రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. దీంతో చలి పంజా విసురుతోంది. ఇంకో నాలుగు రోజులపాటు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించిందని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రజల ఆస్తిని సరైన పద్ధతిలో వినియోగించాలని సూచించారు.
బీఆర్ఎస్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
హిడ్మా ఎన్కౌంటర్పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో సంచలన లేఖ విడుదలైంది. హిడ్మా, శంకర్లు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వస్తే పోలీసులు పట్టుకుని చంపేశారని ఆరోపించారు.
తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్ సైట్లు హ్యాక్కు గురయ్యాయి. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో వారం రోజులుగా వెబ్ సైట్లు పని చేయని పరిస్థితి.
హెల్మెట్ ఆవశ్యకతపై సర్వేజనా ఫౌండేషన్ హైదరాబాద్లో వినూత్న కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా యమధర్మరాజు వేషధారణలోని వ్యక్తి హెల్మెట్ పెట్టుకోని వాహనదారులను అప్రమత్తం చేశాడు. ఒక తల పోతే ఇంకో తల రాదంటూ సరదా కామెంట్స్ చేశాడు.
హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
రాష్ట్రంలో భారీ పెట్టుబడులు సలక్షణంగా రైజింగ్ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ సదస్సు వేదికగా ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు...
జీహెచ్ఎంసీ పరిధి విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ విస్తరింపును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కోర్ అర్బన్ రీజియన్లో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ విలీనం చేయనుంది.