Home » Anantapur
తాడిపత్రి పట్టణం అన్ని విధాలుగా బాగుండాలన్నదే తన అభిమతమని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం ఎంత ఖర్చు ఎంత అన్న విషయం ప్రజలకు తెలపాలని ఫ్లెక్సీని ఏర్పాటు చేశామన్నారు.
మండలపరిధిలోని గూటి బైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను గు రువారం ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా యాత్రికులతో కిటకిట లాడింది. అమ్మవారిని సిం హవాహనంపై ప్రత్యేకంగా అలంకరించారు. యాత్రి కులు తిమ్మమ్మను దర్శిం చుకుని, మర్రిమాను వద్ద కుటుంబ సభ్యులతో సేద దీరారు.
పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఆం గ్ల నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనంకోసం బారులుతీరారు.
గ్రామ పంచాయతీలు ఆయా గ్రామాలలోని చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి, దానిని రైతుల కు విక్రయించడంద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీల అభివృద్ధికి వినియోగించాలనే ఉద్దేశ్యంతో 2014లో టీడీపీ ప్రభుత్వం చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని ఆయా గ్రామ పంచాయతీ కేంద్రాలలో రూ. లక్షల వెచ్చించి నిర్మించింది.
నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందా లని పోలీసు సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ పిలుపినిచ్చారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేక్కట్ చేసి పోలీసుఅదికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియచేశారు.
నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మున్సిపాలిటీ పరిధిలోని కొత్త బైపాస్రోడ్డు సమీపంలో రెండు రోజుల పాటు జరిగిన ఇజితిమా ఆది వారంతో ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ముస్లింలు వే లాదిగా తరలి వచ్చారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మత పెద్దలు ఖురాన సారాంశాన్ని వివరించారు.
మం డల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠ శాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పా ఠశాలలో 1997-98 బ్యాచ పదో తరగతి చదివిన విద్యార్థులు అందరూ ఒకే చోట చేరారు. పాత జ్జాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము చదివిన పాఠశాలకు రూ. 80,000 వి లువ చేసే ఎనిమిది సీసీ కెమెరాలను అందజేశారు.
మండలంలోని మల్లేనిపల్లిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరద్వార ప్రవేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ లయ కమిటీ సభ్యులు ఆదివా రం తెలిపారు.
స్థానిక విద్యుత శాఖ సబ్ స్టేషనలోని ఏఈ కార్యాలయం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఐకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. గత్యంతరం లేక ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఏఈ కార్యా లయంతో పాటు ఆపరేటర్ గది కూడా పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తు న్నాయి.