కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో వైసీపీ నేతలే ఓటు చోరులని, ఈ విషయంలో దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సవాల్ విసిరారు.
నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరానే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రైతులకు 9గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు.
ఐటీ విభాగాన్ని పటిష్టం చేసేందుకు టీటీడీ సిద్ధవుతోంది. ఇందులో భాగంగా 34 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించి ఐఐటీ తిరుపతి, ఏపీ ఆన్లైన్ సంస్థలతో ఏంఓయూ కుదుర్చుకోవాలని టీటీడీ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది.
పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,011 కేంద్రాల పరిధిలో 2,46,974 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి తొలిరోజు 95 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని డీఎంహెచ్వో బాలకృష్ణనాయక్ అన్నారు.
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై తిరుమలలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరుకానున్నారు.
సముద్రంలో ఈతకెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.
జిల్లాలో 19 మంది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఎస్పీ సుబ్బరాయుడు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్కుమార్, ఎమ్మెల్యే జగన్మోహన్, మేయర్ అముద పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
ఈ ఏడాది మున్నెన్నడూ లేని విధంగా చలి వణికిస్తోంది. ఈనెల ఆరంభం నుంచే తీవ్ర ప్రభావం చూపుతోంది. పదేళ్లల్లో ఈ స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ పడిపోలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణంగా ఈనెలాఖరున, జనవరి ఆరంభంలో కొద్ది రోజులు పాటు 10 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా టీడీపీ మొదటిసారిగా ఓ మహిళకు అవకాశం కల్పించింది. కేంద్ర మాజీ మంత్రి, టీటీడీ పాలకమండలి సభ్యురాలు పనబాక లక్ష్మిని ఈ పదవికి ఎంపిక చేసింది. ప్రధాన కార్యదర్శిగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని నియమించింది.