గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కంప్యూటర్ల కొనుగోల్మాల్ వ్యవహారాలపై అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గోల్మాల్ వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్త పాలన.. అక్కరకు రాని పంట నష్టపరిహారం.. అడ్డదిడ్డంగా ప్రధాన కాల్వలు, డ్రెయిన్లు.. తీవ్రమైన సాగు, తాగునీటి ఎద్దడి.. పట్టించుకునేవారు లేరు. పరిష్కరించే నాథుడు రాడు. దీంతో ఐదేళ్ల తర్వాత కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వంపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా జరిగే జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంపైనే అందరి దృష్టి పడింది. చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సమగ్రంగా చర్చించి, సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఐదేళ్ల తరువాత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకుండా జరిగే సమావేశం కూడా ఇదే కావడం విశేషం. - ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం
ఆ సీటంటే తహసీల్దార్లకు భలే స్వీటు. ప్రస్తుతం బదిలీల నేపథ్యంలో సొంత జిల్లాలకు వస్తున్నవారు దీనిపై కన్నేశారు. ఇంతకీ ఎక్కడుంది ఈ సీటు? ఏమా స్వీటు కథ? అనుకుంటున్నారా? అయితే విజయవాడ రూరల్ మండలానికి వెళ్లాల్సిందే.
దుర్గగుడిలో వారిద్దరి స్టైలే వేరు. ఎన్ని బదిలీలైనా, ఎన్ని రోజులైనా కాసులు కురిపించే కీలక స్థానాలను మాత్రం వారు వదలరంటే వదలరు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, విజిలెన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వారిద్దరినీ పక్కన పెట్టేవారే ఉండరు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని పోస్టులను ఏరికోరుకుని మరీ ఎంచుకుని కూర్చుంటారు. వీరిలో ఒకరి ఉద్యోగ నియామకంలోనే వివాదాలున్నా.. మరొకరిని ఏసీబీ కేసులు వెంటాడుతున్నా.. తాజాగా జరిగిన దుర్గగుడి అంతర్గత బదిలీల్లో ప్రాధాన్యమైన పోస్టులు కల్పించడం వెనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
రాష్ట్రంలో ప్రైవేట్ బస్సుల దోపిడీని అరిక ట్టాలని రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య కోరారు.
పెడన నియోజకవర్గంలో ఇంకా జోగి రమేశ్ హవా కొనసాగుతోందా? నియోజకవర్గంలో ఆయన చేసిన భూదందాలు, అసైన్డ్, ప్రభుత్వ భూముల స్వాధీనంలో జరిగిన అక్రమాలు బయటపడకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నారా? పెడన నుంచి పెనమలూరు వెళ్లినా, ఆయనకు గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్న కీలక వ్యక్తులు, అధికారులు ఎవరు? అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఐదేళ్లుగా జోగి రమేశ్ చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసుకునేందుకు, తనకు అనుకూలంగా ఉండే తహసీల్దార్లను కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
వైద్యులు, ఆస్పత్రులపై దాడుల నుంచి రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) డిమాండ్ చేసింది.
కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఎం ఆరోపించింది. అన్యాయంపై పోరాడేం దుకు టీడీపీ ముందుకు రావాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
మహానాడు జం క్షన్ నుంచి నిడమానూరు వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ పను లు త్వరగా ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కోరారు.
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు