Home » Anantapur
నల్లచెరువు మండల కేంద్రానికి రెండు నెలల క్రితం వచ్చిన ఓ వ్యక్తి.. అద్దె గదిలో ఉంటూ.. అందరినీ నమ్మించి రూ.4 కోట్లకు టోకరా వేశాడు.
ప్రభుత్వం మారినా జిల్లా సంపదను కొల్లగొడుతున్న అమిగోస్ మినరల్స్ సంస్థ ఆగడాలు ఆగవా అని మైన్స కాంట్రాక్టర్ రాజేష్ మండిపడ్డారు. గతంలో అమిగోస్ అక్రమాలపై ఫిర్యాదు చేసినా విచారణ జరపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రాజేష్ గురువారం సాయంత్రం స్థానిక హెచ్చెల్సీ కాలనీలోని భూగర్భగనుల శాఖ డీడీ నాగయ్య ఎదుట నిరసనకు దిగాడు.
స్పాంజ్ ఐరన ఫ్యాక్టరీ యజమానులు, రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పొల్యూషన అధికారులు వెనుదిరిగారు.
తమ అనుభవంలో ఉన్న దాదాపు 11.23 ఎకరాల భూమిని మరో వ్యక్తి పేరున రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయడంపై గుట్టిపల్లికి చెందిన బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు.
Andhrapradesh: ‘‘వైసీపీపై ఐదు సంవత్సరాలు పోరాడిన వ్యక్తిని నేను.. నాపై దొంగతనం కేసులు బనాయించారు.. డీటీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు రాసిన లేఖను తప్పుపట్టారు. పంజాబ్లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో నాతో పాటు రవీంద్రరెడ్డిపై
పంట బాగా పండిందన్న సంబరం తో దిగుబడిని మార్కెట్కు తీసుకువస్తే, ఇక్కడ ధర ఎంత పలికిందో తెలియక రైతులు తికమక పడుతున్నారు. మాయా మార్కెట్తో నిలువునా మునిగిపోతున్నారు. ఆనలైన విధానంలో ట్రేడర్లు రైతులకు పంగనామాలు పెడుతున్నారు.
జిల్లా మోడల్ స్కూళ్లను గాలికి వదిలేసినట్లు అనిపిస్తోంది. ప్రిన్సిపాల్ నెలల తరబడి స్కూళ్లకు వెళ్లకున్నా..పట్టించుకునవారు లేరు. కణేకల్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆదినారాయణ నెలల తరబడి స్కూల్కు డుమ్మా కొట్టారు. స్కూల్ నిర్వహణను గాలికి వదిలేశారు. ఆయన స్కూల్కు వెళ్లకున్నా...అటెండెన్స రిజిస్టర్లో సంతకాలు ఉంటున్నాయి.
ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన రాక్రీట్ సంస్థపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిని కలిశారు.
రైతన్న ఆకాశం వైపే ఆశగా చూస్తున్నాడు. చినుకు జాడలేదు. రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆషాఢం సగం ముగిసింది. ఆకాశం మబ్బులతో నిండుకుంటోంది. ఆషాఢ గాలులతో మబ్బులన్నీ కరిగిపోతున్నాయి. రైతులు పొలాలను దుక్కి దున్నుకుని, విత్తనాలను సిద్ధం చేసుకున్నారు.
మొహరం వేడుకలలో యువకుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. ఈ వ్యవహారంలో రెండు వర్గాలకు చెందిన 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఇంతటితో గొడవకు తెరపడుతుందని భావిస్తుండగా, ముగ్గురు యువకులను కాడిమానుకు కట్టేసి కొట్టిన వీడియోలు బయటపడ్డాయి.