Home » TG News
మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినా పర్వాలేదు కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎ్సపై కాంగ్రె్సకు భారీ మెజారిటీ ఇవ్వాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
ఒవైసీ సోదరులను ఉద్దేశించి అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘15 సెకన్లు కాదు. నేను మోదీకి చెబుతున్నా.. నవనీత్ కౌర్కు గంట సమయం ఇవ్వండి.
కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న తమ తండ్రికి చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలంటూ ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు.
నాలుగో విడత ఎన్నికల పోలింగ్కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) అగ్రనాయకత్వం ప్రచారం దూసుకెళ్తుంది. బుధవారం నిర్మల్ జిల్లాలోని భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో అనుకోని పరిణామం ఎదురైంది.
మోదీ పాలన వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ ఎన్నికల్లో దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సూర్యాపేటలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
తెలంగాణలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. కేవలం ఐదు నెలల కాలంలోనే రేవంత్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత తెచ్చుకుందని అన్నారు. బీజేపీ తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తుందని విమర్శించారు.