ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు, చేష్టలకు మహిళలు నిరసిస్తూ ఎచ్చెర్లలోని శ్రీకాకుళం ఆంధ్ర జ్యోతి కార్యాలయానికి బుధవారం వచ్చి సంఘీభావం ప్రకటించారు.
మండలంలోని అంపోలు సమీపంలో ఉన్న జిల్లా జైలులో భుక్త బలరాం (27) అనే రిమాండ్ ఖైదీ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
జిల్లాలో భూగర్భ జలాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
మండలం లో ఇటీవల అకాల వర్షాలు, గాలులకు పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.
అకాల వర్షం టమాటా రైతును నిలువునా ముంచేసింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వందల ఎకరాల్లో పంట నీటమునిగింది.
సిక్కోలువాసుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. జిల్లా నుంచి ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతికి మొట్ట మొదటి డైరెక్ట్ రైలు అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చేసిన నిరంతర కృషి ఫలించి ఈ నూతన సర్వీసుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉపాధి హామీ పథకం వేతనదారులకు బిల్లులు చెల్లించడం లేదు. గత 75 రోజులుగా వారికి వేతనాలు అందడంలేదు.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు టూనా చేపలు అధికంగా లభ్యమవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలను కించపరిచే సంస్కృతి వైసీపీది, ఆ పార్టీ నాయకులదేనని మాజీ ఎంపీపీ, ఎమ్మె ల్యే కూన రవికుమార్ సతీమణి ప్రమీల అన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం జిల్లాలో పేద, మధ్య తరగతి జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది.