Home » TG News
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు టమాటా కిలో రూ.25 వరకు ఉండగా ప్రస్తుతం రూ.33కు విక్రయిస్తున్నారు. అలాగే.. పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి 50కు విక్రయస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయంటే...
హైదరాబాద్ మెట్రో రైల్.. ఇక కార్పొరేషన్గా విస్తరించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఇటీవల విస్తరించారు. 150 ఉన్న వార్డులను 300లకు విస్తరించారు. దీంతో మెట్రో రైలును కూడా విస్తరించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది విధి సిర్వహణను మరిచి అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. పధానంగా గేమింగ్, బెట్టింగ్లకు బానిసలవుతున్నారని ఆ శాఖ ఉన్నతాధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఓ యూజర్ 2025లో తమ ప్లాట్ఫామ్పై ఏకంగా రూ.22 లక్షలను ఖర్చు చేశారని స్విగ్గీ ఇన్స్టామార్ట్ తెలిపింది. అంతేగాక దేశంలోనే అత్యధికంగా ఒకే ఆర్డర్పై రూ.4.3 లక్షలను ఓ హైదరాబాదీ ఐ ఫోన్ల కోసం ఆర్డర్ చేశాడని స్విగ్గీ పేర్కొంది. ఆ సంస్థ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
క్రిస్మస్ పండుగను పురష్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-వేలాంకణి మధ్య మంగళవారం) రాత్రి 7.25గంటలకు ఓ రైలు. అలాగే.. బుధవారం సాయంత్రం 5.30గంటలకు మరో రైలు వేలాంకణికి బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నగరంలోని అల్మాస్గూడ రాజీవ్ గృహకల్పలో చోటు చేసుకుంది. ‘సారీ మై బాయ్.. నేను నీకు నచ్చినట్టుగా ప్రేమగా ఉండలేక పోతున్నాను. నీకు సంతోషం ఇవ్వలేక పోతున్నాను. ఇదే నా చివరి మెసేజ్’.. అని వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ మహాపగరంలోని ఆయా ఏరియాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
ఏపీ, తెలంగాణకు కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ ప్రధాన ఎజెండాగా ఈనెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజులు విరామం ఇస్తారు....
పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అసత్య ప్రచారాలను బలంగా తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలమూరుకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..