సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన విషయం తెలిసిందే.
జల్సాలకు డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు.
గంజాయి దందా మాఫియాగా మారిన వైనంపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల సరఫరా నిరోధంపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ పాత నేరస్థులు పోలీసులకు దొరక్కుండా కొత్తదారుల్లో దందా సాగిస్తున్న వైనంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ విషయానికి వినియోగించ డం ఇటీవల పెరిగింది. అందులో రోజురోజుకూ నూతన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) అన్నిరంగాల్లోనూ కీలకంగా మా రింది. ఏఐ ద్వారా చదువులో వెనకబడిన విద్యార్థుల సామర్థ్యాల ను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇం దుకోసం జిల్లాలో 68 ప్రాథమిక పాఠశాలలను గుర్తించి అందులో 3, 4, 5 తరగతుల్లో వెనకబడిన విద్యార్థులకు ఏఐ ద్వారా పాఠాలు అందించి తీర్చిదిద్దనున్నారు.
చెరువుల్లోకి చేపలు రానున్నాయి. జిల్లాలోని అన్ని చెరువు లు, కుంటల్లో వీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని మొత్తం 661 జలాశయాల్లో 2,82,16,000 చేప పిల్లలను విడుదల చేయనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
కాంగ్రెస్లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చేయూత పింఛన్ల మంజూరుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐదేళ్లుగా పింఛన్ కోసం నిరీక్షిస్తున్న అర్హుల కల నెరవేరనుంది. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొ న్న తరుణంలో ఆరుతడి పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ భావించింది. ఈ మేరకు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించినా అధికారులు ఆశించిన మేర రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపలేదు.
జిల్లాలో విద్యాశాఖ ప్రక్షాళనలో భాగంగా కలెక్టర్ తేజ్సనందలాల్పవార్ ఉపాధ్యాయుల సర్దుబాటుకు పూనుకున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి పలువురు ఉపాధ్యాయులను బదిలీ చేశారు.