Home » Uravakonda
వీహెచపీ, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో వీరహనుమాన విజయయాత్ర మో టార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీడీపీ మండల ఇనచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు
Lakshminarasimhaswamy statue honor
ప్రస్తుత వేసవి కాలంలో పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అధికారులను ఆదేశించారు. స్ధానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం ప్రత్యేక అధికారి కేశవనా యుడు అధ్యక్షతన అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
మండలకేంద్రంలో జరుగుతు న్న జోడులింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ వారం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఐరావత వాహనంపై పార్వతీ పరమేశ్వరులను ఊరేగించారు. ఉదయం ఆలయంలో రుద్రా భిషేకం చేశారు.
మండలపరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సిమెంట్ రోడ్లకు నీటితో క్యూరింగ్ సక్రమంగా చేయడం లేదు. దీంతో చేసిన పనులు ఎన్ని రోజులు ఉంటాయో అర్థంకాని పరిస్థితి. మండలకేంద్రమైన కూడేరుతో పాటు కొర్రకోడు, కడదరకుంట గ్రామాల్లో ఓ కాంట్రాక్టర్ దాదాపు రూ, 46.60 లక్షలతో సిమెంట్ రోడ్లు వేశారు. కానీ వాటి క్యూరింగ్ మరిచారు.
మండలకేంద్రంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సంగమ్మ, సంగప్పనంది వాహనంపై విహరించారు. మంగళవారం ఉదయం ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించా రు.
స్థానిక బార్ అసోసియేషన నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది శ్రీకాంత రెడ్డి ఎన్నికయ్యా రు. పట్టణంలోని బార్ అసోసియేషన కార్యాలయంలో సోమవారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి శ్రీకాంత రెడ్డి, మనోహర్ బాబు పోటీ పడ్డారు.
రాష్ట్రంలో పేదరికాన్ని పా రదోలడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటుప డుతున్నారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవా రం సాయంత్రం స్థానిక ఎస్ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలో మార్గదర్శి బంగారు కుటుంబం (ఎంబీకే) 10-20 వార్షికోత్సవ సమావేశాన్ని నిర్వ హించారు.
రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని కాంగ్రెస్పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ విశ్రాంత భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గ పదవీకాలం ఈ నెల 17తో ముగిసిందన్నారు.
మండలంలోని కరకముక్కల జడ్పీ హైస్కూల్లో శనివారం సీలింగ్ ఫ్యాన విరిగి పడింది. అయితే గదిలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమా దం జరగలేదు. కరకముక్కల పా ఠశాల శిథిలవస్థకు చేరింది. దీం తో ఎన్నోసార్లు పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ అధికారులు పాఠశాలకు మరమ్మతులు చేయించలేదు.