Home » Exams
విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు పెనుసవాల్గా మారాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేగాక వంతశాతం ఉత్తీర్ణత సాధించాలని యాజమాన్యాలు ఒత్తిడి పెంచడంతో వారు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వివరాలాలి ఉన్నాయి.
విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేపధ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.
JEE మెయిన్ 2026 షెడ్యూల్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ వ్యవధిలో, అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను పూరించాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి, పరీక్ష రుసుము చెల్లించాలి. పరీక్ష రాయదల్చుకున్న నగరాలను ఎంచుకోవాలి.
పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో దిద్దే సాఫ్ట్వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఆ సాఫ్ట్వేర్కు ఇండియన్ బిజినెస్ హెడ్గా రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లికి చెందిన ఎం.స్నేహిత్ కొనసాగుతున్నారు.
Andhrajyothy Journalism College: ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అలర్ట్. ఈ నెల 31వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో పరీక్ష వివరాలు, మోడల్ ప్రశ్న పత్రాలను ఇక్కడ అందిస్తున్నాం..
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ) ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 12నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు జేఎన్టీయూ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్ను అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలునాయక్ శుక్రవారం విడుదల చేశారు. గత మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయగా, మొత్తం 15 సబ్జెక్టుల్లో పీహెచ్డీ అడ్మిషన్ల నిమిత్తం 995మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు చేపడుతోందని డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వ దృఢ సంకల్పమని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
పీవో ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసింది. పరీక్ష ఆగస్టు 17, 23, 24 తేదీల్లో జరుగుతుంది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి..
గేట్ పరీక్ష షెడ్యూల్ వచ్చింది. ఐఐటీలతో పాటు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఈ పరీక్ష నిర్వహిస్తారు. గేట్ స్కోర్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు, పీహెచ్డీలో ప్రవేశాలకు..