రుషికొండ ప్యాలెస్ వినియోగానికి సంబంధించి టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని.. వాళ్లకు ఎలా వినియోగంలోకి వస్తుంది అన్న దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. హోటల్ కోసం కొందరు ముందుకు వచ్చారన్నారు.
ఆరోగ్య వ్యవస్థను పటిష్టత చేసే యోచనలో ముందుకు వెళ్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం తీసుకొస్తున్న వివిధ నూతన విధానాలపై చర్చ జరిగింది. అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు.
వైసీపీ అధినేత జగన్కు మరో షాక్ తగిలినట్టయింది. ఆయన సమీప బంధువు అర్జున్ రెడ్డికి నోటీసులిచ్చారు గుడివాడ పోలీసులు.
తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన ఆత్మార్పణంతో రాష్ట్రం రగిలిపోయిందని గుర్తు చేశారు.
మెడికల్ కాలేజీల అంశంపై లోక్సభలో వైసీపీకి ఎంపీ కేశినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రి నారా లోకేష్ కోరారు. వివిధ ప్రాజెక్ట్లపైనా కేంద్రమంత్రితో లోకేష్ చర్చించారు.
కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి భవానీలు భారీగా తరలి వస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో భవానీ దీక్షా విరమణలు సోమవారం ముగిశాయి.
మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరోదాత్తుడు పొట్టిశ్రీరాములు అని సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు.