తన జేబులో ఉన్న డబ్బుతో మద్యం షాపు కనిపించిన ప్రతిచోట ఆగి, తాగాడు. అర్ధరాత్రి అవుతున్నా ఇంకా తాగాలనిపించింది. అయితే ఈసారి మద్యం కొనేందుకు రూ.10 తగ్గాయి. ఆ డబ్బు ఇవ్వమని ఓ వ్యక్తిని అడగ్గా.. అతను ఇవ్వలేదని కిరాతకంగా హత్య చేశాడు. నగరంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుడు, బాధితుడు ఇద్దరూ మద్యం మత్తులోనే ఉండడం గమనార్హం.
శిశువుల విక్రయంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ముఠాతో విజయవాడ గ్యాంగ్కు ఉన్న సంబంధంతోనే శిశువులు ఇక్కడికి వస్తున్నట్టు తేలింది. ముఠాను నడుపుతున్న బలగం సరోజినికి శిశువులను విక్రయిస్తున్న ఢిల్లీకి చెందిన కిరణ్శర్మ, భారతిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
‘విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి కోసం భూసమీకరణకు భూములివ్వండి.. రాజధాని అమరావతిలో ప్యాకేజీ కల్పిస్తాం’ అంటూ సీఆర్డీఏ మాటలు నమ్మి రైతుల వద్ద భూములు కొన్న ప్రైవేట్ వ్యక్తులు నిండా మునిగిపోయారు. గన్నవరం మండలం అజ్జంపూడి గ్రామంలో రైతుల నుంచి 52.74 ఎకరాలు కొన్న ప్రైవేట్ వ్యక్తులు అటు రాజధానిలో ప్యాకేజీ అందక, కౌలు లభించక పదేళ్లుగా అష్టకష్టాలు పడుతున్నారు.
మాజీ సీఎం జగన్పై దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందుల మెడికల్ కాలేజీకి రూ.481 కోట్లు ఖర్చు చేసిన జగన్.. పాడేరు, పార్వతిపురం కాలేజీలకు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కూటమి ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఎంపీలకు కీలక సూచనలు చేశారు.
తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం , సీతారామ ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చారో తమకు అలాగే అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులే ఏపీకి కూడా వర్తించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కానుకల లెక్కింపుకు ఏఐని వినియోగించాలని స్పష్టం చేసింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అర్జున్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారుడు కూనసాని వినోద్ను గుడివాడ వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
ప్రసాదంపాడులో నలుగురు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే వీరిని విజయవాడ ఎంఎస్జే కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చింది.