• Home » Telangana » Karimnagar

కరీంనగర్

సీపీవోలో 30 ఏళ్లుగా పాగా

సీపీవోలో 30 ఏళ్లుగా పాగా

అతను ఒక కానిస్టేబుల్‌.. లా అండ్‌ ఆర్డర్‌ లేదా ఇతర సివిల్‌ విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంది. కాని ఒకటి కాదు రెండు కాదు 30 ఏళ్లపాటు సీపీవో(కమిషనరేట్‌ పోలీస్‌ ఆఫీస్‌)లోనే అటాచ్డ డ్యూటీ చేశాడు. హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందినప్పటికీ ఆ విభాగాన్ని వీడకుండా అంటిపెట్టుకుని అక్కడే డ్యూటీ చేశాడు.

మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయ సాధనకు కృషి

మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయ సాధనకు కృషి

జ్యోతిబాఫూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్‌ జెండర్‌ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

భూసార పరీక్షలకు  ముందుకు రాని వలంటీర్లు

భూసార పరీక్షలకు ముందుకు రాని వలంటీర్లు

భూమి సంరక్షణ.. భూసార పరీక్షల ఆవశ్య కతపై రైతులకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున వలంటీర్లను నియ మించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా ఎవరు కూడా ముందుకు రావడం లేదు.

పల్లెల్లో నిరీక్షణ.. బల్దియాల్లో సందడి

పల్లెల్లో నిరీక్షణ.. బల్దియాల్లో సందడి

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి ముగిసి మూడు నెలలు గడిచిపోయింది. పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి పల్లెలో కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మున్సిపల్‌, గ్రామ పాలకవర్గాలకు సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం సభ్యులకు అవకాశం కల్పిస్తారు. మున్సిపల్‌, గ్రామపంచాయతీలో పాలకవర్గాలు కొలువుతీరిన రెండు నెలల్లో కో ఆప్షన్‌ సభ్యుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

జేబీసీసీఐ 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలి

జేబీసీసీఐ 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలి

జేబీసీసీఐ 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలని బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్‌ చేశారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మత్తుపదార్థాల వినియోగా న్ని అరికట్టేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్య తీసుకుం టుందని డీసీపీ భూక్యా రాంరెడ్డి నాయక్‌ అన్నారు.

సుల్తానాబాద్‌ చెరువుకు మహర్దశ

సుల్తానాబాద్‌ చెరువుకు మహర్దశ

సుల్తానాబాద్‌ పట్టణంలో ని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు జీవో నంబరు 170 ద్వారా ఉత్త ర్వులు జారీ చేసింది. మినీ ట్యాంక్‌ బండ్‌ పనుల కోసం ప్రభుత్వం రూ.8.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫూలే ఆశయాలను ఆచరించాలి

ఫూలే ఆశయాలను ఆచరించాలి

మహాత్మాజ్యోతిబా ఫూలే ఆశయాలు, ఆలోచనలను మనమంతా ఆచరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిబాఫూలే జయంతి వేడుకల్లో అద నపు కలెక్టర్‌ వేణుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పూలే స్పూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన: బండి సంజయ్

పూలే స్పూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన: బండి సంజయ్

ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. అణచివేతపై తిరుగుబాటుకు కేరాఫ్ అడ్రస్.. బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యం... మహాత్మా జ్యోతి రావు పూలే అని వ్యాఖ్యానించారు.

కరీంనగర్‌ :  విద్యాశాఖలో కదలని ఫైళ్లు

కరీంనగర్‌ : విద్యాశాఖలో కదలని ఫైళ్లు

ప్రభుత్వశాఖల్లో విద్యాశాఖ ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉంటుంది. వ్యవసాయం, వైద్యం, రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు విద్యాశాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. కరీంనగర్‌ జిల్లాలో మాత్రం విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి