• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

నగరానికి క్రికెటర్లు

నగరానికి క్రికెటర్లు

స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరగనున్న వన్డే మ్యాచ్‌లో తలపడనున్న భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు రాయ్‌పూర్‌ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు.

కాంట్రాక్టర్లతో అండర్‌ స్టాండింగ్‌!

కాంట్రాక్టర్లతో అండర్‌ స్టాండింగ్‌!

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ తీరు వివాదాస్పదమవుతోంది. కమిటీ ఆమోదం పొందాల్సిన బిల్లులు, ఆశీలు వసూలు టెండర్లు అప్పగింత కోసం కొందరు సభ్యులు భారీగా కమీషన్లు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం

మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం జరగనున్న మెగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌కు హాజరయ్యేందుకుగాను గురువారం నగరానికి చేరుకున్న రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌కు విమానాశ్రయంలో ఉమ్మడి జిల్లా నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

ప్రజలకు చేరువగా పంచాయతీరాజ్‌ సేవలు

ప్రజలకు చేరువగా పంచాయతీరాజ్‌ సేవలు

డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాల (డీడీవో) ఏర్పాటు ద్వారా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో పాలన మరింత మెరుగవుతుందని, ప్రజలకు సేవలు చేరువవుతాయని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పర్యవేక్షణ పెరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ అన్నారు.

ఉక్కుకు తొలగని చిక్కులు

ఉక్కుకు తొలగని చిక్కులు

స్టీల్‌ ప్లాంటు విషయంలో కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజలకు చేరువగా పాలన

ప్రజలకు చేరువగా పాలన

సుపరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేసిందని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం నర్సీపట్నం పాత మునిసిపల్‌ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్‌ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాన్ని ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

మద్యం షాపులకు బెల్టు దెబ్బ

మద్యం షాపులకు బెల్టు దెబ్బ

మద్యం బెల్టు దుకాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఆ ప్రభావం మద్యం దుకాణాలపై పడుతున్నది. వైన్‌ షాపులకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. బెల్ట్‌ షాపులు లేకపోవడంతో అనుకున్న మేర మద్యం అమ్మకాలు సాగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే లాభాలతోపోలిస్తే.. లైసెన్స్‌ ఫీజు, షాపుల నిర్వహణ ఖర్చులు, అద్దెలు, సిబ్బంది జీతాలు అధికంగా వుంటున్నాయని, ఈ కారణంగా మద్యం షాపులను మూసివేసి, లైసెన్సులను వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.

జోరుగా వరి కోతలు

జోరుగా వరి కోతలు

వారం రోజుల విరామం తరువాత జిల్లాలో వరి కోతలు పునఃప్రారంభం అయ్యాయి. తుఫాన్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి వాతావరణం తెరిపివ్వడంతో రైతులు వరి కోతల పనులను ముమ్మరం చేశారు. వారం క్రితం కుప్ప వేసిన రైతులు వరి పంటను నూర్చుతున్నారు.

పాడేరు ఘాట్‌ రోడ్డులో కర్రల లారీ బోల్తా

పాడేరు ఘాట్‌ రోడ్డులో కర్రల లారీ బోల్తా

పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే ఘాట్‌ రోడ్డులో కోమాలమ్మ పనుకు మలుపు వద్ద గురువారం ఉదయం కర్రల లోడు లారీ అడుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

డీడీవో వ్యవస్థతో మెరుగైన పాలన

డీడీవో వ్యవస్థతో మెరుగైన పాలన

డివిజనల్‌ అభివృద్ధి అధికారి వ్యవస్థతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుతుందని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చిత్తూరు నుంచి వర్చ్‌వల్‌గా గురువారం ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన డీడీవో వ్యవస్థ ద్వారా జిల్లాలో పంచాయతీరాజ్‌, డ్వామా భాగస్వామ్యంతో ప్రజలకు సేవలందిస్తారన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి