Home » Guntakal
మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం వైభవంగా స్వామికి పల్లకిసేవ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన రేగటి నాగరాజు, సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. స్దానిక పొట్టి శ్రీ రాములు సర్కిల్లో శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ప్రజా దర్బారులో విన్న వించే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూ రు జయరాం పేర్కొన్నారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బారును నిర్వహించారు.
పట్టణాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలంటే ప్రతిపౌరుడు పారిశుధ్య కార్మికుడిగా బా ధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. పట్ట ణంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పాత మున్సిపాలిటీ వద్ద ఆయన ప్రారంభించారు.
ప్రజల ఆహారభద్రత కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గోదాములు ప్రస్తుతం ఉపయోగంలో లేక వెలవెలబోతున్నాయి. రైతుల నుంచి కొ నుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరచడం, అత్యవసర పరిస్థితుల్లో నిల్వ ఉంచడం లక్ష్యంగా ఈ గోదాములను నిర్మించారు. అయితే నిర్వహణ లోపం వల్ల అవి క్రమంగా నిరుపయోగంగా మారుతున్నాయి.
పట్టణంలోని సరోజినీ నాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం 2025-26 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మా ర్కులు సాధించిన విద్యార్థులకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యలో సన్మానం చే శారు. ముఖ్య అతిథిగా ఎంఈవోలు మస్తానరావు, సుబ్బరాయుడు హాజరయ్యారు.
తాగునీటి శుభ్రతపై ఎటు వంటి అనుమానాలు వద్దని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచిం చారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో చేపలు పట్టడానికి, ఇతర కార్యక్ర మాల కోసం ఎవరైనా వస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఆయన గురువారం సాయంత్రం పట్టణ శివారులోని మునిసిపల్ ఎస్ఎస్ ట్యాం కులను పరిశీలించారు.
తెలుగుదేశం పార్టీ బడుగు, బ లహీన వర్గాల పార్టీ అని, కష్టపడే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ పెద్ద పీట ఉంటుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. మండలంలోని గోవిందవాడ గ్రామంలో గురు వారం నిర్వహించిన టీడీపీ మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు గురువారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. అంతకు మునుపు మండల పరి షత కార్యాలయం నుంచి టవర్క్లాక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిం చారు.
కూటమి అధికారం లోకి వచ్చాక, పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీనను తిరిగి ప్రారంభించింది. రూ.5కే కడుపు నింపే ఈ పథకం పేదల పాలిట అన్నపూర్ణగా మారిం ది. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం ఆవరణంలో నెల రోజు ల క్రితం అన్న క్యాంటీనను ఏర్పాటు చేశారు.