వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడిచేసిన జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ విశాఖపట్నం మూడో అదనపు జిల్లా జడ్డి తీర్పు ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
నగరంలోని కాపులుప్పాడలో గల డంపింగ్ యార్డు నిర్వహణపై కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రపంచమంతా ఏర్పాట్లు చేసుకుంటుంటే విశాఖపట్నంలో మాత్రం ఆ ఛాయలే లేవు. ఒక్క కార్యక్రమం లేదు.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎలమంచిలి ప్రధాన రోడ్డుపై మునిసిపల్ కార్మికులు మానవహారం నిర్వహించారు.
సహజసిద్ధ ప్రకృతి అందాలకు నెలవైన మన్యంలో పర్యాటక అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏజెన్సీలోని అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తున్నా సందర్శనీయ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు కల్పించ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వసతులు కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు మరింత మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నా ఈ ప్రాంతంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్న అపవాదు ఉంది. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏజెన్సీలో పర్యాటకంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
నిఫా వైరస్ కేరళను వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను అప్రమ్తతమైంది.
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి అన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. రిలే నిరాహార దీక్షలు వరుసగా 14వ రోజు కూడా కొనసాగాయి. ‘బాబుతో నేను’ పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన తీరును ప్రజలకు వివరించారు. సాయంత్రం తరువాత పలుచోట్ల కాగడాలు, కొవ్వుత్తులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఫార్మాసిటీలోని కోరి ఆర్గానిక్స్ పరిశ్రమలో మంగళవారం ప్రమాదం జరిగింది. కె.రాజారావు(35) అనే కాంట్రాక్టు కార్మికుడు రియాక్టర్లో పడి మృతిచెందాడు.