Share News

PROOF: కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:59 PM

జిల్లాలోని పలు మండలాల్లో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, అదే ప్రకారం తమకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండంటూ బాలసంతు కులస్థులు వేడుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం బాలసంతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి.

PROOF:  కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి
Concerned children's families

పామిడి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, అదే ప్రకారం తమకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండంటూ బాలసంతు కులస్థులు వేడుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం బాలసంతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండలంలోని పీ కొండాపురం గ్రామంలో సుమారు 90 బాలసం తు కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధువీకరణ పత్రాలు ఇవ్వాలని గత టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జీఓ మంజూరు చేశారన్నారు.


అయినప్పటికీ మండలంలో తకు కుల దృవీకరణ పత్రాలు అందజేయడం లేదన్నారు. దీంతో తమ కుటుంబాలలోని విద్యార్థులు ఏ కులమో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అనంతరం తహసీల్దార్‌ షర్మిలకు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనకు జనసేనప పార్టీ గుంతకల్లు నియోజకవర్గ ఇనఛార్జి వాసగిరి మణికంఠ, బీజేపీ మండల అధ్యక్షుడు అంజినాయక్‌ చౌహాన, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మా మోహన కృష్ణ మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుళ్లాయప్ప, బాలసంతు రాష్ట్ర కార్యదర్శి శీన, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరా దేవి, నాయకులు పసుల లక్ష్మన్న, ఇప్పే నరసప్ప తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 24 , 2026 | 11:59 PM