Home » Revanth Reddy
రైతు భరోసా తుది విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అన్నదాతల నిధులు విడుదల చేసేందుకు బటన్ నొక్కారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించనున్న 2వ తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పాల్గొనాలని కెనడాకు చెందిన కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహ్వానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణంలో అవినీతి వంటి అంశాలను ప్రజాభవన్ వేదికగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కీలక చర్యలు చేపట్టారు. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం క్యాంపస్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
దొరలకు సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చని.. పేదల మధ్య పెరిగిన తనకు సమస్యలు తెలియవా? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తట్ట పనికి, మట్టి పనికి మనమే కావాలి.. కానీ, పరిపాలనకు పాలమూరు బిడ్డలు పనికిరారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు.. మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ రాశారు. ఆర్బీఐ గణాంకాలు, అసెంబ్లీలో చేసిన ప్రసంగాల వీడియోలను వాట్సాప్ ద్వారా పంపినట్లు వెల్లడించారు.
‘సవాలు చేస్తే కట్టుబడండి. తెలంగాణ భవన్కు వస్తానని సవాలు విసిరి ఎందుకెళ్లలేదు? అక్కడికి వెళ్లకుండా సీఎల్పీలోనే ఎందుకున్నారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక మంత్రిని ప్రశ్నించినట్టు సమాచారం.
హైదరాబాద్ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అనలాగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ కిప్మాన్ బుధవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి టి. హరీశ్ రావు స్పష్టం చేశారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని సీఎంకు ఆయన సూచించారు.
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు.