గుండెకు సంబంధించిన మందులు వికటించి టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ అస్వస్థతకు గురయ్యారు.
క్రిస్మస్, న్యూఇయర్ గిఫ్ట్ పేరుతో లింక్లు పంపిస్తారు. వీటిని క్లిక్ చేసినట్లయితే బ్యాంకు ఖాతాల్లోని నగదు పూర్తిగా మాయమయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.
సీఎం చంద్రబాబు స్వగ్రామమైన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో చిరుత సంచారం కలకలం రేగింది.
చదువుకు పేదరికం అడ్డుకాదు. ఆత్మవిశ్వాసం, పట్టుదలకు తోడు, సరైన ప్రణాళికను ఆచరిస్తే చాలు. అద్భుత విజయాలను సొంతం చేసుకోవచ్చని నిరూపించారు దాసరి ఇందుమతి. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసె్స(ఐఈఎస్) పరీక్షల్లో ఓసీ (ఈడబ్ల్యూఎ్స)కేటగిరీలో జాతీయ స్థాయి 75వ ర్యాంకు సాధించారు.
తిరుపతి నగరపాలక సంస్థకు స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు (సేసా-2025) వచ్చింది. విద్యుత్ వినియోగం తగ్గించడంపై రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డు కింద తిరుపతికి గోల్డ్ మెడల్ ప్రకటించారు.
కొన్ని భవన నిర్మాణాలకు అనుమతులు ఉంటాయి. కానీ తీసుకున్న ప్లాన్కు అనుగుణంగా నిర్మాణాలు ఉండవు. నిర్మాణాల్లో పది శాతం అతిక్రమణ జరగడం సాధారణమే. అయితే 50 శాతానికిపైగా ఇష్టారీతిన నిర్మాణాలు చేయడం తిరుపతిలో ఆనవాయితీగా మారింది. అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకునేందుకు బిల్డింగ్ పీనలైజ్జ్ స్కీమ్ (బీపీఎ్స)ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కానీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
‘పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేదు. దీంతో పీజీఆర్ఎ్సకు వచ్చే క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, సర్వం కోల్పోయి వచ్చిన వారికి న్యాయం చేయలేకపోతున్నాం. పింఛన్ల మంజూరులో ప్రత్యేక అధికారాలు కల్పించాలి’ అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల రెండో రోజు సదస్సులో వెంకటేశ్వర్తో కోరారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, కలెక్టర్లకు 200 పింఛన్లు మంజూరు చేయడానికి వెసలుబాటు కల్పిస్తున్నామని, ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుందని సీఎం ప్రకటించారు. ఇక జిల్లాలో నీటి సంరక్షణ, గ్లోబల్ లాజిస్టిక్ టెక్నాలజీ, జీరో పావర్టీ, హ్యూమన్ రీసెర్స్ వంటి అంశాల్లో పనితీరు బాగుందని, మరింత చురుగ్గా పని చేయాలని చంద్రబాబు సూచించారు. మారిన జీవన విధానం, ఆలస్య పెళ్లిళ్లు వల్ల సంతానోన్పత్తి తగ్గుతోందని, ఈ క్రమంలో అంత్యత ఖరీదైన ఫెర్టిలిటీ సేవలను ఎన్టీఆర్ వైద్యసేవలో చేరిస్తే బాగుంటుందని కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జీవన విధానంపై యువతను ఎడ్యుకేట్ చేయడం, అదే సమయంలో చికిత్స కూడా అవసరమేనని, హెల్త్ప్లానింగ్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కుప్పంలో ఓ ఎన్జీవో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి ఒక్కరికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారని అదే తరహాలో అంతటా తీసుకురావడానికి చర్యలు ప్రారంభిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో తిరుమల క్షేత్రంపై వచ్చే అసత్య కథనాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) అర్జీల పరిష్కారంలో జిల్లాకు ఆశించిన మేర స్థానం లభించలేదు. ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా నిరుద్యోగుల ఉద్యోగావకాశాల కల్పనలో మాత్రం జిల్లాకు మెరుగైన స్థానం లభించింది. వివిధ శాఖల పన్నుల వసూళ్లలోనూ దూకుడు ప్రదర్శించగలిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయార్జనలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించింది. మొత్తం మీద జిల్లా కొన్నింట ముందంజ వేస్తుండగా కొన్నింట మాత్రం మరింత పురోగతి కనబరచాలని స్పష్టమవుతోంది. అమరావతిలో గురువారం ముగిసిన కలెక్టర్ల సదస్సులో జిల్లాకు మిశ్రమ స్పందన లభించింది.
ఎన్టీఆర్ రాజు మృతదేహాన్ని బుధవారమే తిరుమలలో ఆర్బీ సెంటర్లోని సొంతింటికి తీసుకొచ్చారు. పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు గురువారం తిరుమలకు చేరుకుని నివాళులర్పించారు. నివాళులు అర్పించినవారిలో.. ఎమ్మెల్యేలు మురళీమోహన్, అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఏపీ జీబీసీ చైర్పర్సన్ సుగుణమ్మ, పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మాజీ జేఈవో శ్రీనివాసరాజు, శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ కార్పోరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, తిరుపతి కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నేతలు గౌనివారి శ్రీనివాసులు, ఊకా విజయ్కుమార్, పులిగోరు మురళి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. ఆయన మృతదేహంపై టీడీపీ జెండా కప్పారు. సాయంత్రం వైకుంఠరథం వాహనం ద్వారా బాలాజీనగర్లోని శ్మశానానికి ఎన్టీఆర్ రాజు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు, లక్ష్యం ఛేదనలో జిల్లా పనితీరు ఎలా ఉంది. ఆయా రంగాల్లో రాష్ట్రంలో ఏ స్థాయిలో నిలిచింది. ఈ వివరాలను విజయవాడలో కలెక్టర్ల సదస్సు సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. త్వరలో జిల్లాకు రూ.96 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వాటి ద్వారా ఏకంగా 1.88 లక్షల ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. జిల్లా యంత్రాంగం 53 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుని రూ.39 వేల కోట్ల పెట్టుబడులను, 1.12 లక్షల ఉద్యోగాలను రాబట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అదనంగా మంత్రివర్గం ఇప్పటికే 24 సంస్థలకు సంబంధించి రూ.57 వేల కోట్ల పెట్టుబడులతో 76 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం 77 సంస్థల నుంచీ జిల్లాకు రూ. 96 వేల కోట్ల పెట్టుబడులు, 1.88 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఇక, గతేడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ జిల్లాలో 11,425 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఇందులో జిల్లాకు నాలుగో స్థానం లభించింది. ఈ జాబితాలో ప్రైవేటు ఉద్యోగాలే చూపారు. టీచర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీని చూపలేదు. ఫ ఒక్కో నియోజకవర్గంలో మూడు నెలలకు ఒక జాబ్ మేళా చొప్పున నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లెక్కన జిల్లాలో 49 మేళాలు నిర్వహించాలి. కానీ, జిల్లా యంత్రాంగం చొరవతో 72 మేళాలు నిర్వహించగా, 518 పరిశ్రమలు పాల్గొని 5677 ఉద్యోగాలు కల్పించాయి. ఇందులో జిల్లాకు ఏపీలో మూడో స్థానం వచ్చింది. ఫ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద లే అవుట క్రమబద్ధీకరణకు 8165 దరఖాస్తుల ద్వారా రూ.78.99 కోట్లు వసూలైంది. దీని అమల్లో జిల్లాకు మూడో స్థానం దక్కింది.