సానుకూల వాతావరణం ఉన్నప్పుడు లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కులమత విద్వేషాలు పెంచేలా చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని.. ఎస్సీలను పావులుగా వాడుకుని రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లే అవుట్ పనుల పురోగతిపై చర్చించారు.
దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. బుసాన్లో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో APEX-Korea కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజును విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు కోర్టు అనుమతి ఇచ్చింది.
సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
నైరుతి రుతుపవనాలు, ఎల్నినో ప్రభావంపై ఉన్నతస్థాయి అధికారులతో హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తుల వలన ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యమని వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న క్రమశిక్షణా చర్యల కేసులపై చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7,827 క్రమశిక్షణా కేసులు పెండింగ్లో ఉండగా, వాటిలో 11,600 మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి విజయవాడ కోర్టు షరతులు విధించిన విషయం తెలిసిందే. ఈ షరతులను సవరించాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.