Home » National
హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. రాజ్భవన్లో మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు.
ఆలూమగలు అన్నాక గొడవలు సాధారణం. అసలు గొడవలే లేని దాంపత్య జీవితం ఊహించుకోవడమూ కష్టమే. కానీ కొందరు మాత్రం శృతి మించిపోతున్నారు. క్షణికావేశంలో తీవ్ర అనర్థాలకు పాల్పడుతున్నారు. ఎంతో విలువైన నిండు జీవితాన్ని చేతులారా అంతం చేసుకుంటున్నారు.
అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు మంగళవారంనాడు అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ‘ఎన్సీపీ-ఎస్సీపీ’ పేరుతో పాటు ‘మనిషి ఊదుతున్న తుర్రా’ (Man Blowing Turrah) చిహ్నాన్ని ఉపయోగించుకోవచ్చని.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి (National Congress Party) చెందిన శరద్ పవార్ (Sharad Pawar) వర్గానికి సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం అనుమతి ఇచ్చింది. ఆ చిహ్నాన్ని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్నికల చిహ్నంగా రిజర్వ్ చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని (Election Commission Of India) ఆదేశించింది.
'ఇండియా' (I.N.D.I.A.) కూటమి భాగస్వామిగా ఉన్న లెఫ్ట్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న తనపై అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. శశిథరూర్ తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు.
2024 లోక్సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
లోక్సభ ఎన్నికలు 2024 షెడ్యూల్ కూడా వెల్లడైన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికతో పాటు మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టిసారించాయి. మేనిఫెస్టో విడుదలకు సంసిద్ధమయ్యాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలుస్తోంది. ‘‘పాంచ్ న్యాయ’’ పేరుతో 5 అంశాలతో కూడా మేనిఫెస్టోని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తైలపురంలో గల నివాసానికి మంగళవారం ఉదయం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై వచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల గురించి చర్చ జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లను పీఎంకే కేటాయించామని అన్నమలై ప్రకటించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన 'శక్తి' వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. 'ఇండియా' కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకే లు హిందూ మతాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయని, ఇతర మతాలను మాత్రం పల్లెత్తు మాట అనరని ఎద్దేవా చేశారు.