జిల్లాలోనే ప్రత్యేకించి తనకల్లు మండలంలో ఏడాది పొడవునా వందలాది ఎకరాల్లో టమోటా సాగులో ఉంటుంది. ఇటీవల టమోటా సాగుకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
తమ నియోజకవర్గంలో తాగునీరు, రోడ్డు సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు.
రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ప్రెసిడెంట్లు, డైరక్టర్లను టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరాం కోరారు.
మండలంలోని కోటపల్లి పంచాయతీ గుట్టమీదతండా, నడిమితండా, రామప్పకుంట తండాల్లో రూ.78 లక్షలతో సిమెంటు రోడ్ల నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేశారు.
హౌసింగ్ కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. కనీసం ఆ కార్యాలయ తలుపులు కూడా తెరవని పరిస్థితి నెలకొంది
మామిడి పంటలో ఫ్రూట్ కవర్లను వినియోగించడం ద్వారా నాణ్యమైన.. అధిక దిగుబడి సాధించవచ్చని ఉద్యానవన శాఖ అధికారిని లావణ్య రైతులకు సూచించారు
బస్సు లు ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్లకుండా.. కూడలిలో ప్రయాణికులను ఎక్కించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.
మండలపరిధిలోని రామచంద్రపురం వద్ద ఉన్న పొట్టి చెరువులోకి చేపల పెంపంకం కోసం టీడీపీ నాయకులు చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత పయ్యావుల శ్రీనివాసుల సహకారంతో కైకలూరు నుంచి లక్ష చేప పిల్లలను కొనుగోలు చేసి మంగళవారం చెరువులోకి వదిలారు.
ఏడు ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకుండా కాపాడాలని ఎనఎంయూఏ డి పో అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకుడు కేఎస్ వలి పేర్కొన్నారు. అ దే విధంగా విద్యుత బస్సుల నిర్వహణను పినాకిని సంస్థకు అప్పగించ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎనఎంయూఏ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక డిపో వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు ఎర్రబ్యాడ్జీలు ధరించి గేట్ ధర్నా నిర్వహించారు.
జిల్లాలోని పలు మండలాల్లో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, అదే ప్రకారం తమకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండంటూ బాలసంతు కులస్థులు వేడుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం బాలసంతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి.