వచ్చే ఏడాది జనవరి 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ యూనియన్ నేతలు రాబోతున్నట్టు సమాచారం. ప్రతి సంవత్సరం జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏదో ఓ దేశాధినేతని భారత్ ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ.. మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘జీ రామ్జీ’ పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా.. చచ్చిందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్. జైల్లో ఉండే దొంగలకు, తీవ్రవాదులకు బయటినుంచి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమంటూ ఆయన మండిపడ్డారు.
చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న సముద్రపు పక్షి కర్ణాటక తీరంలో కనిపించడం కలకలానికి దారి తీసింది. ఆ ట్రాకర్లో చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈమెయిల్ ఐడీ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అందరూ చిన్నమ్మగా పిలిచే శశికళ దారెటు.., ఆమె నిర్ణయం ఏమిటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరో కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో.. ఆమె ఎవరికి మద్దతుగా నిలుస్తారో అన్ని పలువురు చర్చించుకుంటున్నారు.
ఓ వ్యక్తి భార్యకు విడాకులు ఇవ్వటం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తల్లిదండ్రులను చంపేశాడు. శవాలను ముక్కలు చేసి నదిలో పడేశాడు. చివరకు పాపం పండి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.
కష్టకాలం ముగిసిందని ఇండిగో సీఈఓ ఉద్యోగులకు తెలిపారు. 19 ఏళ్లుగా దిగ్విజయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండిగోను ఇటీవలి సంక్షోభం ఒక్క అంశం ప్రాతిపదికగా నిర్వచించలేమని అన్నారు. ఉద్యోగులు ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పారు.
రాష్ట్రంలో.. ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో రానున్న 48 గంటల వరకు ఆకాశం మేఘావృతంగా ఉంటుందని తెలిపింది.
ఊటీ వెళ్లే పర్యాటకులకు అటవీశాఖ కొత్త నిబంధనలను విధించింది. క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల్లో ఊటీకి పెద్దసంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు. అయితే.. వీరు కొన్ని నిబంధనలను పాటించాలని సూచిస్తో్ంది. అటవీ శాఖ అనుమతించిన పర్యాటక ప్రాంతాలను మాత్రమే సందర్శించాలని నిబంధనలు విధించడం గమనార్హం.