Home » Telangana » Karimnagar
రైతులు మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. శుక్రవారం కోరుట్ల మున్సిపల్ పరిధిలో ని ఎఖీన్పూర్ గ్రామంలోని సింగిల్ విండో భవనంలో ఏర్పాటు చేసిన అన్లైన్ ఎరువుల నమోదుపై విండో చైర్మన్ నర్సరెడ్డితో కలిసి రైతులకు అవగాహన కల్పిం చారు.
అభివృద్ధి, సంక్షేమానికే పంచా యతీ ఎన్నికల్లో ఓటర్లు పట్టం కట్టారని, మెజార్టీ సర్పంచ స్థానాలు కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
అధికారుల సమన్వయంతోనే గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
ముందస్తు అప్రమత్తత ద్వారా విప త్కర సమయాల్లో ప్రాణనష్టాలు తగ్గించువ చ్చునని, వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు.
గ్రాయపంచాయతీ ఎన్నికల స్ఫూర్తి తో జరుగబోయే జిల్లా, మండల పరిషత్, మున్సిపాల్టీల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.
ఎన్నికల వరకే కొట్లాటలు, పంచాయతీలు ఉండాలని, అందరు సమన్వయంతో రాబోయే పరిషత్ ఎన్నికల్లో పనిచేయాలని బీఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ప్రమాద బీమా ఎంతో తోడ్పాటును అందిస్తుందని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
ఐదు రోజులుగా మేడిపల్లి ఓపెన్కాస్టు శివారులో సంచరించిన పులి శుక్రవారం మల్యాలపల్లి శివారులో కనిపించింది. మల్యాలపల్లి గ్రామానికి చెందిన కొమురమ్మ మేకలను మేపడానికి వెళ్లగా పెద్దపులి కనిపించిందని, ఆమె కేకలు పెడుతూ గ్రామానికి చేరుకొని ప్రజలకు తెలపడంతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలించగా పులి అడుగులు గుర్తించారు.
సింగరేణి ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు యాజమాన్యం నిధుల కేటాయింపులో కోత విధిం చడం సరికాదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్ర వారం ప్రెస్భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వేడుకల నిర్వహణకు 40 లక్షలకు పైగా వెచ్చించే వారని, ఈ ఏడాది 8లక్షలు కేటాయించడం సమంజసం కాదన్నారు.
ప్రజాభిప్రా య సేకరణలో ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్క రిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పర్యా వరణ ప్రజాభి ప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు.