Home » Telangana » Hyderabad
నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ల్యాప్టాప్ల దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7 లక్షల విలువైన 10 ల్యాప్టాప్లు, సెల్ఫోన్లతో పాటు ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్లో వేచిచూసే ప్రయాణీకులతో పాటు.. రైలులో ప్రయాణించే వారే లక్ష్యంగా నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ టార్గెట్గానే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. బ్యాంక్లకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారి పోయినవారున్నారని అన్నారు. అధికారంలో ఉన్నామని భయ బ్రంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదన్నారు.
ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
Supreme Court Verdict On Kavitha Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) పిటిషన్పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరుగుతోంది. ఇదివరకే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్ను కోర్టు నుంచి కవిత లాయర్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు..
ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే షకీల్కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. మార్చి 17- 2022 లో రోడ్ నెంబర్ 45లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల బాలుడుపై కారు దూసుకెళ్లింది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు స్పీకర్కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ ఉన్నారు.
Telangana: కోకాపేటలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్ను ఓ ఆటో ఢీకొట్టి.. ఆపై ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే తమ బిడ్డ ప్రాణాలతో లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Telangana: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ హిస్తున్నారని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.