Home » Revanth Reddy
కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకోవడంతోపాటు రైతాంగ శ్రేయస్సు, రాష్ట్ర సుభిక్షం కోసం వరుణ యాగం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఆగస్టు 10వ తేదీ ముహూర్తం ఖరారు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు అధికారికంగా వేగం పుంజుకుంది.
తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగష్టు 20 నుంచి సెప్టెంబరు 8 వరకు దాదాపు 20 రోజులపాటు వివిధ దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. అమెరికా, యూకే సహా మరికొన్ని కీలక దేశాలకు ఆయన వెళ్లనున్నట్టు సమాచారం.
దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు టాప్ 3 స్థానాలను దక్కించుకున్నారు. ఇక.. కేసుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు.
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ధరణి, నీటిపారుదల ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్, డిగ్రీ కళాశాలల్లో పోస్టుల భర్తీ, ఇందిరమ్మ ఇళ్లు, గ్రామ పంచాయతీల ఆదాయం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీజీ-20 పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన ఆటగాళ్లను అభినందిస్తూ తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఎల్ నినో లాంటి కరువు పరిస్థితుల్లోనూ ఏపీ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. పట్టిసీమ నుంచి రైతులకు నీళ్లు అందిస్తుందని వివరించారు.
తెలంగాణలో పోక్సో చట్టం సమర్థవంతంగా అమలు చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.