తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టీడీపీ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ మూడు జిల్లాల టీడీపీ కో ఆర్డినేటర్, ఏపీ మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్ దామచర్ల సత్య వెల్లడించారు
తెలుగుదేశం పార్టీ మహానాడు సంరంభం నేడు, రేపు గ్రామ స్థాయిలో ప్రతిఫలించనుంది.జన జాతరను, మహోత్సవాలను తలపించే రీతిలో మహానాడు సంబరాలు ఏటా జరగడం తెలిసిందే.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మంగళవారం కరెన్సీ నోట్ల అలంకారంలో మెరిసిపోయారు. జాతర తర్వాత వచ్చిన రెండో మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలవిరాట్టుకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వాభరణాలు, వజ్ర కిరీటంతో అమ్మవారిని అలంకరించారు.భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కరెన్సీ నోట్లతో గర్భాలయం, ముఖద్వారం అలంకరించారు.
బీఈడీ కోర్సులో ప్రవేశానికి ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల8న నిర్వహించిన ఎడ్సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ తారకరామనగర్కు చెందిన సి.ఖుష్వంత్ ఇంగ్లీషు మెథడాలజీలో 115మార్కులతో రాష్ట్రస్థాయిలో పదవ ర్యాంకును కైవసం చేసుకున్నారు.
ఏర్పేడు సమీపంలో వున్న ఐఐటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు -స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఈవీ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తిరుపతి జిల్లాలో మంగళవారం పగలంతా సూర్యుడు సుర్రుమన్నాడు. తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. సాయంత్రం వాతావరణం మారింది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు మండలాల్లో కురిసింది.
గంగ జాతర చూసేందుకు స్వగ్రామానికి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిపై మదనపల్లె తాలూకా సీఐ కె.కళావెంకట్రమణ దురుసుగా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే బూటుకాలితో తన్ని అవమానించాడు.
మదనపల్లె జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలని డీఎ్సడబ్ల్యూవో దామోదర్రెడ్డి పేర్కొన్నారు.
టమోటా పంటకు వినియోగించే డ్రిప్ ఎరువులను కొందరు మోసగాళ్లు ప్రముఖ కంపెనీ పేరుతో దుకాణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకున్న సంఘటన వెలుగులో చూసింది.
చిత్తూరు జిల్లాలోని పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజా ఇంటి పన్ను డిమాండ్లో అసలు చెల్లిస్తే, ఐదు శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. అయినా 25 రోజుల్లో డిమాండ్లో రూ.5 కోట్లు మాత్రమే వసూలైంది.