Home » Revanth Reddy
తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి టి. హరీశ్ రావు స్పష్టం చేశారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని సీఎంకు ఆయన సూచించారు.
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో ఊహించి ఉండరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామన్నారు.
రాహుల్ గాంధీ పుట్టిన రోజున రైతు డిక్లరేషన్ను సీఎం రేవంత్ రెడ్డి బొందపెట్టారని హరీశ్ రావు విమర్శించారు. ధాన్యం ఏదైనా కనీస మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తామని నాడు రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇక నుంచి ‘ఈ-క్యాబినెట్’ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ కారిడార్ల కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని వారు పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదని మెదక్ ఎంపీ, బీజేపీ నేత ఎం.రఘునందర్ రావు మండిపడ్డారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురించి అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచిర్యాలలో సింగరేణి డిపెండెంట్ కార్మికులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 335 మంది డిపెండెంట్ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు.
రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. శుక్రవారం కరీంనగర్లోని హుజురాబాద్లో హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.