Home » Telangana
లాకప్ డెత్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై సురేశ్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేయడంపై మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సైను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారని మండిపడ్డారు.
త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ప్రభుత్వ పునరావాస పథకాలు, భద్రతా బలగాల ఒత్తిడి..
నగర టాస్క్ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ బిగ్ షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ర్యాంక్ అధికారులందరినీ అటాచ్ చేశారు. కొందరు అధికారులు టాస్క్ఫోర్స్ డిపార్ట్మెంట్ కొన్నేళ్లుగా పాతుకుపోయినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ' రేవంత్.. ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటాను. రేవంత్ ఇంట్లోని మహిళలను, పిల్లలను, మనుమడి గురించి నేను మాట్లాడను. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో నేను చిల్లర రాజకీయాలు చేయను' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పరీక్షలకు వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగ నియామకాల జాప్యం యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని, ముందస్తు ప్రణాళికతోనే వారిలో విశ్వాసం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
మల్లారెడ్డి అంటే మల్లారెడ్డే.. ఆయనకు ఎవరూ పోటీలేరు.. సాటి రారంతే.. అవునుమరి.. ఏం చేసినా.. ఏం చేయాలన్నా ఆయన వల్లే అవుతుందనిపించేలా మల్లారెడ్డి పనులు ఉంటాయి. కష్టపడ్డ.. పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. కాలేజీలు కట్టిన అంటూ..
సైబర్ నేరాల గురించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక విషయాలను వెల్లడించారు. ఏపీకే ఫైల్స్, ఓటీపీ, బ్యాంక్ ట్రాన్సిషన్ పై అప్రమత్తంగా ఉండాలని , అనుమానాస్పద కాల్స్ వస్తే 1930 లేదా 100 కి కాల్ చేయమని ప్రజలకు తెలియజేశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము నిన్ననే నగరానికి రాగా.. ఈరోజు(శనివారం) సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్న సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోగా.. మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై నిఘా పెంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. దీంతో మూడు పాత కేసులకు సంబంధించి విచారణ పూర్తయింది. సీఎం హాజరుతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.