బావ, బామ్మర్థులతో అవ్వట్లేదని కేసీఆర్ను బయటకు తెచ్చారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ బయటికి వచ్చిన తెలంగాణ రాజకీయంలో ఎలాంటి ప్రభావం ఉండదని విమర్శించారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ సభలు పెడుతున్నారని ఆరోపించారు.
డ్రగ్స్ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబసభ్యుల భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు.
మహిళా కమిషన్ ముందు విచారణకు నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు శివాజీ.
ఆన్లైన్ గేమ్స్కు మరో యువకుడు బలి అయ్యాడు. ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి మోసపోయానంటూ రవీందర్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
డ్రగ్స్ కేసులో టాలీవుడ్, బాలీవుడ్లో గుర్తింపు ఉన్న ప్రముఖ నటి సోదరుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గత సంవత్సరం కూడా డ్రగ్స్ కేసులో నటి సోదరుడు పట్టుబడిన విషయం తెలిసిందే.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఉద్యమానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు...
పిచ్చి ఆలోచనలు మానుకోవాలంటూ కేటిఆర్కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. నిర్మాణత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలంటూ కేటీఆర్కు సూచించారు. కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకుని రావాలని కేటీఆర్కు స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్ను శుక్రవారం విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్న హైదరాబాద్ వాసులకు పాదాభివందనం చేసినా తప్పులేదని కేటీఆర్ పేర్కొన్నారు. నిజమైన మార్పు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రారంభమైందని సంతోషం వ్యక్తం చేశారు. రెవెన్యూ మంత్రి కొడుకు భూములు కబ్జా చేస్తుంటే కేసు పెట్టిన పోలీసు అధికారిని లూప్ లైన్లో పెట్టారని విమర్శించారు.
హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ సాఫ్ట్వేర్ మృతి చెందాడు. అతివేగంగా బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.