భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది. మన కుటుంబ విలువలు ప్రపంచంలో మరెక్కడా ఉండవు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని, లేని పక్షంలో జిల్లాగా ప్రకటించాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ కన్వీనర్ దశరధరామిరెడ్డి అన్నారు.
చిత్తూరులో జీఎస్టీ స్కాంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ స్కాంపై చిత్తూరు నగరానికి చెందిన విజయచక్రవర్తి అనే యువకుడు కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఫిర్యాదు చేశారు.
గూడూరు మండలం విందూరు గ్రామంలో వైసీపీ నాయకులు ఈనెల 21వ తేదీ రాత్రి మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో కొందరు యువకులు కత్తులు పైకెత్తి చూపుతూ, టపాసులు పేల్చి కేక్ కట్ చేస్తూ హంగామా చేశారు. అప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలు శుక్రవారం వైరల్ అయ్యాయి. దీనిపై టీడీపీ నేత లాలూప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో అధునాతన టెక్నాలజీతో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయ భవనాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అంటూ డీపీవో భవనాన్ని ప్రారంభించాక విజిటర్స్ బుక్లో సీఎం చంద్రబాబు రాశారు.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం’ దేశ ప్రాచీన, ఆధునిక విజ్ఞాన వైభవాన్ని చాటింది. సంస్కృత వర్సిటీ ప్రాంగణంలోని మూడు వేర్వేరు వేదికల నుంచీ భారత దేశ ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర సాంకేతికలతో సమ్మిళితం చేయాల్సిన అవసరాన్ని సదస్సు నొక్కి చొప్పింది.
ముక్కంటి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 27వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
టీటీడీ పరకామణిలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక విడుదల చేసింది.
రాజకీయ ముసుగులో చేసే నేరాలు అంగీకరించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలని పేర్కొన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు.