తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.
అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, రోడ్ సేఫ్టీ అన్నిటికన్నా ముఖ్యమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సురక్షిత డ్రైవింగే అన్ని విధాలుగా మేలని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు నిశ్చయించుకున్నారు.
రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో జరిగిన బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని ఆయన కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలు- 66 హామీల పేరుతో ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహించారు. రాష్ట్ర ప్రజానీకం గంపెడు ఆశలతో కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారన్నారు. కానీ, చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలతో కాలం వృథా చేశారని మండిపడ్డారు.
ఒకప్పుడు రాజకీయంగా వెలుగొందిన చేర్యాల ప్రాంతం ఇప్పుడు తన అస్తిత్వం కోసం పోరాడుతోంది.
నగరంలో కొందరు ఆకతాయిలు వాహనాల నంబర్ ప్లేట్లు మార్చేస్తున్నారు. ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు ఇలాంటి దుశ్చర్యల కు పాల్పడుతున్నారు.
చికెన్ సెంటర్ల బంద్ విజయవంతమైంది. బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చా యి. బర్డ్ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించాయి.
భూపాలపల్లి కలెక్టరేట్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కాంట్రాక్టర్పై కలెక్టరేట్ ఉద్యోగి దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అడిగేందుకు కలెక్టర్ కార్యాలయానికి కాంట్రాక్టర్ వీరేందర్ వెళ్లాడు.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని కోటి రూపాయలు పోగొట్టుకున్నారు వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.