Home » BRS
తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పేరుతో పేదలకు భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పేదల భూములను రేవంత్రెడ్డి సర్కార్ లాక్కుంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
మాజీ మంత్రి హరీశ్రావుపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శలు గుప్పించారు. హరీశ్రావు కాదు ఆయన అబద్దాల రావు అని ఎద్దేవా చేశారు.
వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద ఇటీవలే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించిందని... కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, అకస్మాత్తుగా ‘భారత్లో మంచి కాలేజీలు లేవు’ అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
అర్ధసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. స్వలాభం కోసం, ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నీటిని, ప్రజలను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు.
‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన టెసరాక్ట్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుపై విచారణ చేయాలి.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయటపెడతామని హెచ్చరించారు.
ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదిన కార్యక్రమాన్ని ఆదివారం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు.