జనగామ జిల్లాలో ఓటర్లు పోటెత్తారు. జనగామ, స్టేషన్ఘన్పూ ర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క జనగా మ పట్టణం, జనగామ మండలం శామీర్పేట గ్రామా లు మినహాయిస్తే మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ భూపాలపల్లి నియోజకవర్గంలో మందకొడిగా ప్రారంభైన పోలింగ్ సాఫీగా సాగింది. మొత్తం 317 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 81.02 శాతం నమోదైంది. పలు చోట్ల ఈవీ ఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు వాటిని మార్చి ఓటింగ్ కొనసాగించారు.
జిల్లాలో అసెంబ్లీ పోరు గురువారం ముగిసింది. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మందకొడిగా ఆరంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంది. జిల్లాలోని 539 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం పలుచగా ఓటర్లు కన్పించినప్పటికి.. సాయంత్రం పోలింగ్ ముగింపు నిర్ణీత కాలానికి జోరు పెరిగింది. 5 గంటలకు పలు పోలింగ్ కేంద్రాల ఆవరణలో ఉన్న ఓటర్లు రాత్రి పొద్దుపోయే వరకు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో ఓటింగ్ శాతం కొంత పెరిగే అవకాశం ఉంది.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయభాస్కర్, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నన్నపునేని నరేందర్లు ఇద్దరూ బీసీ బిడ్డలని, వారిని బీసీలంతా కలిసికట్టుగా గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఈ ఇద్దరు వరంగల్ నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారిని మళ్లీ ఎన్నుకుంటే మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. మంగళవారం హనుమకొండలోని కాకతీయ మెడికల్ కళాశాల మైదానంలో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి నిర్వహించిన ప్రజాశీర్వద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సర్పంచ్ నుంచి మంత్రి వరకు కాంగ్రెస్ ద్వారానే అనేక పదవులు అనుభవించి, స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ దొరల పంచన చేరిన డీఎస్ రెడ్యానాయక్ కుటుంబ దందాలకు కాంగ్రెస్ ఓటుతో సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ విజయభేరి సభ ను మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘సకల జనుల విజయసంకల్ప సభ’ విజయవంతమైంది. ప్రధానమంత్రి మోదీ పర్యటనతో కమలదళంలో ఉత్సాహం ఉప్పొంగింది. మధ్యాహ్నం 12.50గంటలకు చేరుకున్న ప్రధాని.. గంటపాటు సభా ప్రాంగణంలో గడిపారు. అక్కడక్కడా తెలుగు పదాలను ఉచ్చరించి మోదీ సభికులను ఉర్రూతలూగించారు. 38 నిమిషాలు సాగిన ప్రసంగంలో మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం కేసీఆర్పై విరుచుకపడ్డారు.
‘పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతులు.. కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు మోసపోరు.. మరోసారి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది..’ అని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. పొలిటికల్ టూరిస్టులను ప్రజలు నమ్మరని, డబ్బు మూటలతో ఎన్నికల్లో గెలవచ్చనే భ్రమలో ఉన్నవారికి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధిని చూపిస్తానని దయాకర్రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారానికి ఇంకా మూ డురోజుల వ్యవధి మాత్రమే మిగిలింది. మంగళవారం సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. 30న పోలింగ్ జరగనున్నది. అంతకన్నా 24గంటల ముందే ప్ర చారానికి తెరపడనుండడంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి అంకానికి తెరతీస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. అగ్రనేతలతో భారీ బహిరంగ సభలను నిర్వహించారు.
సీఎం కేసీఆర్తోనే మానుకోట అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ గెలుపు కోరుతూ శనివారం మంత్రి రోడ్ షో నిర్వహించారు. స్థానిక వివేకానంద సెంటర్ నుంచి ప్రారంభమైన రోడ్షో పురవీధుల గుండా తహసీల్ సెం టర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గులాబీజెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా...! మెడికల్ కాలేజీ వచ్చేదా.. హార్టికల్చర్ డిగ్రీ కళాశాల, మెడికల్ కళాశాల ఏర్పడేదా... పోడు పట్టాలు అందేవా.. అం టూ ఇంత అభివృద్ధి చేసినా సీఎం కేసీఆర్కు అండగా నిలవాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని.. తెలంగాణ అంతా కాంగ్రెస్ గాలి వీస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ విజయభేరి సభ శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరైప్రసంగించారు. బలిదానాల వల్ల ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. పేదల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ కాలెండర్ ప్రకటిస్తామని, మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని ప్రియాంకాగాంధీ హామీ ఇచ్చారు. అందుకు పాలకుర్తి అభ్యర్థి యశస్వినిని గెలిపించాలని కోరారు.