ఏపీలో ఇంటర్ పరీక్షలు.. కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి
ABN, Publish Date - Feb 23 , 2026 | 11:23 AM
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది తనిఖీ చేశారు. సీసీ కెమెరాల సంరక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హజరుకానున్న విషయం తెలిసిందే.
1/8
కర్నూల్ టౌన్ మోడల్ కాలేజీలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు
2/8
విద్యార్థిని తనిఖీ చేసి పరీక్షా కేంద్రానికి పంపిస్తోన్న సిబ్బంది
3/8
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
4/8
ఆలస్యం అవుతుందని పరిగెత్తుకుంటూ పరీక్ష కేంద్రానికి వెళ్తున్న విద్యార్థి
5/8
రాష్ట్రంలో ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 5,31,275 మంది విద్యార్థులు హజరయ్యారు.
6/8
పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది.
7/8
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం1,537 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
8/8
పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు సహా ఎలాంటి గాడ్జెట్లకు అనుమతి లేదని ఇప్పటికే విద్యార్థులకు బోర్డు స్పష్టం చేసింది.
Updated at - Feb 23 , 2026 | 11:23 AM