పంజాబ్లోని అబోహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించింది. 50 వార్డుల్లో 28 వార్డులు సొంతం చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా, విశ్వసనీయుడిగా, 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పదవి ఆయనను అంత తేలిగ్గా వరించలేదని డీకే జ్యోతిష్యుడు బెల్లూర్ ద్వారకానాథ్ తెలిపారు.
మహారాష్ట్ర పుణె జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి పదకొండి మంది మృతిచెందగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నీట్ పేపర్ లీక్ ఉదంతంపై విచారణ చేట్టిన సుప్రీం కోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై(ఎన్టీఏ) పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని నిఘా వ్యవస్థలు, కమిటీలు ఉన్నా పేపర్ ఎలా లీకైందని ప్రశ్నించింది.
కేరళ రాజకీయాల్లో మరోసారి 'వందేమాతరం'పై వివాదం చోటుచేసుకుంది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పాలసీ అడ్రస్ సందర్భంగా అసెంబ్లీలో 'వందేమాతరం' గేయాన్ని పూర్తి స్థాయిలో పాడకపోవడంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేసారు.
దేవాలయాల్లో వీఐపీ సంస్కృతి, ప్రత్యేక దర్శనాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. ప్రత్యేక దర్శనాలను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్పై ప్రభుత్వం స్పందించేందుకు ఆరు వారాల గడువు ఇచ్చింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనుండటం ఖాయమైంది. నాయకత్వ మార్పు నేపథ్యంలో తన కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య కోరినట్టు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం.
స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడా ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులను వేధించవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశీ అక్రమ వలసదారుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. అరెస్ట్ల భయంతో అక్రమ వలసదారులు అల్లాడిపోతున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా నిజానికి అంత నిశ్శబ్దంగా సాగ లేదు. తాను కుర్చీ ఖాళీ చేస్తూ.. తన తదుపరి వారసుడు డీకే శివకుమార్కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పవర్ ఫుల్ 'పొలిటికల్ టైమ్ బాంబ్'ను బహుమతిగా ఇచ్చి వెళ్లారు.