నగర శివారులో అభివృద్ధిచేసిన 65 లేఅవుట్లలోని సెంటు భూమిలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి.
జీవీఎంసీలో అధికారులు, ఉద్యోగుల అవినీతికి చెక్పెట్టేందుకు కమిషనర్ కేతన్గార్గ్ ప్రత్యేక దృష్టిసారించారు.
సముద్రం ముందుకొచ్చింది. ఆదివారం అమావాస్య కావడంతో పాటు సముద్రంలో మాన్సూన్ కరెంట్ తీవ్రత ఎక్కువవడంతో అలలు ఎగసిపడ్డాయి.
జిల్లాలో సోమవారం నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జరగునున్నది. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,529 పోలింగ్ బూత్లు వున్నాయి. జిల్లాలోని సబ్బవరం, పరవాడ మండలాలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వుండడంతో వీటిని విశాఖ జిల్లాకు అటాచ్ చేశారు. ప్రతి పోలింగ్ బూత్కు ఒక బూత్ లెవెల్ అధికారి (బీఎల్వో) ఉంటారు.
మండలంలోని తానాంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం సమీపంలో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. పారిశుధ్య కార్మికులు గ్రామంలో సేకరించిన చెత్తనంతటిని సంపద కేంద్రం వద్దకు తీసుకువచ్చి పడేస్తున్నారు.
ఎలమంచిలి సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. దీనికి సంబంధించి ఎస్ఐలు సావిత్రి, ఉపేంద్ర తెలిపిన వివరాలిలా వున్నాయి. ఒడిశా నుంచి కాకినాడకు వరి కోత యంత్రాన్ని వ్యాన్లో తీసుకెళుతుండగా.. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో కొక్కిరాపల్లి జంక్షన్ సమీపంలో వ్యాన్ బ్రేక్డౌన్ అయ్యింది. దీంతో ఒడిశాకు చెందిన డ్రైవర్ రతన్ పూజారి(48), కాకినాడ జిల్లా కరప మండలం గొడ్డటిపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి సుబ్రహ్మణ్యం (30) కిందకు దిగి పరిశీలిస్తున్నారు.
అతని వృత్తి విద్యా బోధన. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మరోవైపు ప్రైవేటు చిట్స్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. అయితే కొంతకాలం నుంచి చీటీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదు. అదే విధంగా వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించడంలేదు. డబ్బులు అడిగితే ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. ఇందుకు సంబంధించి వారు తెలిపిన వివరాలిలా వున్నాయి.
రైల్వే గూడ్స్షెడ్డుకు సమీపంలోని ఇంద్రజ్యుమ్న హాలులో ఐదుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీన ‘పవిత్ర ప్రదేశంపై చిన్నచూపు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
ఇటీవల జపాన్లో జరిగిన అండర్ -18 ఆసియా కప్ హాకీ పోటీల్లో ఇండియా మహిళల జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. జట్టులో ఒకరైన నక్కపల్లికి చెందిన క్రీడాకారిణి నమ్మి గీతాశ్రీ ఆదివారం స్వగ్రామానికి చేరుకుంది.
గత ప్రభుత్వంలో ఏర్పడిన కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపులపై విద్యాశాఖ భారీ కసరత్తు చేసింది.