మన్యంలో శుక్రవారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాసి, ఆ తర్వాత వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా శని, ఆదివారాలు బూత్ స్థాయిలో ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలను ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం సీఈవో వివేక్ యాదవ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో చేపడుతున్న ఓటరు జాబితాల స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ జిల్లాలో వేగం పుంజుకుంది. దీంతో శుక్రవారం నాటికి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 80.91 శాతం జరిగింది. జిల్లాలో పెదబయలు మండలం ముందంజలో ఉండగా.. అరకులోయ మండలం వెనుకబడింది.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అంగన్వాడీలు కదంతొక్కారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్ల చీరలు కట్టుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రకశ్మీర్ లంబసింగికి సమీపంలో ఉన్న కృష్ణాపురం పైనరీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) ఐకేవీ రాజు అన్నారు.
ఆదివాసీ రైతులకు ఐటీడీఏ సహకారంతో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్న ది విశాఖ, చింతపల్లి గిరిజన కాఫీ రైతుల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక పరిమిత సంఘం(మ్యాక్స్) ఎట్టకేలకు కాఫీ గింజలను ఓ ప్రైవేటు కంపెనీకి విక్రయించింది. సరైన మద్దతు ధర లభించక ఆరు నెలలుగా కాఫీ గింజలను మ్యాక్స్ గోదాములకే పరిమితం చేసింది. గింజలను భద్రపర్చే పరిస్థితి లేక బెంగళూరుకి చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి కిలో రూ.482లకు విక్రయించింది. అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధర భారీగా తగ్గిపోవడంతో ఈ ఏడాది రైతులకు బోనస్ ప్రశ్నార్థకంగా మారింది.
మండలంలోని యండపల్లివలస కస్తూర్బా విద్యాలయంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. విద్యాలయంలో అసంపూర్తి భవనాలు, రన్నింగ్ వాటర్ లేకపోవడం, మూలకు చేరిన వాటర్ ప్లాంట్ వంటి సమస్యలతో విద్యార్థినులు సతమతమవుతున్నారు. రెగ్యులర్ స్పెషల్ ఆఫీసర్ లేక ఇన్చార్జిలతో కాలవ వెల్లదీస్తున్నారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు విమర్శిసున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మండలంలోని పద్మాపురం మేజర్ పంచాయతీ రణజిల్లెడ జంక్షన్ నుంచి దుమ్మగుడ గ్రామం వరకు తారురోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి.
ఏపీలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మావిగన్పై కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ అంటే మామిడి పండు అని అనుకుంటున్నారని జగన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.