Home » Andhra Pradesh » Krishna
ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు నామినేషన్ పరిశీలన ప్రక్రియ టెన్షన్ పెట్టింది. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్లో తప్పులున్నాయంటూ టీడీపీ నాయకులు ఆధారాల సహా ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించి కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మైలవరంలోకి వైసీపీ ఫ్యాక్షన్ గ్యాంగ్ ప్రవేశించింది. బైపాస్ రోడ్డులోని శ్రీకృష్ణ సూపర్ మార్కెట్ను కొంతకాలం కిందట మూసేశారు. దీనిని వైసీపీ నాయకులు అద్దెకు తీసుకున్నారు. అందులో మంచాలు, ఏసీలు ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల క్రితం రాయలసీమలోని కడప, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 70 మంది ఇక్కడికి వచ్చి ఉంటున్నారు.
సీఎం జగన్పై ఈనెల 13వ తేదీన జరిగిన గులకరాయి దాడికి సంబంధించి పోలీసులు కొత్త సమాచారాన్ని రాబట్టారా? పోలీసు కస్టడీలో ప్రధాన నిందితుడు వేముల సతీష్ కుమార్ ఏ విషయాలు వెల్లడించాడు? అనే అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1350కోట్లు టర్నోవర్ చేయాలని కృష్ణా మిల్క్ యూనియన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. శుక్రవారం పాలఫ్యాక్టరీలో పాలకవర్గ సమావేశం అనంతరం మీడియతో ఆయన మాట్లాడారు.
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్ర్కూటినీలో భాగంగా విజయవాడ పార్లమెంట్, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి 125 నామినేషన్లు ఆమోదం పొందగా.. 85 నామినేషన్లు తిరస్కణకు గురయ్యాయి.
కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి సమక్షంలో 500 మందితో కలిసి జనసేన పార్టీలో చేరుతున్నామని వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ గోకరకొండ బలరాం, కొయిలాపు రాములు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు, ఇతర రిటర్నింగ్ అధికారుల నుంచి విషయాలను తెలుసుకుంటున్నా
పెడన ఆర్వో కార్యాలయంలో ఆర్వో పి.వెంకట రమణ పెడన నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్ల పరిశీలనను శుక్రవారం నిర్వహించారు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మచిలీపట్నం-రేపల్లె రైలు మార్గం నిర్మించి తీరుతామని, ఇందుకు డీపీఆర్ సిద్ధం చేశామని బందరు ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. బందరులో శుక్రవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన చేనేత కార్మికుల సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరి స్తామని టీడీపీ-జనసేన-బీజేపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు.