Home » Telangana
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం ఆధ్వర్యం లో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకపోతుందని, అర్హులైన పేదలందరికి పథ కాలు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. అబ్బాపూర్లో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం మంత్రి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణా రావుతో కలిసి ప్రారంభించారు.
రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సింగరేణి సంస్థ ఖాళీగా ఉన్న భూములను కేటాయించాలని, నిరు పేదలు ఇందిరమ్మ పథకంలో చేసు కుంటున్న నిర్మాణాలను అడ్డుకోవద్దని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాల యంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో సింగరేణి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
కార్మికులు ఉద్యోగుల హక్కుల సాధన, చట్టాల రక్షణకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో కార్మికులచే భారీ ప్రదర్శన అనంతరం ఏఐటీ యుసీ జిల్లా స్థాయి మహాసభలను నిర్వహిం చారు.
కాగజ్నగర్లో బస్ డిపో ఏర్పాటుకు నోచుకోవడం లేదు. పట్టణ జనాభాకు తగ్గట్టుగా రవాణా సౌకర్యా లు లేకపోవడంతో దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. కాగజ్నగర్లో బస్ డిపో ఏర్పాటుకు 30 ఏళ్ల క్రితమే భూమి కేటాయించారు. ఆ భూములు ఇంకా ఖాళీగానే ఉంటున్న కూడా డిపో ఏర్పాటు దిశగా మాత్రం అడుగులు పడడం లేదు.
మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలీ సమాజం ఐక్యతతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఎస్టీ జాబితాలో చేర్చేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు మాలీ కులస్తులను ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు
- పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నాయకులు, కార్యకర్తలు
సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్లో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, సూపర్వైజర్లతో జూం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మ్యాపింగ్ కానీ ఓటర్లు 20,929 మంది ఉన్నారని చెప్పారు. వారందరికి నిర్ణీత గడువులోగా నోటీసులు అందించాలన్నారు. వారి నుంచి ఎన్నికల సంఘం పేర్కొన్న ఆధారాలను స్వీకరించాలని సూచించారు.
ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనేతర పనులతో ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు విద్యార్థుల నమోదు, తొలగింపు, రైస్ బ్యాలన్స్, కిచెన్ గార్డెన్, ఎండీఎం, ఆపార్, ఆధార్ తదితర వివరాల నమోదులో ఉపాధ్యాయులు బిజీ బిజీ.. మరోవైపు అటకెక్కిన సెల్ఫోన్ డిపాజిట్ ఆదేశాలు..వెరసి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన సరైన రీతిలో సాగడంలేదు. ఫలితంగా విద్యార్థులు చదువులో పూర్తిస్థాయిలో వెనకబడి పోతున్నారు.
ఇకపై హైదరాబాద్లో చలానాల నుంచి తప్పించుకోవాలని నంబర్ ప్లేట్లతో ఆటలాడితే కుదరదు. నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.