‘Mana Ooru- Matamanti’ completes one year in Ravivalasa టెక్కలి మండలం రావివలస గ్రామస్థులకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్కల్యాణ్.. ‘మన ఊరు.. మాటామంతి’ కింద ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు. రావివలస గ్రామాన్ని అభివృద్ధి చేసేలా, ప్రజలతో మమేకమై.. వారి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరి కోసం మాటామంతి’ అనే స్ర్కీన్గ్రీవెన్స్ కార్యక్రమానికి పవన్కల్యాణ్ శ్రీకారం చుట్టారు.
Downed poles... no electricity or problems ఈదురుగాలుల ప్రభావంతో జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ విద్యుత్ సరఫరా లేక ఉక్కపోతతో అల్లాడిపోయారు.
Prabhu Kumar finds a place in Guinness World Records సంతబొమ్మాళి మండల కేంద్రానికి చెందిన కళింగపట్నం ప్రభుకుమార్ అరుదైన ఘనత సాధించాడు. మంచుకొండల్లో సాహసయాత్ర చేస్తూ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.
Petrol prices increased పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల పేరిట కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచేసింది.
నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం శ్రమించి నిధులు సమకూరిస్తే అధికారులు నిద్రపోవడం ఏమిటని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం నగర పరిధి పాత్రునివలస సమీపంలో పెండింగ్ లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మా ణానికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు శనివారం సదరు స్థలాన్ని పరిశీలిం చి భూమి పూజ చేశారు.
ఎచ్చెర్ల నియోజక వర్గం పరిధిలోని మత్స్యకారుల సమస్యలను ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు.
దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో విశిష్ట సేవలు అం దించిన జిల్లా పోలీస్ శాఖకు చెందిన 118 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకమైన పోలీస్ ఆంత్రిక్ సుర క్షా సేవా పథక్-2022 అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఎంపికైన పోలీస్ సిబ్బందికి పతకాలు ప్రదానం చేసి అభినందించారు.
Increasing dangers in coastal areas ఈత సరదా పలువురి ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో యువత, విద్యార్థులు ఆనందంగా గడిపేందుకు బీచ్లకు వెళుతున్నారు. కానీ ఆ ఆనందం మాటున కొన్నిసార్లు అలల ఉధృతి రూపంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
In narrow canals నాడు అధికారులు చేసిన తప్పులకు ప్రస్తుతం పారిశుధ్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇరుకైన కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తీయడానికి ఆపసోపాలు పడుతున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని కేటీ రోడ్డు, ఇందిరాజంక్షన్ నుంచి మొగిలిపాడు గ్రామం వరకూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారులు, కాలువలు నిర్మించారు.