ఆదోనిని జిల్లా చేయాలంటూ సామాజిక కార్యకర్త కమలాకర్నాయుడుతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు. జిల్లా సాధన జేఏసీ చేపట్టిన దీక్షలు గురువారానికి 47వ రోజుకు చేరుకున్నాయి.
సరదాగా ఆరుగురు స్నేహితులు కర్నూలు నుంచి ద్విచక్రవాహనంపై పాలకొలను గ్రామానికి గురువారం చేరుకున్నారు. గ్రామ సమీపాన ఉన్న గుండమయ్య చెరువు వద్ద ఈతకు వచ్చారు. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
నాన్న.. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి హీరో. భుజాలపై ఎత్తుకుని ప్రపంచాన్ని పరిచయం చేసే తొలి గురువు నాన్న. తండ్రి అంటే ఓ బాధ్యత, ఓ నమ్మకం, ఆదర్శం. కన్నబిడ్డలకు మార్గదర్శి ఆయన. వేలు పట్టి నడిపించిన ఆయన మనసు కర్కశంగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డల ఊపిరి తీశాడు. బిడ్డల ప్రేమ ముందు తండ్రిగా ఓడిపోయాడు. చూసేవారు లేక కన్నబిడ్డలను చంపుకుని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. చివరిసారిగా కుమార్తెలకు ఇష్టమైన కూల్డ్రింక్లో విషం కలిపి, ఏడాది వయసున్న కుమారుడికి పాలల్లో విషం కలిపి తాపించాడు. ఆ పై తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్నెల్ల క్రితం భార్య ఉరివేసుకున్న చోటే ఆయనా తనువు చాలించాడు. న్యూ ఇయర్ వేళ కన్నబిడ్డలతో సంతోషంగా ఉండాల్సిన ఆ కుటుంబం మరుభూమికి వెళ్లింది.
ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయానికి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు.
కోసిగిలోని 3వ వార్డు వాల్మీకినగర్లోని లక్ష్మీనరసింహస్వామి నూతన దేవాలయ నిర్మాణానికి టీడీపీ నాయకుడు, కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ముత్తురెడ్డి రూ.50 వేలు విరాళాన్ని ఆలయ కమిటీ పెద్దలు హంపయ్య, లక్ష్మన్న, బసయ్యకు అందజేశారు.
ఆదోనిని జిల్లా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని ఆదోని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ నూర్ అహ్మద్ అన్నారు.
జిల్లాలో డిసెంబర్ 31న ఒక్క రోజే రూ. 12.50 కోట్ల మద్యం తాగారు.
ఇంజనీరింగ్ పి తామహుడు దిగవంగత మోక్షగుండం విశ్వేశ్వరయ్య యువ ఇంజ నీర్లు, యువతరానికి స్ఫూర్తిప్రదాత అని జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ కబీర్బాషా పేర్కొ న్నారు.
కోసిగి మండలం లోని గౌడు గల్లు గ్రామంలో గురు వారం రెండు చిరుతలు హల్చల్ చేశాయి.