Home » National
కరువు సహాయక పనుల కోసం కర్ణాటకకు రూ.3,454 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ కరువు ఉపశమనం (ఖరీప్ 2023) కింద నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికలకు వివిద దశల్లో పోలింగ్ జరుగుతుంది. అలాంటి వేళ.. దేశ రాజధాని ఢిల్లీలోని లోక్సభ స్థానాల్లో తమ సత్తా చాటాలని ఆప్ నిర్ణయించింది.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థిని మెడికల్ బోర్డు శనివారంనాడు పరిశీలించింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ గాయపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ క్రమంలో దుర్గాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అసన్సోల్ వెళ్లేందుకు ఆమె హెలికాఫ్టర్ ఎక్కారు.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు మొదట్నించీ పట్టు ఉన్న అమేథి , రాయబరేలి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎవరిని తమ అభ్యర్థులుగా బరిలోకి దింపనుందనే సస్పెన్స్కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. అమేథీ, రాయబరేలికి చెందిన పార్టీ విభాగం నేతలతో కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.
వాయనాడ్(wayanad) పార్టీ యూనిట్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) 'ఫేక్ వీడియో(fake video)'పై కాంగ్రెస్ పార్టీ వయనాడ్ జిల్లా కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలోని మత సామరస్యాన్ని ధ్వంసం చేయడం, పార్టీని ప్రతికూలంగా చిత్రీకరించడమే లక్ష్యంగా ఈ వీడియో ఉందని పార్టీ పేర్కొంది.
వరుసగా మూడు ఎన్నికల్లో గెలుపు..! అప్పుడెప్పుడో నెహ్రూ హయాంలో కాంగ్రె్సకు తప్ప మరే పార్టీకీ సాధ్యం కాని ఘనమైన రికార్డు ఇది. ఉత్తమ ప్రధానులుగా పేరు తెచ్చుకున్న వాజ్పేయీ, మన్మోహన్ సింగ్లకూ అందని ఘనత ఇది..!
దేశ రాజధాని పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ.. విద్యార్థులకు ఇంకా పుస్తకాలు పంపిణీ కాలేదన్న పిటిషన్పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
తమ వినియోగదారుల సందేశాలకు సంబంధించి ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని బలవంతం చేస్తే నిరభ్యంతరంగా భారత్ నుంచి వైదొలుగుతామని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టం చేసింది.
భార్యకు చెందిన స్త్రీ ధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దానిని తీసుకున్నా దానిని తిరిగి ఆమెకు చెల్లించాల్సిన నైతిక బాధ్యత ఆయనపై ఉందని తెలిపింది.