నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సాధారణ రోజులతోపోలిస్తే రెండు రెట్లు అధికంగా మద్యం వ్యాపారం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ మందుబాబులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు వుండడం కూడా మద్యం అమమ్మకాలు పెరగడానికి దోహదపడింది.
కైలాసగిరిపై రైలు బ్రేకులు ఫెయిలై వెనక్కి వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కొత్త సంవత్సరం మందుబాబులు పండుగ చేసుకున్నారు. డిసెంబరు 31వ తేదీన ఏకంగా రూ.12 కోట్ల విలువైన మద్యం తాగేశారు.
రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు.
భూ యజమానుకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే మరో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి, పాసుపుస్తకాలను భూయజమానులకు అందజేస్తారు. ఏ గ్రామంలో ఏ రోజున సభ నిర్వహించేదీ ఆయా మండలాల తహశీల్దార్లు ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేశారు.
విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిన ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
నూతన సంవత్సరంలో అందిరి సహకారంతో జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గురువారం జిల్లా ప్రగతిపై మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2025లో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా అనేక విజయాలను సొంతం చేసుకున్నామని వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద ప్రతి నెల సుమారు రెండున్నర లక్షల మందికి నగదు సాయం అందిస్తున్నట్టు చెప్పారు. 2025లో కొత్తగా 7,419 మందికి పెన్షన్లు మంజురు చేశామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉద్యోగులు మాత్రం ఉసూరుమంటూ కాలం గడిపారు.
సబ్బవరం మండలం గంగవరం గ్రామంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ను, సిమెంట్ స్తంభాలను తొలగించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ బి.చిన్నికృష్ణ మాట్లాడుతూ, గంగవరం సర్వే నంబరు 38/3, 38/4లలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు.
మన్యంలోని పర్యాటక ప్రాంతాలు గురువారం కిటకిటలాడాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది.