Home » Telangana » Karimnagar
క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు పోలీసులు సేవలను అందించి మన్నలను పొందాలని అదనపు ఎస్పీ చంద్రయ్య కోరారు.
భారతీయ జనతా పార్టీలో పని చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జాతీయ భావన, సిద్ధాంత నిబద్ధత, సేవాభావాన్ని ప్రజల్లో నింపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భార తీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు బండారు రాధిక కోరారు.
వేములవాడ ప్రాంతంలో కక్ష సాధింపు రాజకీయాలకు తావు లేదని వేములవాడ ఎమ్మెల్యే, ప్ర భుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని, విద్యార్థులు ప్రణాళికబద్ధంగా ప్రతిఅంశంపై సాధ నచేసి ఉత్తమ మార్కులు సాధించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్ర వాల్ అన్నారు.
కొత్తపల్లి మున్సిపాలిటీ, శివారు గ్రామాల విలీనంతో నగరపాలక సంస్థ విస్తీర్ణం, జనాభా పెరిగింది. కాని ఆ స్థాయిలో నిధులు రావడం లేదు. దీంతో నగరవాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు.
సాగు లెక్కలు పక్కాగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటల నమోదు ద్వారా రైతులకు బహూళ ప్రయోజనాలు చేకూర్చే దిశగానే కేంద్రం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధానాన్ని తీసుకవచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ పంటల సర్వేను వేగవంతంగా పూర్తి చేసే చర్యలు మొదలుపెట్టింది.
వివాహాలు, శుభకార్యాల సందడి మొదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో భాజాభజంత్రీలు మోగనున్నాయి.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రా లను శనివారం వరకే కొనుగోలు చేపట్టి ఆదివారం నుంచి మూసివేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఇండ్ల వద్ద పత్తి నిల్వలు ఉండటంతో పాటు చేనులలో కూడా ఇంకా పత్తి ఏరాల్సి ఉన్నది.
ఐదు రోజులుగా శిక్షణలో తెలుసుకున్న విషయాలను గ్రామాల అభివృద్ధికి వినియోగిం చాలని ఎంపీడీవో దివ్యదర్శన్రావు అన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఏంఎసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం తారుపల్లి మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో కలెక్టర్ ప్రత్యేక నిధులతో మంజూరు చేసిన డ్యూయల్ డెస్క్ బెంచీలను ఆయన ప్రారంభించారు.