నూతన సంవత్సర వేడుకలను హనుమకొండ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఒకరికొకరూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం అవినీతి నిర్మూలన కోసం జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన వినూత్న కార్యక్రమంలో అధికారులు పాలుపంచుకున్నారు.
హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. అల్లరిమూక రెచ్చిపోయింది. అర్థరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిపై దారుణంగా దాడి చేసింది.
భూపాలపల్లిలోని ఎస్సీ హాస్టల్ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి.. హాస్టల్ వార్డెన్పై సస్పెన్షన్ వేటు వేసింది.
బాలికల హాస్టల్లో ఓ ఆగంతకుడు హల్చల్ చేశాడు. హాస్టల్లోకి చొరబడ్డ ఆ వ్యక్తి.. అతడి స్నేహితులను కూడా అక్కడకు పిలిపించుకున్నాడు. దీంతో బాలికలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మహబూబాద్ జిల్లాలో హత్యకు గురైన వీరన్న కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరన్నను కట్టుకున్న భార్యే హత్య చేయించినట్లు నిర్ధారణ అయ్యింది.
పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలోని దామరవంచ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
మాజీమంత్రి కేటీఆర్ అవినీతిలో కూరుకుపోయి ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నట్లుందని చెప్పుకొచ్చారు. కొందరు తన బొమ్మను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు.
వరంగల్ జిల్లా జాఫర్ఘడ్లో మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో NIA అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇన్నయ్యను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు.