పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, క్యాబినెట్ మంత్రి ధర్మపాల్ సింగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ బిహారీ లాల్ పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
బంగ్లాదేశ్లో హిందూ సోదరులను సజీవదహనం చేస్తుంటే అక్కడి ప్లేయర్లను షారూక్ తన టీమ్ కోసం కొనుగోలు చేయడాన్ని తాము సహించలేది లేదని మీరా రాథోడ్ అన్నారు. షారూక్ పోస్టర్లకు మసిపూయడం, చెప్పులతో కొట్టడం ద్వారా తన నిరసనను తెలియజేశారు.
దేశంలోనే స్వచ్ఛ నగరంగా అవార్డులు పొందిన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత తాగునీటి వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భగీరథ్పురలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకూ 10 మంది మరణించారు. తాజాగా ఆ నీటిని పాలలో కలిపి ఇవ్వడంతో ఐదు నెలల బాలుడు మరణించాడు.
ఔలి రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్లోని స్టోర్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.
పొరుగుదేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, రెండ్రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ ప్రతినిధిగా తాను ఢాకా వెళ్లాలని ఎస్ జైశంకర్ చెప్పారు.
కాలేజీ లెక్చరర్, ముగ్గురు విద్యార్థినీల వేధింపులకు 19 ఏళ్ల యువతి మృతి చెందింది. మానసికంగా వేదనకు గురై..దాదాపు రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగింది.
భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన ఇండోర్లో తాగునీటి కాలుష్యం ఏమిటని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ నిలదీశారు. ఇండోర్లో నీరు లేదనీ, విషం మాత్రమే ఉందని నిప్పులు చెరిగారు.
సర్వేలో భాగంగా 1023 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 5,100 మంది అభిప్రాయాలను కేఎంఈఏ సేకరించింది. ఇండియాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని 91.31 శాతం విశ్వసించినట్టు సర్వే పేర్కొంది.
ఇండోర్లో నీటి కాలుష్యానికి ఏకంగా 10 మంది బలి కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మంచి నీటి పైప్లైన్లోకి మురుగు నీరు చేరడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే పైప్లైన్ను రిపేర్ చేశామని, కొన్ని రోజులు పాటు నల్లా నీటిని తాగొద్దని స్థానికులకు సూచించారు.
హెల్మెట్ ఉన్న వారికి పొలీసులు వెండి నాణేలు అందజేశారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరమో వివరిస్తూ వెండి నాణేలను అందజేశారు. తంజావూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేలా జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.