నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా కలెక్షన్లు నగరంలో రూ.కోటికి చేరుకోవడంపై అభిమానులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు.
కుల, విద్యార్థి సంఘాల పేరుతో కొందరు చేస్తున్న వేధింపులు, దందాలపై చర్యలు తీసుకోవాలని నగరంలోని ప్రైవేట్ స్కూళ్ల కరెస్పాండెట్లు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.
మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన చిన్న నల్లప్పకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 15వేలు మంజూరైంది.
మండలంలోని ఆలమూరు రోడ్డులోగల పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం కళాశాల స్టూడెంట్ యాక్టివిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅథితిగా కల్వరీ గ్రేస్ చర్చి పాస్టర్ పాల్ ఆరన హాజరై క్రిస్మస్ విశిష్టతను వివరించారు.
ఐదేళ్లలోపు వయసు గల చిన్నారులందరికీ తల్లిదండ్రులు ఈ నెల 21వ తేదీన ఆదివారం పోలియో చుక్కలు తప్పక వేయించాలని తరిమెల వైద్యాధికారి డాక్టర్ శంకర్ నాయక్, ఎంపీడీఓ భాస్కర్ సూచించారు.
ప్రజలు, రైతుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని విప్ కాలవ శ్రీనివాసులు ఆదేశించారు
స్థానిక పాతగుంతకల్లులోని 9వ వా ర్డు సచివాలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజా దర్బారును శుక్రవారం నిర్వహించి.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
తిమ్మసముద్రం పారిశ్రామికవాడగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అనతి కాలంలోని రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు
నియోజకవర్గంలో 21వ తేదీన నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమంలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్ మంజువాణి సూచించారు.
ఎండుమిర్చి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని యార్డ్ అధికారులకు వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన అశ్వత్థనారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డ్లో ఎండుమిర్చీ క్రయ విక్రయాలను పరిశీలించారు.