Home » TG News
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రేవంత్రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని విమర్శలు చేశారు.
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అండ్ కో తమ ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లే ప్రధాన కారణమని తెలిపారు.
గంజాయి, డ్రగ్స్పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా బిహార్కు చెందిన యువకుడు ఏకంగా కిస్మత్పురలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి సాగుచేస్తున్నాడు.
యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆలయ ఈవోగా వెంకట్రావు అప్పట్లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.
నూతన సంవత్సర వేడుకలను హనుమకొండ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఒకరికొకరూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం అవినీతి నిర్మూలన కోసం జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన వినూత్న కార్యక్రమంలో అధికారులు పాలుపంచుకున్నారు.
కేసీఆర్ హయాంలో సర్పంచులు పనిచేసిన బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసే ప్రతి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసేలా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.
భాగ్యనగరంలో డ్రగ్స్ వినియోగంపై ఈగల్ టీమ్ కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పబ్బులపై నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిటీలోని నాలుగు ప్రముఖ పబ్బుల్లో ఈగల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
చైనా మాంజా అమ్మినా.. వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని మలక్పేట ఏసీపీ సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాణాంతకంగా మారిన ఈ చైనా మాంజాను దుకాణదారులెవరూ విక్రయించవద్దన్నారు. అలాగే.. ఈ మాంజాతో గాలిపటాలు ఎగురవేసినా చర్యలేంటాయన్నారు.
హైదరాబాద్లో ప్రతి సంవత్సరం జరిగే నుమాయిష్.. గురువారం నుంచి ప్రారంభం కానుంది. దాదాపు నెలా పదిహేను రోజులతపాటు దీనిని నిర్వహిస్తారు. కాగా.. ప్రవేశ రుసుం రూ. 50గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
కొత్త సంవత్సరాన్ని పురష్కరించుకొని సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడే అదకాశం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. అయితే... ప్రధానంగా శుభాకాంక్షల పేరుతో వచ్చే లింకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు.