Home » Student
కార్వేటినగరం మండలం డీఎంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం కీటకాలు కుట్టి 19 మంది విద్యార్థులకు అలర్జీ(దురద), మంటలు వచ్చాయి. వీరిని పుత్తూరు ఆస్పత్రికి తరలించి, బడికి సెలవు ప్రకటించారు. ఈ ఘటనతో కలకలం రేగింది.
విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. అనంతరం వారు భోగాపురం నుంచి విశాఖపట్నానికి బయలుదేరారు.
ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే జులై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటివరకు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆదరణ పథకంలో భాగంగా రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని.. ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రముఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘గ్యాట్-2026’ డ్యూల్ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను గీతం యాజమాన్యం వెల్లడించింది.
బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది.
నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురికాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు
ఏపీ మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వవైభవం వచ్చింది. 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతోఈ స్కూలు మూతపడింది. లోకేశ్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల వచ్చింది.
విద్యతోనే పేదరికాన్ని అధిగమించొచ్చని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. కురుబలు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితాను ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది.