తెలంగాణాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రోజుకో రీతిలో ఎత్తుగడలు వేస్తూ సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భూపాలపల్లి జిల్లాలో వెలసిన ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమిటా పోస్టర్? అందులో ఏముందంటే.?
మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ చివరి దశలో ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్ట్ విషయంపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారని.. తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎయిర్లైన్స్ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని వివరించారు.
తమను అన్యాయం చేసినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు కత్తులు నూరుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఉండవని.. గెలిచిన వారిని కాంగ్రెస్ నుంచి గెలిచారని చెప్పుకుందామని భావిస్తున్నారేమో అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.
బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే రిజర్వేషన్ల డ్రామా ఆడారని సీఎం రేవంత్పై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. బీసీలకు ముఖ్యమంత్రి క్షమాపన చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నర్సంపేటలో కొందరు యువకులు తాగిన మైకంలో బూతులు మాట్లాడుతూ ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు.
గుప్త నిధుల కోసం తొవ్వకాలు జరిపి.. భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ బంగారాన్ని పంచుకునే క్రమంలో ఘర్షణలు తలెత్తాయి. ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డును మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిందే అని హరీష్ డిమాండ్ చేశారు.
పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా బంద్కు వ్యాపారులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రైతులు పత్తి తరలించకపోవడంతో ఏనుమాముల మార్కెట్ యార్డు బోసిపోయింది.
తెలంగాణలో వరుస ఘోర రోడ్డు ప్రమాదాలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆయా ప్రమాదాల్లో పలువురు మృతిచెందుతుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
మేడారం వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకుని వనదేవతలను దర్శించుకున్నారు.