Home » National
దానా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. 25న ఈ తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ అప్రమత్తమైంది. 150కిపైగా ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బీజేపీ అగ్రనేత అయిన ఎల్కే అడ్వాణి 1927 నవంబర్ 8న జన్మించారు. 1942 వలంటీర్గా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. 1986 నుంచి 1990 వరకూ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకూ కూడా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ ఇటీవల డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన వైఖరిని ఆయన పునరుద్ఘాటించినట్టు అయింది. దిండిగల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్లుగా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలు, జాబితాల విడుదల పరంగా మహాయుతి కటమి ముందంజలో ఉంది. అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా ప్రధానమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించి అనధికారికంగా ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్లో ఇటీవల మత ఘర్షణల అనంతరం పలువురికి యూపీ అధికారులు కూల్చివేతల నోటీసులు ఇచ్చారు. దీనిని సవాలు చేస్తూ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, జస్టిస్ బీఆర్ గావయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాననం విచారణ చేపట్టింది.
బెంగళూరులో వర్షాల దాటికి నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 10 నుంచి 12 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిధిలాల కింద చిక్కుకున్న కార్మికులు పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం తెలియరాలేదు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుడా వారిని గమ్యానికి చేర్చేందుకు రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ దిలీప్ సింగ్ తెలిపారు. చెప్పారు. ఒక హెల్ప్లైన్ కూడా ఏర్పాటు చేశామన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి తండ్రి లేఖ రాశారు. తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్జప్తి చేశారు. తమ కోసం కొన్ని నిమిషాలు కేటాయించాలంటూ అమిత్ షాను అభ్యర్థించారు.
రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.