Home » Guntakal
జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలోని సరోజిని నాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో నారాయణ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ దినోత్సవానికి ముఖ్యఅ తిథిగా డాక్టర్ పత్తి హిమబిందు హాజరయ్యారు. వైద్యులు సుజాత, కృష్ణనాయక్, జయవర్ధన రెడ్డిని శాలువ, పూలమాలతో సత్కరించారు.
సామాజిక పింఛన పే దలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పే ర్కొన్నారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన ఇంటి వద్దకే పిం ఛన పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకటో తేదీన ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదే అన్నారు.
పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణంలో సహకార వారోత్సవాల్లో భాగంగా బుధవా రం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రైతులకు, ప్రజలకు డా క్టర్ వినీత ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
అవ్వ, తాతలకు పెద్ద కొడుకుగా, వితంతువులకు అన్నగా నిలుస్తూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రూ. వేల కోట్లను పింఛన రూపంలో అందజేస్తున్న ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.
మండలంలోని నింబగల్లు వద్ద ఉన్న ఎస్ఎస్ ట్యాంకుల్లో (మూడు చెరువులు) నీటి నిల్వలు అడు గంటాయి. నింబగల్లు ఎస్ఎస్ట్యాంకు నుంచి ఉరవకొండ పట్టణంతో పాటు ఏడు గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది.
మండలంలోని వి. కొత్త కోటకు వెళ్లే దారి పూర్తిగా శిథిలమై గుంతలమయమై ఉండేది. వాహనా ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు రోడ్డు దుస్థితిని మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకెళ్లారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కళ్యాణదు ర్గం మార్కెట్ యార్డు చైర్మన లక్ష్మీదేవి రమేష్ పేర్కొ న్నారు. స్థానికం గా సోమవారం నిర్వహించిన ఉచిత కంది విత్తనాల పంపిణీ కార్య క్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
మండలంలోని శ్రీధరఘ ట్ట, ఉంతకల్లు తదితర గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలను సోమ వారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే రైతులు తమ ఎద్దు లను కడిగా, కొమ్ములకు రంగులు వేసి, మెడలో గంటలు, పూలమాల లతో అలంకరించి పూజలు చేశారు.
వజ్రకరూ రులోని జగనన్న కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిం చాలని కాలనీ వాసులు సోమవారం ఆందోళన నిర్వ హించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు.
సమాజంలో అందరి సమిష్టి కృషితో పోలియో మహమ్మారిని నిర్మూలిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈబీ దేవి వైద్యశాఖ అధికారులకు సూచిం చారు. జాతీయ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం పట్టణంలోని శాంతినగర్ అర్బన హెల్త్ సెంటర్ను ఆక స్మి కంగా తనిఖీ చేశారు.