వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి పేర్నినానికి నూజివీడు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విషయంలో పేర్నినానిపై న్యాయస్థానం చర్యలకు ఉపక్రమించింది.
CM Chandrababu: సెర్ప్ను తీసుకొచ్చి నేటికి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. లక్షలాది గ్రామీణ మహిళల జీవితాలలో, వేలాది గ్రామాలలో నిరంతరం అభివృద్ధి వెలుగులు నింపుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనకు సెర్ప్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
NTR District TDP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.
Yanamala: రూల్ ఆఫ్ లా సాక్షి యాజమాన్యానికి, సాక్షిలో పని చేసే సిబ్బందికి వర్తించదా.. అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైఎస్ పాలనలో, జగన్ హయాంలో మీడియా వాచ్ పేరుతో నాటి ప్రభుత్వాలు నల్ల చట్టాలు తీసుకురాలేదా అని నిలదీశారు.
నేడు యువత ఎక్కువుగా డ్రగ్స్, గంజాయికి బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. డ్రగ్స్ వల్ల ఆ కుటుంబమే కాదు.. సమాజంపై కూడా ప్రభావం పడుతోందని తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణ అలైన్మెంట్లో వివాదాలు అలముకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 20 కిలోమీటర్లకే విస్తరణను పరిమితం చేయడంపై ఎంపీ కేశినేని చిన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. గొల్లపూడి వరకు విస్తరణ జరగాలని ఆయన పట్టుబట్టారు.
కన్స్ట్రక్షన్ కంపెనీ ముసుగులో జరుగుతున్న గంజాయి వ్యాపారం కేసులో అనేక చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఐదుగురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేయగా, పెనమలూరు మండలం కానూరు నారాయణపురం కాలనీకి చెందిన బిక్కి నరేంద్ర వ్యవహారాలు బయట పడుతున్నాయి.
16వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మించే డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్కు సంయుక్త డీపీఆర్ తయారుకానుంది.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్ డీఏ)లో జరిగిన బదిలీల్లో గంద రగోళం ఏర్పడింది. కౌన్సెలింగ్ పద్ధతిలో బదిలీలు నిర్వహించినా, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఉద్యోగులు కోరుకున్న మండలాలకు పోస్టింగ్ ఇవ్వకపోవడం, ఇంతవరకు జాబితాలను విడుదల చేయకపోవడంతో గందరగోళం ఏర్పడింది.
Deputy CM Pawan: కూర్మగ్రామంలో అగ్నిప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ఘటన దురుదృష్టకరమన్నారు.