తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేద పాఠశాలకు భూమిపూజ చేయనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురంలో అరటి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. 11KV విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్కు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించి.. ఈ పుష్కరాలను ప్రారంభించారు.
హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలోని బరిస్టా జ్యూస్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
రంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం వేగంగా కసరత్తు చేస్తోంది.
సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. బుధవారం వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళల పట్ల సర్కారు చిన్న చూపు చూస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.
జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటు చేసుకుంది.18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన సంచలనం సృష్టించింది.
భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారని పౌర హక్కుల ఉద్యమ నేత, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివాసీల చరిత్ర అంతా పోరాటమయం అని చెప్పారు.