కేరళంలోని శబరిమలలో అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం వెళ్లే తెలుగు స్వాములు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఆ భక్తుల సమస్యల పరిష్కారానికి తాము చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు.
జగ్గయ్యపేట సీఐ తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు సీఐ వెంకటేశ్వర్లు అతిగౌరవం చూపించారని ఫిర్యాదులు అందడంతో సీరియస్ అయ్యారు.
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్పై సోషల్ మీడియాలో వైసీపీ విషప్రచారం చేస్తోందంటూ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వర రావు.. పలువురు టీడీపీ నేతలతో కలిసి గుడివాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వికసిత్ భారత్ లబ్ధిదారులు ప్రస్తుత యువత అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. 40 ఏళ్ల వయసు తరువాత యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
వివిధ విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
అన్నయ్య చిరంజీవి గురించి తలచుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు సీఎం అందజేశారు.
మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు.
ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు.