అసోం, ఈశాన్య రాష్ట్రాలకు దశాబ్దాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని మోదీ చెప్పారు.
లాలూ ప్రసాద్ కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని, చికిత్సకు బాగా స్పందించారని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
మహాత్మాగాంధీ పేరును ఉద్దేశపూర్వకంగానే కేంద్రం తొలగించిందని, ఉపాథి హామీ పథకం రూపురేఖలను కుట్రపూరితకంగా మార్చేసిందని సోనియాగాంధీ తప్పుపట్టారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా గువాహటిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కొత్త టెర్మినల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
పార్టీ అధిష్ఠానాన్ని కలిసేందుకు ఇద్దరు నేతలు వెళ్లే అవకాశం ఉందా అని అడిగినప్పుడు డీకే శివకుమార్ నవ్వుతూ సమాధానమిచ్చారు. మీడియాకు తప్పనిసరిగా చెబుతానని, ఏదీ దాచిపెట్టనని అన్నారు.
బెంగాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వర్చువల్గా ఆ కార్యక్రమానికి హాజరై పలు అభివృద్ధి పనులను ప్రారంభించారాయన.
పశ్చిమబెంగాల్లో టీఎంసీ 'మహా జంగిల్ రాజ్'కు బీజేపీ చరమగీతం పాడుతుందని మోదీ అన్నారు. అవినీతి, ఆశ్రితపక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఆరోపించారు.
తమిళనాడు రాష్ట్రంలో 2017 ఏప్రిల్ 23న కొడనాడు ఎస్టేట్లో జరిగిన హత్య కేసులో ముగ్గురికి అరెస్టు వారెంటు జారీ అయింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నీలగిరి జిల్లాలో కొడనాడు ఎస్టేట్ పేరుతో విలాసవంతమైన భవనం ఉండగా సెక్యూరిటీ గార్డును హతమార్చి అందులోని నగదు, నగలు ఎత్తుకెళ్లారనే విమర్శలొచ్చాయి.
ఇటీవల దేశంలో అమానవీయ ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది మనుషుల వికృత చేష్టలు చూస్తే.. ఇలా కూడా ఉంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి. సంతోషంగా ఆడుకుంటున్న బాలుడిపై వ్యక్తి దారుణంగా దాడి చేశాడు.
ప్రేమ వివాహం జరిగిన రెండున్నరేళ్ల తర్వాత అనుకోని సంఘటన చోటుచేసుకుంది. అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయి తమ్ముడి ముక్కు కోసిపారేశారు. ఇది తెలిసిన అబ్బాయి కుటుంబసభ్యులు అమ్మాయి చిన్నాన్న కాళ్లు నరికేశారు.