ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలకు స్వర్ణముఖి నది, వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. వాకాడు, కోట మండలాల్లో సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి. ఉప్పుటేరు వాగు ఉప్పొంగి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. కైవల్యా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. కండలేరు వాగు సైతం..
నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్థమైందని విమర్శలు చేశారు.
సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.
సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజానాట్యమండలి రూరల్ డివిజన్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు పెంచలయ్య. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించారు.
విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు .. నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది.ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
నెల్లూరు జిల్లాలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
బోటు ఉన్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేరుకున్నారు. ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు బోటును తరలించే చర్యలు చేపట్టారు.
ఏపీలో మొంథా తుఫాన్ తీవ్రరూపం దాల్చుతుంది. దీంతో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.