Home » Revanth Reddy
కరీంనగర్ లోక్సభ స్థానానికి తమ అభ్యర్థిగా అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రవీణ్రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 14మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఇంకా హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో భట్టి విక్రమార్క, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా..? ఆ ఇద్దరు నేతలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తన విశ్వరూపం చూపించేదా..? రేవంత్ అంటే ఎందుకు అంత భయం.
తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం నాడు మెదక్లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం సుడిగాలి పర్యటన చేయనున్నారు. మిషన్ 15 రీచ్ అయ్యేలా టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఎన్నికలను పూర్తిగా రేవంత్ తన భుజాలపై వేసుకున్నారు. తమ ప్రభుత్వ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అని తెలిపారు. నేటి నుంచి ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. నేటి నుంచి మే 11 వరకూ 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఓటుకు నోటు కేసులో(Vote for Note Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని(Chandrababu) నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేశారు.
హైదరాబాద్: గల్ఫ్ ఏజెంట్లకు చట్ట బద్దత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి ద్వారా మాత్రమే కార్మికులు విదేశాలకు వెళ్లాలని, వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చేలా వ్యవస్థ ఉండాలన్నారు.
గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో పని చేస్తున్న తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ఒక ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పడానికి తమ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి రేవంత్రెడ్డి సర్కారు ప్రయత్నిస్తోంది. అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు వడ్డీలను చెల్లించేందుకు ఆర్థిక క్రమశిక్షణను
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలని నిర్ణయించింది. ఆ క్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు ఆదివారం సాయంత్రం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యురాలు దీపా దాస్మ్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించి అధికారంలోకి రాబోతోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు....