Home » Telangana » Warangal
ఎన్నికల్లో ఓడిన వారు.. అక్కడే ఏడిస్తే.. గెలిచిన వారు ఇంటికెళ్లి ఏడ్చిన చందాన.. రేపటి పార్లమెంట్ ఎన్నికల ఖర్చులు ఊహించుకోవడానికే అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన నుంచి పోలింగ్ నాటికి తేడా రెండింతలు పెరిగింది. దీంతో అభ్యర్థుల గుండెలు లబ్బు.. డబ్బు.. అని కాకుండా డబ్బు..డబ్బు అంటూ కొట్టుకుంటున్నాయి. 2019 మార్చి 10న లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడితే 18 మార్చికి నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి.
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలిస్తున్నట్లు లేదు. ఓవైపు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీనియర్ నేతలు పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్, బీజేపీ(BJP)లో చేరుతున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్తో పాటు మరికొంతమంది సీనియర్లు బీజేపీలో చేరగా.. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరారు.
వరంగల్: జిల్లా ఎంపీ సీటుపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యమ కారులు ధిక్కరిస్తున్నారు. చాలా మంది ఉద్యమకారులు ఉండగా... ఉద్యమంతో సంబంధంలేని, పార్టీ సభ్యత్వం కూడా లేని కడియం కావ్య ను బరిలోకి దించడం ఏంటని మండిపడుతున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో అక్రమాల పర్వం కొనసాగుతోందని, భూములు, ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన ప్రక్రియలో నిబంధనలకు తిలోదకాలిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆస్తుల రేట్ల ఆధారంగా వసూళ్ల పర్వం కొనసాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయాల్లో పని జరగాలంటే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని, నేరుగా వెళితే పనులు జరుగవని ప్రజలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాల్లో అధికారులు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని మరీ దందా సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయం సమీపిస్తోంది. ఇప్పటికే మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచే అభర్థులెవరో తేలిపోయింది.
చిన్నారులకు పూర్వ ప్రాథ మిక విద్య, బాలింతలు, గర్భిణులకు పౌష్ఠికాహారం అందించి వారి ఆరోగ్య రక్షణ, సంక్షేమంలో అంగన్వా డీ కేంద్రాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి.
అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు(KCR) కొత్త కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని వీడిపోతున్న నేతలను కంట్రోల్ చేయడం గులాబీ దళపతికి ఇబ్బందిగా పరిణమిస్తోంది. పార్టీ మారుతారంటూ వార్త అందడమే ఆలస్యం.. ఆ నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు కేసీఆర్. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్(Aroori Ramesh) బీఆర్ఎస్(BRS)ను వీడి.. బీజేపీ(BJP)లో చేరుతారంటూ వార్తలు వచ్చాయి.
హనుమకొండ: పట్టణంలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రమా చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఆరూరి బుధవారం ప్రెస్ మీట్ పెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వచ్చారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు.
ఎండల తీవ్ర త పెరుగుతోంది. అంతకంతకూ భూగర్భ జలమట్టం పడి పోతోంది. దీంతో నీటిసమస్య తీవ్రమవుతోంది. బావులు, బోర్లలో నీటిమట్టం తగ్గిపోతుండగా.. వాగులు, వంకలు ఎండిపోయి చెరువులు, కుంటలు కళతప్పుతున్నాయి. దాని కి తోడు ఈనెల 23వ తేదీ నుంచి ఎస్సారెస్పీ డీీబీఎం-48 కెనాల్కు నీటి సరఫరా బంద్ కానుంది. అలాగే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎస్సారెస్పీ డీబీఎం-60 కాలువల ద్వారా కూడా నీటిని నిలిపేయనున్నారు. దీంతో భూగర్భ జలాలు మరిం త తగ్గి.. జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి తీవ్రమవనుందన్న ఆందోళన అందరిలోనూ ఉంది. మున్ముందు వేసవిలో పరి స్థితెలా ఉంటుందోనని, మరీ ముఖ్యంగా ప్రస్తుతం సాగు లో ఉన్న పంటలు చేతికందుతాయా లేదా అన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది.
మునిసిపాలిటీల్లో పేరుకుపో యిన పన్నుల వసూళ్లపై మునిసిపల్శాఖ దృష్టి సారించింది. పన్నులను వందశాతం వసూలు చేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. గతంలో ముందస్తు చెల్లింపులపై 5 శాతం రాయితీ ఇచ్చేది. ప్రస్తుతం ఆ ఆఫర్ అమలో ఉన్నప్పటికీ మరోవైపు బకాయిలను కూడా కట్టించేలా ప్రభుత్వం ఆలోచన చేసింది.