కాణిపాకంలో భక్తులకు వేసవి నుంచి ఉపశమనం కలిగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.
తిరుపతిలో శనివారం ట్రాఫిక్ కష్టాలు జనానికి నరకం చూపించాయి. శనివారం కావడంతో నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయలేదు.
రాష్ట్రనైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని జేఎన్టీయూ - స్కిట్ కళాశాలలో ఈనెల 15వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జేసీ గోవిందరావు తెలిపారు.
తిరుచానూరులోని అమ్మవారి ఆలయ సమీపంలో శనివారం రాత్రి ద్విచక్ర వాహదారుడిని సైడ్ ఇవ్వమన్నందుకు పెద్ద గొడవ జరిగింది. సీఐ సునీల్కుమార్ కథనం మేరకు.. పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం రాత్రి గజవాహన సేవ జరిగింది.
తిరుపతి రైల్వేస్టేషన్ పార్శిల్ ఆఫీస్ ఎదురుగా గల కార్పొరేషన్ స్థలంలో నిధుల లేమితో అర్ధంతరంగా ఆగిపోయిన మల్టీ లెవల్ కార్ పార్కింగ్ (ఎమ్మెల్సీపీ) స్థానంలో మల్టీఫ్లెక్స్ థియేటర్స్, కమర్షియల్ కాంప్లెక్స్తోపాటు 3స్టార్ హోటల్ ఏర్పాటు కానుంది.
హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తులో చిన్న ఇనుప రాడ్డు ప్రమాదానికి కారణమైన లారీని పట్టిచ్చింది. గూగుల్ టేకవుట్ సాయంతో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీని సీజ్ చేయడంతో పాటు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఆధునిక సాంకేతిక విప్లవంతో అడ్వర్టైజింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ‘స్కైవర్టైౖజింగ్’గా పిలిచే డ్రోన్ కెమెరాలతో ప్రకటనల ప్రచారం తిరుపతిలో మొదలైంది.
అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మదనపల్లెకు చెందిన ఒక యువకుడిని పీడీ యాక్ట్ కింద నిర్బంధించడాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శనివారం నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
జిల్లాలో అటు పరిశ్రమలు.. ఇటు పర్యాటకం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దిశగా శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.