మైనర్ను వివస్త్రగా మార్చి పూజలు చేసిన అమానుష ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూజల పేరుతో బాలికను ఓ మహిళ చిత్రహింసలకు గురిచేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
అనంతపురం హైవేపై ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా కక్కలపల్లిలోని మార్కెట్లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ ఇన్చార్జ్ కార్యదర్శి మల్లికా తెలిపారు.
మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
అనంతపురం జిల్లాలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడి తీవ్ర కలకలం రేపుతోంది. పొలానికి వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 87.45 టీఎంసీలకు చేరింది. జలాశయం నీటిమట్టం 1,628.20 అడుగులకు చేరింది.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.