Home » BRS
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది..
Telangana: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం చేవెళ్ల లోక్సభ పరిధిలోని రాజేంద్ర నగర్లో కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా బద్వేల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఈనెల 23వ తేదీ వరకు ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈరోజు కవితను అధికారులు వర్చువల్గా జడ్జి ముందు హాజరుపరచనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత పుంజుకుందని ఆ పార్టీ నేత, ఎంపీ లక్ష్మణ్ అభిప్రాయ పడ్డారు. ఈ సారి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయిందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ (Congress) అంటేనే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోడు దొంగలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడోసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.
Telangana: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు.
Telangana: గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటు వేయాల్సింది ప్రజలను కోరుతున్నారు. సోమవారం దుబ్బాకలో రఘునందన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మాజీ సీఎం కాళ్లు మొక్కి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు.
Telangana: రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ కాంగ్రెస్లో చేరతారంటూ గత కొద్దిరోజులుగా వినిపించిన వార్తలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్గౌడ్ వ్యతిరేక వర్గం మాత్రతం కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కలిశారు.