ప్రభుత్వపరంగా సీఎంలు, ఆశాఖ మంత్రులు చర్చించాల్సిన అంశాలపై తానేమీ మాట్లాడనని జగ్గారెడ్డి తెలిపారు. గతంలో జగన్, కేసీఆర్లు వీటిపై ఎప్పుడైనా చర్చలు చేశారా అని ప్రశ్నించారు.
సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత విజయవాడ కోర్టులో కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ మాయమైపోయాయి. సీబీఐ ఉన్న ఆధారాలతోనే దర్యాప్తు సాగించింది. రెండు నెలల క్రితం దర్యాప్తు పూర్తయిందని హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది.
యోనెక్స్ సన్రైజ్ 87వ జాతీయ వ్యక్తిగత సీనియర్ సీ్త్ర, పురుషుల బ్యాడ్మింటన్ సమరం తుది అంకానికి చేరింది. దేశవ్యాప్తంగా అన్ని రాషా్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 500 మందికి పైగా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించిన ఈ పోటీలు పటమటలోని సీహెచ్ఆర్కే ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నాయి.
గ్రేటర్ విజయవాడ వ్యవహారం చివరి దశకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
అమరావతి అవుటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్).. ఇన్నర్ రింగ్రోడ్డు (ఐఆర్ఆర్).. విజయవాడ వెస్ట్ బైపాస్లు.. కేంద్రంగా గ్రేటర్ విజయవాడకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మూడు ప్రధాన రహదారుల వెంబడి ఉన్న గ్రామాలను ఎంపిక చేయడమే కాకుండా, విజయవాడను ఆనుకుని ఉన్న ర్యాపిడ్ గ్రోత ఏరియాలను లక్ష్యంగా చేసుకుని ప్రజాప్రతినిధులు, యంత్రాంగం సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో విలీన ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో పాటు విజయవాడ విస్తరణకు మార్గం ఏర్పడుతుంది. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభ కనబర్చేలా అధ్యాపకులు చూడాలని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచించారు. తానూ నిమ్మకూరు రావడం స్వీట్ మెమరీ అని.. ఇది మా తాత లక్ష్మయ్య ఊరని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మ, తమను నిమ్మకూరు పంపించేదని అన్నారు.
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వంలో విలీనం అనంతరం మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని సర్కార్ నిర్ణయించింది.
నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. విద్యార్థులతో మాట్లాడిన భువనమ్మ.. నిమ్మకూరుకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితుడిని ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరాలపై సంచలన విషయాలను సీఐడీ డీజీ మీడియాకు తెలియజేశారు.
నగరంలో జరుగుతున్న 87వ జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో రాకెట్ల మధ్య జరుగుతున్న రసవత్తర పోరు క్రీడాకారుల బలమైన ఆశయాన్ని తెలియజేస్తోంది. పటమట సీహెచ్ఆర్కే ఇండోర్ స్టేడియం, గురునానక్ కాలనీలోని సాయిసందీప్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యోనెక్స్ సన్రైజ్ బ్యాడ్మింటన్ జాతీయ సీనియర్ స్ర్తీ, పురుషుల పోటీలు గురువారం నాల్గోరోజుకు చేరాయి.