• Home » Anantapur

Anantapur

PURITY: స్వచ్ఛత ఎక్కడ..?

PURITY: స్వచ్ఛత ఎక్కడ..?

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మండల పట్టణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ప్రతినెలా మూడో శనివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో బాగంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరి శుభ్ర వాతావరణాన్ని నెలకొల్పేందుకు అధికారులను సైతం ఇందులో భాగస్వాములను చేసింది. అమలు చేయాల్సిన అధికారులే పట్టించుకోక పోవడంతో ఈ కార్యక్రమం నీరుగారి పోతోంది.

RSS: ప్రసంగిస్తున్న అఖిలభారత సహ సంఘటక్‌ దేవేంద్ర

RSS: ప్రసంగిస్తున్న అఖిలభారత సహ సంఘటక్‌ దేవేంద్ర

దేశంలో హిందూసమాజాన్ని శక్తివంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కదిలిరావాలని, అందుకే హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు అఖిలభారత సహ సంఘటక్‌ దేవేంద్ర, కోణ కణ్వాశ్రమం దత్తానందగిరి స్వామి పే ర్కొ న్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదా నంలో ఆదివారం సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూసమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

PLANTS: ఎండిపోతున్న మొక్కలు

PLANTS: ఎండిపోతున్న మొక్కలు

ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొదించాలన్న సంకల్పంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల లు, కళాశాలల ప్రాంగణాల్లో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టిం ది. అయితే కొత్తచెరువు మండల కేంద్రంలోని మేజర్‌ పంచాయతీ అధికారులు రెండు నెలల క్రితం బుక్కపట్నం ఫారెస్టు నర్సరీ నుంచి దాదాపు 500 మొక్కలను నాటేందుకు తీసుకొచ్చారు.

MLA: పోలియో ర హిత సమాజం స్థాపిద్దాం

MLA: పోలియో ర హిత సమాజం స్థాపిద్దాం

పోలియో రహహిత సమాజం స్థాపిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పట్టణంలోని గొల్లమ్మ మండపం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేశారు.

AMBITION: నీరుగారుతున్న ప్రభుత్వ ఆశయం

AMBITION: నీరుగారుతున్న ప్రభుత్వ ఆశయం

గ్రామాల్లో పరసరాల పరిశుభ్రత కోసం పంచాయతీలలో స్వచ్ఛ భారత కార్యక్రమా న్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ప్రతి పంచాయతీలోని గ్రా మాలలో వీఽధుల పరిశుభ్రత కోసం ప్రభుత్వం స్వచ్ఛతా రాయబారులను నియమించింది.

MEETING: సనాతన ధర్మం విశ్వ వ్యాప్తం

MEETING: సనాతన ధర్మం విశ్వ వ్యాప్తం

ఆది, అంతం లేని సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపించి ఉంటుందని ఆర్‌ఎస్‌ ఎస్‌ కార్యకర్తలు పేర్కొన్నారు. మండలపరిధిలోని ఆనందాశ్రమం వద్ద శనివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేయి చేయి కలిపి అందరు సమైక్యంగా హిందూ ధర్మ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.

PULSPOLIO: నేడే పల్స్‌పోలియో

PULSPOLIO: నేడే పల్స్‌పోలియో

డివిజన పరిధిలోని 0-5సంవత్సరాల్లోపు పిల్లలందరికి ఆదివారం పల్స్‌పోలియో చుక్కలను వేయించాలని ఇనచార్జ్‌ డిప్యూటీ డీఎంహెచఓ చెన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి పల్స్‌పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీని వైద్యసిబ్బందితో కలిసి చేపట్టారు.

MLA: పరిశుభ్రతను పాటించాలి : ఎమ్మెల్యే

MLA: పరిశుభ్రతను పాటించాలి : ఎమ్మెల్యే

విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ముస్తాబ్‌ కార్యక్ర మానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు.

PROTEST: ‘ఉపాధి హామీ’ పేరు మార్పుపై నిరసన

PROTEST: ‘ఉపాధి హామీ’ పేరు మార్పుపై నిరసన

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానిక మ హాత్మాగాంధీ పేరు తొలగిస్తూ వీజీ జీ ఆర్‌ ఎంఎం జోగు పేరు పెట్టడపై సీపీఎం, రైతుసంఘం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు వారు శనివారం స్థానిక గాంధీ నగర్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.

HNSS: చెరువులకు చేరుతున్న కృష్ణా నీరు

HNSS: చెరువులకు చేరుతున్న కృష్ణా నీరు

హంద్రీనీవా నీటి తో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని పాలకులు ఇచ్చిన మాట ను నిలపెట్టుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి చెర్లోపల్లి రిజర్వా యర్‌కు, అక్కడి నుంచి చిత్తూరు వరకు నీటి సరఫరాకు వెళ్లే ప్రధాన కాలువ నుంచి కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీరు నింపేందుకు చిన్న కాలువలు తీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి