• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

తిరుమలలో డాక్టర్‌ కావ్య కమల్‌ నృత్యాభిషేకం

తిరుమలలో డాక్టర్‌ కావ్య కమల్‌ నృత్యాభిషేకం

తిరుమలలో నాద నీరాజనం వేదికగా డాక్టర్ కావ్య కమల్ మన్యపు నృత్యం పలువురిని ఆకట్టుకుంది. ఒకవైపు నాసా శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తూనే.. భరతనాట్యంపై మక్కువతో ఆమె నృత్యాభిషేకం చేశారు.

చెలరేగిన పిచ్చికుక్క

చెలరేగిన పిచ్చికుక్క

పలమనేరలోఓ పట్టణంలో శనివారం ఉదయం ఓ పిచ్చికుక్క చెలరేగిపోయింది. కనిపించిన వారిపైకి దూసుకెళ్లింది. ఇలా దాదాపు 10 మందిని కరిచింది.

కాణిపాక ఆలయంలో ఫొటోలు తీసిందెవరు?

కాణిపాక ఆలయంలో ఫొటోలు తీసిందెవరు?

కాణిపాక వరసిద్ధుడి ఆలయంలో మూల విరాట్‌, వీరాంజనేయ స్వామి ఆలయంలో తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నెల 18న జర్మనీకి చెందిన శ్రీపీఠ నిలయ భక్తి మార్గ్‌ సెంటర్‌ పరమహంస విశ్వనాథ గురూజీ వరసిద్ధుని దర్శించుకున్నారు.

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి నిమిషం ఆలస్యం చేసినా అనుమతించరు. చివర్లో ఆందోళన పడటం కన్నా.. అరగంట ముందుగానే చేరుకుంటే ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్ష రాయొచ్చంటున్నారు అధికారులు. ఫస్టియర్‌ పరీక్షలు సోమవారం.. సెకండియర్‌ విద్యార్థులకు మంగళవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

పొడి చెత్త కొంటాం

పొడి చెత్త కొంటాం

ఇంటింటా తడి చెత్తను సేకరిస్తున్నారు. పొడిచెత్త, వ్యర్థాలనేమో పడేస్తున్నారు. ఇవి మట్టిలో కలిసేందుకు ఏళ్ల సమయం తీసుకుంటుంది. మరికొందరేమో ఈ వ్యర్థాలను తగలబెడుతున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోంది. పారిశుధ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో పల్లెల స్వచ్ఛత, పర్యావరణ హితమే లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛ రథాలను తీసుకొచ్చింది.

అమ్మ అలక.. చూడతరమా!

అమ్మ అలక.. చూడతరమా!

శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. గంగాదేవిని వివాహమాడాడని తెలిసి పరమశివుడిపై అలకబూనిన ఆదిశక్తిని బుజ్జగించేందుకు పరమశివుడు ప్రయత్నించడమే పల్లకీసేవలో ప్రధానాంశం.

సినీ ఫక్కీలో భారీ చోరీ

సినీ ఫక్కీలో భారీ చోరీ

సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. నిశ్చితార్థం ఫంక్షన్‌లో 16 సవర్ల బంగారు వడ్డాణం అపహరణకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాయుడుపేట- పండ్లూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న హోటల్‌ కమ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఓజిలి మండలం పున్నేపల్లికి చెందిన తన సమీప బంధువుల నిశ్చితార్థం ఫంక్షన్‌కు శుక్రవారం రేణిగుంట ప్రాంతానికి చెందిన శిల్ప హాజరయ్యారు.

తడి, పొడిచెత్తలను వేర్వేరుగా అందించండి

తడి, పొడిచెత్తలను వేర్వేరుగా అందించండి

ఇంటి వద్దే తడి, పొడిచెత్తలను వేర్వేరుగా అందించాలని ప్రజలకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు. తిరుపతి రూరల్‌ మండలం పెరుమాళ్లపల్లెలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల ప్రత్యేకథీమ్‌ ‘జీరో లిటర్‌ గవర్నెన్స్‌’పై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీవారి ఫొటోను ప్రచార అస్త్రంగా వాడతారా?

శ్రీవారి ఫొటోను ప్రచార అస్త్రంగా వాడతారా?

శాసన మండలిలో శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డులుగా పట్టుకుని వైసీపీ నాయకులు ప్రచార అస్త్రంగా వాడి.. కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని కూటమి నేతలు మండిపడ్డారు. శనివారం తిరుపతిలోని ఓ హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ, వైసీపీ నేతలకు హిందూ దేవుళ్లు అన్నా, ఆలయాలన్నా లెక్కలేదన్నారు.

రేపు  జాబ్‌ మేళా

రేపు జాబ్‌ మేళా

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ), సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైస్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌(సీడా్‌ప) ఆధ్వర్యంలో సోమవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ టీఎన్‌ శోభన్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోటక్‌ మహేంద్ర మైక్రోఫైనాన్స్‌ సంస్థలో ట్రైనీ సెంటర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం తిరుపతి డీఆర్‌డీఏ కార్యాలయంలోని టీటీడీసీ ప్రాంగణంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ మండలాల్లో సుమారు 49 పోస్టులు ఉన్నాయన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి