూ అధికారి వేణు, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి పాల్గొన్నారు.
బెజ్జూరు మం డలంలోని తలాయి గ్రామ సమీపంలో జలవిద్యుత్ కేంద్రం నిర్మించాలన్న ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదు. ప్రాణహిత నదిపై జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిజాం హయాంలోనే సర్వేలు జరిపి పనులు ప్రారంభించారు. అప్పట్లో పిల్లర్లు నిర్మించినా పనులు ముందుకు సాగలేదు. నిజాం ప్రభుత్వం పతనంతో పనులు నిలిచి పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జలవిద్యుత్ కేంద్రం పనులు మొదలవుతాయని భావించిన ఈ ప్రాంత ప్రజల ఆశలు ఆవిరయ్యాయి.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యువతి మృతదేహం కనిపించింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేద పాఠశాలకు భూమిపూజ చేయనున్నారు.
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు మార్కెట్ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చేసిన సూచనలపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే.
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) కిడ్నీ మార్పిడిలలో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురంలో అరటి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. 11KV విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.