జీవీఎంసీ పరిధిలోని కొన్ని జోన్ల నుంచి చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించే కాంట్రాక్టు సంస్థ ‘రాసా’పై అధికారులు అంతులేని ప్రేమ కనబరుస్తున్నారు. ఆ సంస్థ సక్రమంగా పనులు చేయడం లేదని ఇటీవల గుర్తించిన కమిషనర్ కేతన్గార్గ్ రూ.58 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సులకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షలు ప్రహసనంగా మారాయి. గత నెలలో జరిగిన పరీక్షల్లో కొన్నిచోట్ల యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరిగినట్టు అధికారులు గుర్తించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
పుట్టుకతోనే వినికిడి సమస్య కలిగిన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో కూడా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఈ శస్త్ర చికిత్సలను ఈఎన్టీ, గాయత్రీ ఆస్పత్రుల్లో మాత్రమే చేసేవారు. అయితే, గడిచిన నాలుగేళ్లుగా ఈ విమ్స్లోనూ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజలకు సమచారం లేకపోవడంతో ఇక్కడ అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
మార్గశిర మాసం ఆఖరు గురువారం వన్టౌన్లోని కనకమహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నవంబరు 21న మొదలైన మార్గశిర మాసం ఈ నెల 19 (శుక్రవారం)తో ముగియనుంది. మార్గశిర మాసంలో అమ్మవారికి ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
నగరంలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని, ఇందుకు తగిన ప్రమాణాలు పాటిస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో భాగంగా తొలిరోజు బుధవారం కలెక్టర్ జిల్లాకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ గత సమావేశానికి, ఇప్పటికీ నగరంలో కాలుష్యం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయని పేర్కొనడంతో కలెక్టర్ స్పందించారు.
మన్యంలో బుధవారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం పది గంటలైనా పొగమంచు వీడలేదు.
రెండు జిల్లాలను కలిపే ప్రధాన రహదారి గోతులు, రాళ్లు తేలి అధ్వానంగా ఉండడంతో ఆరు పంచాయతీలకు చెందిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఒళ్లు హూనమవుతోందని వాపోతున్నారు.
జిల్లా కేంద్రం పాడేరులో ప్రభుత్వ అతిథి గృహాలు చాలా ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో వసతికి పర్యాటకులు, అతిథులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
హిందూ దేవాలయాలపై జగన్కు ఎందుకు ఇంత ద్వేషమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. హిందువులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాబోయే మూడేళ్లలో 100 శాతం అఽక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చూడాలనుకుంటున్నానని గోవా గవర్నర్ పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు.