విజయవాడ విమానాశ్రయం నుంచి విజయవాడ-హైదరాబాద్ మధ్య వైడ్బాడీ విమానాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన కృషి ఫలించింది. ఢిల్లీలోని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన నాయుడు కార్యాలయంలో గురువారం ఇండిగో ఫ్లైట్ స్పెషల్ డైరెక్టర్ ఏకే సింగ్తో ఎంపీలు కేశినేని, జీఎం హరీశ్తో సమావేశం నిర్వహించారు.
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ ప్రక్షాళన మొదలైంది. భక్తులకు సరైన సేవలు అందకపోవడంపై ఆగ్రహించిన సీఎం చంద్రబాబు.. ఈవో కిశోర్కుమార్పై వేటు వేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ కమిషనర్ క్యాడర్ కలిగిన మహేశ్వరరెడ్డిని నియమించారు. బుధవార ం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహించిన సమీక్షలో పెనుగంచిప్రోలు దేవస్థానానికి వచ్చే భక్తులకు సరైన సేవలు అందట్లేదనే విషయం బయటపడటంతో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
నిడమానూరు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్కు జాతీయ రహదారుల సంస్థ మంగళం పాడేసింది. ఎన్హెచ్ విజయవాడ డివిజన్ అధికారులు పంపిన డీపీఆర్ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్) తిరస్కరించింది. విజయవాడ వెస్ట్ బైపాస్ మరికొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో నిడమానూరు ఫ్లై ఓవర్ అవసరం లేదని నిర్ణయించింది. ఈ కారణంగా ఆ ఫ్లై ఓవర్ను రద్దు చేసింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు డీపీఆర్ను పంపడంలో జరిగిన జాప్యం, మెట్రోరైల్ కారిడార్తో లింకుపెట్టడం వంటి చర్యలు కాలాతీతానికి దారితీశాయి. ఈలోపు విజయవాడ వెస్ట్ బైపాస్ తుదిదశకు చేరుకోవడంతో మోర్త్ తన ఆలోచనను మార్చుకుని ఫ్లై ఓవర్ను రద్దు చేసింది.
తాను చదువుకునే రోజుల్లో తెలియక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. తాను వీధి బడిలో చదువుకుని... ఉప రాష్ట్రపతి వరకు వెళ్లానని తెలిపారు.
పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో పారదర్శక వ్యవస్థ సృష్టిస్తే తమపై నిందలా అంటూ మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్ను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు.
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ భక్తులకు భద్రత కరువైంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయా నికి వచ్చే భక్తులపై స్థానికులు దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆలయం దగ్గర భక్తులపై వరుస దాడులు జరగటమే ఇందుకు నిదర్శనం. ఈ దాడులను అరికట్టేందుకు పోలీసులు, దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
స్క్రబ్ థైపస్ కేసులు జిల్లాను వణికిస్తున్నాయి. జీజీహెచ్లో కేసులు పెరుగుతుండటంతో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధికారులు తగు జాగ్రత్తలు చెబుతున్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో స్క్రబ్ థైపస్ ఉంటుందని, అక్కడ సంచరించే జీవుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుందని వైద్యులు వెల్లడించారు. ముఖ్యంగా వర్షాకాల పంటలు వేసే జూలై నుంచి జనవరి సమయంలో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, ఎలుకల ద్వారా మొక్కలపైకి చేరి దానిద్వారా రైతును కుట్టే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.
పేరుకే గ్రామాలైనా అవి ఇతర పంచాయతీలకు అనుబంధంగా ఉంటాయి. ఈ కారణంగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. రోడ్లు, డ్రెయిన్లు, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ వంటి కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోవు. తమ ప్రాంతాలు పంచాయతీ పాలకవర్గాల చిన్నచూపునకు గురవుతున్నాయన్న ఆవేదనతో ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఠంచనుగా పన్నులు వసూలు చేస్తున్న పంచాయతీలు ఈ అనుబంధ గ్రామాలపై రూపాయి ఖర్చు పెట్టట్లేదు. పంచాయతీల పునర్విభజనపై నిషేధం ఎత్తివేస్తూ, పునర్నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో దృష్టి సారించాల్సిన గ్రామాల పరిస్థితి ఇలా ఉంది. - (ఆంధ్రజ్యోతి, విజయవాడ)
రాజీనామా విషయంలో జాకియా ఖానం కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు.. రాజీనామా పత్రాన్ని సమర్పించారు.