Home » Uravakonda
మండలంలో బోరు బావుల కింద మిరప సాగును రైతులు ప్రారంభించారు. అదేవిధంగా జీబీసీ- హెచఎల్సీ కాలువ కింద పొలాలను సిద్దం చేసుకుంటున్నారు. అయి తే ఈ యేడు వర్షాభావ పరిస్థితి నెలకొనటంతో తుంగభద్రా డ్యాంకు ఇప్పటి వరకూ తగిన నీరు చేరకపోవడంతో మిరప సాగు చేసే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండల పరిధిలోని ఉదిరిపికొండ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిచాలంటూ గ్రామస్థులు రోడ్డె క్కారు. వారు మంగళవారం గ్రామంలోని అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై గంట పాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహిం చారు.
పట్టణం, అర్బన పరిధి లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సర్ విధులు కేటాయిస్తూ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీఎనయూఎస్, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. వారు మం గళవారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈఓ మస్తానరావుకు వినతి పత్రం అందజేశారు.
తాము ఎన్నికై ఐదేళ్లు పూర్తి అవుతున్నా మండల సమావేశాల్లో తాము చర్చించిన సమస్యలు తీరలే దంటూ ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హిం చారు.
మండలంలోని మోపిడి గ్రామంలో వికసిత భారత, గ్యారంటీ ఫర్ రోజ్ఘార్ అజీవికా మిషన గ్రామీణ పథకాన్ని జడ్పీ సీఈవో విజయలక్ష్మి గురువారం ప్రారంభిం చా రు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ వీబీజీ రాంజీ పథకం ద్వారా నిర్ణీత సమయంలోనే కూలీలకు బిల్లులు చెల్లిస్తారని, బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే అందుకు పరిహారం ఇస్తారని తెలిపారు.
పట్టణంలోని అనంతపురం- బళ్లారి జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు వెలగడం లేదు. రాముల మ్మ గుడి నుంచి సత్యం కల్యాణమండపం వరకు రోడ్డు మధ్యలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. సగానికి పైగా లైట్లు వెలగడం లేదు.
పట్టణానికి చెందిన హ నుమంతు కుమారుడు ఆర్నెల్ల లోకేష్ అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. మండలంలోని కౌకుంట్లలో ఆ చిన్నారి తల్లిదండ్రులు మంత్రిని కలిసి తమ కుమారుడిని కాపాడాలని విన్నవించారు. ప్రైమరీ ఈమో ఫాగో సైటిక్ లింపో ఇస్టియో సైటోసిస్ అనే వ్యాధితో బాధపడు తున్నాడని తెలిపారు.
స్థానిక ఆర్టీసీ బ స్టాండ్ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల రక్షణ కోసం పోలీసులు పట్ట ణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని కెమెరాలకు లెన్సలు పోగా, మరికొన్ని పనిచేయ డంలేదు.
జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలోని సరోజిని నాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో నారాయణ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ దినోత్సవానికి ముఖ్యఅ తిథిగా డాక్టర్ పత్తి హిమబిందు హాజరయ్యారు. వైద్యులు సుజాత, కృష్ణనాయక్, జయవర్ధన రెడ్డిని శాలువ, పూలమాలతో సత్కరించారు.
పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణంలో సహకార వారోత్సవాల్లో భాగంగా బుధవా రం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రైతులకు, ప్రజలకు డా క్టర్ వినీత ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.