Home » BRS
గులాబీ బాస్కు ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. పార్టీలో అంతర్గత కలహాలు, ఇటు కుటుంబంలో వ్యతిరేక స్వరాలు వినిపించాయి. దీంతో ఏడాది కేసీఆర్కు గండాల ఏడాదిగా గడిచిందని చెప్పొచ్చు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే సరిపోతోందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోతుందా.. నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
నందినగర్లోని నివాసంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించారు.
కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్రావు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అందరికంటే ముందే తన చైర్లో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపటికే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరికి క్యారెక్టర్ లేదని వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారామంటూ చెప్పుకోలేని బతుకు వాళ్లది అంటూ విమర్శించారు.
డ్రగ్స్ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబసభ్యుల భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఉద్యమానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు...
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎక్కడుంటే దానం అక్కడకు మకాం మార్చుతారు.. అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీ ఒడిలో కూర్చున్నారని చింతల విమర్శించారు.
రెండు సంవత్సరాలైతే చాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత గులాబీ జెండా ఎగురుతుందన్నారు.