రంజానను ప్రశాంతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:33 AM
నేరేడుచర్ల, ఫిబ్రవరి20 (ఆంధ్రజ్యోతి): రంజాన వేడుకలను ముస్లింలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తహసీల్దార్ సురిగి సైదులు అన్నారు.
నేరేడుచర్ల, ఫిబ్రవరి20 (ఆంధ్రజ్యోతి): రంజాన వేడుకలను ముస్లింలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తహసీల్దార్ సురిగి సైదులు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాల యంలో శుక్రవారం నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. మసీదుల వద్ద పరిసరాలు శుభ్రంగా ఉంచ ుకోవాలని, విద్యుత సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. సమావేశంలో నేరేడ ుచర్ల, గరిడేపల్లి ఎంపీడీవోలు సోమసుందర్రెడ్డి, సరోజ, తహసీల్దార్లు స్రవంతి, కమలాకర్, నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్, నేరేడుచర్ల మునిసిపల్ కమి షనర్ నాగరాజు పాల్గొన్నారు.