Home » Anantapur
వీహెచపీ, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో వీరహనుమాన విజయయాత్ర మో టార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీడీపీ మండల ఇనచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు
పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభూ జబుకేశ్వరస్వామి రథోత్సవాన్ని గురు వారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు స్వామి వా రికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రథంలో స్వామివా రిని ప్రతిష్ఠించి పట్టణలో ఊరేగించారు.
Lakshminarasimhaswamy statue honor
పట్టణంలోని ఏటిగడ్డపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతు న్న శ్రీరామనవమి వేడుకల్లో భా గంగా గురువారం శ్రీరామచంద్ర మూర్తి వైకుంఠరాముడి అలం కరణలో దర్శనమిచ్చారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్ ఉభయసభ లలో బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి కేక్ కట్ చేశారు.
ప్రస్తుత వేసవి కాలంలో పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అధికారులను ఆదేశించారు. స్ధానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం ప్రత్యేక అధికారి కేశవనా యుడు అధ్యక్షతన అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
మండలకేంద్రంలో జరుగుతు న్న జోడులింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ వారం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఐరావత వాహనంపై పార్వతీ పరమేశ్వరులను ఊరేగించారు. ఉదయం ఆలయంలో రుద్రా భిషేకం చేశారు.
మండలంలోని ఎల్బీనగర్ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత శాఖ నిర్లక్ష్యం బహిర్గత మవుతోంది. 11 కేవీ విద్యుత లైనకు చెందిన స్తంభాలు అధ్వాన స్థితికి చేరుకుని, రైతుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. ఒక స్తంభం పూ ర్తిగా వంగిపోగా మరొకటి అడుగుభాగం పగిలి లోపలి ఇనుప కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషితోనే ఆర్డీట్జీట ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ సాధ్య మైందని దివ్యాంగుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్ సింహ అ న్నారు. దివ్యాంగుల సంఘం నాయకులు మంగళవారం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును పూలమాల లు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గన్నె వారిపల్లికాలనీలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.