Home » Telangana BJP
తాను కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో ముందు వెనక కట్ చేసి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదేళ్లు తెలంగాణలో తన నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తేల్చి చెప్పారు.
మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ చివరి దశలో ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్ట్ విషయంపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారని.. తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎయిర్లైన్స్ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని వివరించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు.
బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని జేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. పావలా వడ్డీకి కేంద్రం నిధులు ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్లకు అభివృద్ధి పనులు చేయడానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ బీజేపీ నేతల కొట్లాటల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శల వ్యవహారపై బీజేపీ హై జాతీయ కమాండ్ సీరియస్ అయిందని సమాచారం.
భారతదేశంలో విదేశీ వస్తువుల వినియోగం పెరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరి మీద భారతదేశం ఆధారపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అందుకే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.
జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వారికోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని చెప్పుకొచ్చారు.