Home » Telangana
రామగుండం నగరపాలక సంస్థలో శుక్ర వారం నుంచి ఈ నెల 11వరకు పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ను నిర్వహిం చారు. శుక్రవారం 2, 3, 25, 26, 27 డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆర్జీ-1లో డిసెం బరులో 4.47లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికిగాను 3.62లక్షల టన్నుల ఉత్పత్తితో 90శాతం సాధించిందని జీఎం లలిత్ కుమార్ అన్నారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు 33.2లక్షల టన్నులకుగాను 29.62లక్షల టన్నులను సాధించిందని, రూ.3లక్షల టన్నులు వెనుకబడిందన్నారు.
సుల్తానాబాద్ పట్టణంలోని పలు బ్యాంకుల నిర్వాహకులు పటిష్టమైన భద్రత, రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ బ్యాంకు అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రధాన బ్యాంకులను పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేశారు.
వానాకాలం, కాలువల ద్వారా నీరు విడుదల అయినప్పుడు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కెనాల్పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని శుక్రవారం రైతులు నీళ్లలో నిలబడి నిరసన తెలిపారు. మండలంలోని సబ్బితం గ్రామ పరిధిలోని డి-83 కెనాల్ గుండా సాగు నీరు విడుదల చేశారు.
వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిం చాలని ఎస్సై రవికుమార్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం రహదారి భద్రత కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగం గా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్ భవన సమావేవ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ ధూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శలు చేశారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే జల వివాదాల పరిష్కారానికి జల్శక్తి శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
నరేగా పథకంపై, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు.పేదవారి పథకం గురించి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ముఖం బీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు.