అంకుడు కర్రతో లక్క బొమ్మల తయారీలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏటికొప్పాకను హస్త కళా హబ్గా, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ అన్నారు.
అనకాపల్లి మండలం కూండ్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కోరాడ అప్పలరాజు, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పురస్కారానికి ఎంపికయ్యారు.
జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రహదారుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. రోడ్లపై ఏర్పడిన గుంతలను పక్కాగా పూడ్చకుండా.. కంటి తుడుపుగా ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. దీంతో కొద్దిపాటి వర్షానికే రాళ్లు లేచిపోయి మళ్లీ గోతులు ఏర్పడుతున్నాయి.
నగర శివార్లలో ఎక్కడికక్కడ వెలుస్తున్న రిసార్టుల్లో అత్యధికం నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల రెండో తేదీన పాయకరావుపేట పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.
రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు అందిస్తున్నతాగునీరు పరిశుభ్రంగా లేదని, అందులో ఈ-కోలి బాక్టీరియా ఉందని పది రోజుల క్రితం కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదించడంతో రైల్వే మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది.
విశాఖపట్నంలో రోడ్డు పక్కన ఫుట్పాత్పై తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేయడం కలకలానికి దారితీసింది.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడానికి సుమారు రూ.1,800 కోట్లతో పనులు చేపడుతున్నామని, వాటిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ సూచించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ శుక్రవారం రిటైర్డ్ తహశీల్దార్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
స్నేహితుడి పెళ్లికి వచ్చిన ఆస్ట్రేలియా యువ జంట హిందూ సంస్కృతీ, సంప్రదాయాలకు ఆకర్షితులై అదే వేదికపై తామూ వివాహం చేసుకున్నారు.