Share News

NMUA: ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకండి

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:02 AM

ఏడు ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకుండా కాపాడాలని ఎనఎంయూఏ డి పో అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకుడు కేఎస్‌ వలి పేర్కొన్నారు. అ దే విధంగా విద్యుత బస్సుల నిర్వహణను పినాకిని సంస్థకు అప్పగించ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎనఎంయూఏ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక డిపో వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు ఎర్రబ్యాడ్జీలు ధరించి గేట్‌ ధర్నా నిర్వహించారు.

NMUA: ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకండి
NAMUA leaders protesting at Tadipatri depot

రాయదుర్గంరూరల్‌/తాడిపత్రి/గుత్తి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఏడు ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకుండా కాపాడాలని ఎనఎంయూఏ డి పో అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకుడు కేఎస్‌ వలి పేర్కొన్నారు. అ దే విధంగా విద్యుత బస్సుల నిర్వహణను పినాకిని సంస్థకు అప్పగించ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎనఎంయూఏ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక డిపో వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు ఎర్రబ్యాడ్జీలు ధరించి గేట్‌ ధర్నా నిర్వహించారు. యూనియన రాష్ట్ర అసిస్టెంట్‌ సెక్రెటరీ నాగరాజు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, రామాంజినేయులు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంఎంయూఏ నాయకులు తాడిపత్రి ఆర్టీసీ డిపో గేటు ఎదురుగా ఆ యూనియన నాయకులు కేజీఎన బాబు ఆధ్వర్యంలో ఆం దోళన నిర్వహించారు. ముఖ్య అతిథిగా రీజనల్‌ కార్యదర్శి ప్రతాప్‌యా దవ్‌ హాజరయ్యారు. ఎంఎంయూఏ డిపో అధ్యక్షుడు మహేశ, నాగేశ్వర్‌ రెడ్డి, రంగే శ్వర్‌రెడ్డి, మోహన, బాలపెద్దన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే గుత్తి పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఎనఎంయూఏ ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులు ధర్నా చేపట్టారు. డిపో కార్యదర్శి వెంకటరాము డు, గ్యారేజ్‌ సెక్రెటరీ శ్రీనివాస్‌ గౌడ్‌, అఽధ్యక్షుడు అంజి, నాయకులు రంగనాయకులు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 25 , 2026 | 12:02 AM