ఓ యువతి సగం కాలిన స్థితిలో ఇంటి బాత్రూములో శవమై కనిపించింది. యువతి చనిపోయిన 4 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో శవం బయటపడ్డం స్థానికులను షాక్కు గురి చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణనుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మను తొలగించాలని కోరుతూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టు పిటిషన్పై విచారణ జరిపింది.
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో కాంగ్రెస్కు చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తినకు చేరుకుని లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వీరంతా కర్ణాటక భవన్లో మకాం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం.
దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలీంగ్ స్టేషన్లలో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్స్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడు, అడ్వకేట్ ఆశిష్ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తనపై, తన కుటుంబ సభ్యులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు తోసిపుచ్చింది.
బిహార్లో బీజేపీ ముఖ్యమంత్రి తొలిసారి పగ్గాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా పదోన్నత పొందే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడాకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన వారం రోజుల ట్రాన్సిట్ బెయిలుపై అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టును సోమవారంనాడు ఆశ్రయించింది. ట్రాన్సిట్ బెయిలు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ పోలీసులను అప్రమత్తం చేసింది.
మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపడిన సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ముందుకు వస్తోందని, రిజర్వేషన్ బిల్లు మహిళలకు సమర్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని, పార్లమెంటు కొత్త చరిత్రను లిఖించేందుకు చేరువలో ఉందని చెప్పారు.
నోయిడాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వేతనాలు పెంచాలని నోయిడా పారిశ్రామికవాడలో మూడ్రోజులుగా నిరసన చేస్తున్న కార్మికులంతా నేడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.