Home » Telangana
Telangana: నగరంలో నిన్న (మంగళవారం) హనుమాన్ జయంతి (Hanuman Jayanti) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీర హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గౌలీగూడలోని రామ మందిరం నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు దాదాపు 13 కిలోమీటర్ల మేర శోభాయాత్ర అశేష భక్తజనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. జై హనుమాన్, జై శ్రీరామ్ నామ స్మరణలతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
స్నేహితులతో కలిసి కన్న తల్లిని కడతేర్చిన కొడుకు ఉదంతం దుండిగల్ పోలీస్స్టేషన్(Dundigal Police Station) పరిధిలోని సతీష్ సొసైటీలో జరిగింది. ఇటీవల లభ్యమైన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
రోజుకో మలుపు తిరుగుతున్న ఖమ్మం సీటు పంచాయితీ.. చివరికి అనూహ్యమైన మలుపు తీసుకోనుందా? అక్కడి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం
తెలంగాణలో మెజారిటీ లోక్సభ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ‘‘ఎన్డీయే కూటమి గెలవనున్న 400 పైగా
డ్రైవరన్నా.. మీకిది తగునా.. మీ చిన్న పొరపాటు.. కోటి ఆశలతో రెక్కలు విప్పుతున్న మా జంటను బలితీసుకుందన్నా.. పెళ్లై రెండేళ్లే అయ్యిందన్నా.. ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.. పుట్టబోయే పిల్లల కోసం.. అందమైన జీవితం కోసం ఎన్నెన్నో కలలు కన్నాం.. భవిష్యత్ కోసం మరెన్నో ప్రణాళికలు రచించాం.. అవన్నీ క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి కదన్నా..
Telangana: బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య వార్ ఏపాటితో అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసుకుంటూ దుమ్మెత్తిపోస్తుంటారు. తాజాగా జగదీష్రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇంతకీ ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరుగగా.. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపించగా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది.
Telangana: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం చేవెళ్ల లోక్సభ పరిధిలోని రాజేంద్ర నగర్లో కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా బద్వేల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
గ్రేటర్ పరిధిలో నాలుగు లోక్సభ స్థానాలుండగా.. అందులో రెండు సీట్లలో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు పోటీ చేస్తున్నారు.
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా కరీంగనర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్కు, ఎంపీ బండి సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నువ్వెంత అంటే.. నువ్వెంత అన్న రేంజ్లో ఒరిపై ఒకరు దమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ బండి సంజయ్పై మంత్రి పొన్నం సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతల పట్ల కూడా బండి సంజయ్ వ్యవహార శైలి సరిగా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బండి సంజయ్కు ఈటెల రాజేందర్కు విభేదాలున్నాయని అన్నారు.