Home » Telangana BJP
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (KMC) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సరం నేడు అట్టహాసంగా జరిగింది. ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు ఈ రోజు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.
నిజామాబాద్ కార్పొరేషన్ను తామే కైవసం చేసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డితో శనివారం సమావేశం అవుతానని.. ఈ భేటీలో కార్పొరేషన్ల గురించి చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో మేయర్ పదవిని దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు వేడెక్కాయి. భారతీయ జనతా పార్టీని నిలువరించడమే లక్ష్యంగా ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ఒక అరుదైన, ఆసక్తికరమైన మలుపుగా మారింది.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. కానీ కొత్తగూడెం కార్పొరేషన్లో విషయానికొస్తే అమాంతం పొలిటికల్ హీట్ పెరిగింది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ వేళ పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ అభ్యర్థి మృతిచెందడంతో ఆరో వార్డులో పోలింగ్ను వాయిదా వేశారు అధికారులు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు నిప్పులు చెరిగారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఒక్కటి మినహా హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.