తుఫాను నేపథ్యంలో నిండ్ర మండలంలో వర్షబీభత్సం చోటుచేసుకుంది.
నగరి నియోజకవర్గ పరిధిలో మిచౌంగ్ తుఫానుతో నష్టపోయిన రైతులను, పల్లపు ప్రాంత ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ ఇన్చార్జి గాలి భానుప్రకాష్ డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో ఎన్నికల సమయంలో మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్టేడియాన్ని ఎక్కడ నిర్మించారో చెప్పాలని జీడీనెల్లూరు టీడీపీ ఇన్చార్జి థామస్ ప్రశ్నించారు.
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు పట్టుకున్నారు.
అది పశువుల మేతకు ఉపయోగపడే గుట్ట. దానినీ మేసేస్తున్నాడో వైసీపీ నేత. గుట్టను చదును చేయించి మామిడి మొక్కలు నాటించాడు. ఉలవలు చల్లించాడు. దీనిపై తాము ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Andhrapradesh: చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో మిచౌంగ్ తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఎస్ఆర్ పురం, కార్వేటినగం, గంగాధర నెల్లూరు మండలాల్లో వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి.
తిరుమల: వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించిన అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు భక్తులు అన్నప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులు నిరసనకు దిగారు. టీటీడీ భక్తులకు వడ్డీంచిన అన్నం బాగోలేదంటూ టీటీడీ సిబ్బందిపై మండిపడ్డారు. భక్తులకి ఇలాంటి అన్నం పెడతారంటూ భక్తులు టీటీడీ సిబ్బందిని నిలదీశారు.
సెబ్ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సదకుప్పం గ్రామానికి చెందిన వలంటీర్ జ్యోతీశ్వరయ్య కర్ణాటక మద్యంతో పట్టుబడ్డాడు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.