కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్వోసీలను ఎప్పటికప్పుడు అందిస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలకు కష్టకాలంలో అండగా నిలబడుతున్నామని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీలో జనగణన విధుల్లో నిర్లక్ష్యం వహించిన 10 మంది ఆర్పీలపై (రిసోర్స్ పర్సన్స్) జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విధులకు గైర్హాజరైన 10 మంది ఆర్పీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జగన్ పూర్వీకుల చరిత్ర, ఆయన చరిత్ర ఏంటి అనేది ప్రపంచంలో అందరికీ తెలుసని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎన్ని దారుణాలు చేశారో, ఎన్ని హత్యలు చేశారో రాయలసీమలో ఏ గడపని అడిగినా చెప్తారని అన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమావేశమయ్యారు. పోలవరం ఎమ్మెల్యేగా ఆయన పని తీరుపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు.
అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు.
స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా వందశాతం స్వచ్ఛాంద్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి శాంతి దూత ప్రవచనాలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. గురువారం నాడు జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు.
పెన్షన్లపై మాజీ సీఎం జగన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారంటూ జగన్ పచ్చి అబద్ధం చెప్పారన్నారు.
రెండో వారం ‘నో వెహికల్ డే’ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. ట్రైన్లో విజయవాడకు చేరుకున్న మంత్రి.. అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.