ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల పరిసరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు.
జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సమకూర్చడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ముందుకువచ్చింది.
శరవేగంగా విస్తరిస్తున్న మధురవాడ ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) సదుపాయం కల్పించేందుకు జీవీఎంసీ టెండర్ పిలిచింది.
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2026లో పాల్గొనేందుకు విశాఖ విచ్చేసిన నౌకాదళ అధికారులు, వారి కుటుంబ సభ్యులు మరికొందరు శనివారం మండలంలోని పెదగాడిలో గల సంకల్ప కళా గ్రామాన్ని సందర్శించారు.
గోవా గవర్నర్, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సతీసమేతంగా శనివారం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు (అక్రమంగా సంపాదించిన సొమ్మును దాయడానికి, తరలించడానికి ఉపయోగించే బ్యాంకు ఖాతా. ఈ ఖాతా ఒకరి పేరుపై ఉంటుంది.
ఆరిలోవ దుర్గానగర్ సెక్టార్-3లో ఈనెల 11న జరిగిన మహిళ హత్య కేసులో మిస్టరీ విడినట్టు తెలిసింది. హంతకుడు మృతురాలికి తెలిసిన వ్యక్తేనని సమాచారం.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి జరగనున్న పరీక్షలకు ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల పరిసరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థులకు గంజాయిని అలవాటు చేసి వారిని మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం జడ్పీ సమావేశ మందిరంలో ఒకటి, రెండు, ఆరు, ఏడు స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యా శాఖపై జరిగిన చర్చలో అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు మాట్లాడుతూ తమ మండలంలో ఒక ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కొందరు గంజాయి విక్రయిస్తున్నారని ఆరోపించారు.
అనకాపల్లి జిల్లాలో ఇవాళ (శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, వధూవరులు తీవ్రంగా గాయపడ్డారు..