నగర టాస్క్ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ బిగ్ షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ర్యాంక్ అధికారులందరినీ అటాచ్ చేశారు. కొందరు అధికారులు టాస్క్ఫోర్స్ డిపార్ట్మెంట్ కొన్నేళ్లుగా పాతుకుపోయినట్లు తెలుస్తోంది.
పరీక్షలకు వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగ నియామకాల జాప్యం యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని, ముందస్తు ప్రణాళికతోనే వారిలో విశ్వాసం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము నిన్ననే నగరానికి రాగా.. ఈరోజు(శనివారం) సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్న సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోగా.. మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
మల్లారెడ్డి అంటే మల్లారెడ్డే.. ఆయనకు ఎవరూ పోటీలేరు.. సాటి రారంతే.. అవునుమరి.. ఏం చేసినా.. ఏం చేయాలన్నా ఆయన వల్లే అవుతుందనిపించేలా మల్లారెడ్డి పనులు ఉంటాయి. కష్టపడ్డ.. పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. కాలేజీలు కట్టిన అంటూ..
తెలంగాణాలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అటు ఏపీలో కూటిమి హయాంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. దీంతో మూడు పాత కేసులకు సంబంధించి విచారణ పూర్తయింది. సీఎం హాజరుతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై నిఘా పెంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత తలసాని ఫైరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో..
నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వడ్డెర బస్తీలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే పోలీసుల అప్రమత్తతతో ఈ ఘటనలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.