Home » Telangana » Karimnagar
పంచాయతీ సంగ్రామం ప్రశాంతంగా ముగిసింది. గత నెల 25న ఎన్నికల షెడ్యూల్ జారీతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు దశల్లో జరిగిన ఎన్నికలు 22 రోజులపాటు గ్రామాల్లో సందడి నింపింది. జిల్లాలో బుధవారం జరిగిన చివరి విడత పంచాయతీ ఎన్నికలు కూడా ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసిపోవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేషన్ దుకాణాలను తీసివేయాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లయీస్ హమా లి కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజు అన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తుది విడతలో ఓటర్లు అదే హుషారు తో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు, యువత నిబద్ధతతో పని చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
మండలంలోని తాళ్ళల్లపల్లె గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను కలిశారు.
రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ చేస్తున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్, పెద్దెల్లి ప్రకాష్ ఆరోపించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం గోదావరిఖని చౌరస్తాలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ హెచ్చరించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో నిర్వహించిన మూడో విడత ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించా మని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఋధవారం కలెక్టర్ ఓదెల మండలం కొలనూరు జెడ్పీహెచ్ఎస్, పెద్దపల్లి మండ లం పెద్దకల్వల మండల పరిషత్ ప్రాథమికో న్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ .. ఒంటి గంటకు ముగిసింది. అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఎవరు ఎక్కడ గెలిచారనే పూర్తి సమాచారం ఇక్కడ మీకోసం..