Home » Andhra Pradesh » Srikakulam
‘చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత’ అన్న చందంగా.. వైసీపీ ప్రచారం పతాకస్థాయికి చేరింది. ఇటీవల జిల్లాలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి.. ‘గడప గడపకూ సంక్షేమం’ పేరిట కరపత్రాలు పంపిణీ చేశారు.
పెద్దమర్రిపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడకు చెందిన తేరిపల్లి లోకనాథం(33) మృతి చెందాడు.
బావాజీపేటలో ఆదివారం రాత్రి జరిగిన కొట్లాటకు సంబందించి ఇరువర్గాలవారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ (శ్రీకాకుళం)లో 15వ బ్యాచ్కు శిక్షణ ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి విజయకుమార్ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల విధుల్లో చేరేందుకు మాజీ సైనిక ఉద్యోగులు స్వతహాగా ముందుకు రావాలని ఎస్పీ జీఆర్ రాధిక పిలుపునిచ్చారు.
స్థానిక జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సీనియర్ న్యాయవాది కణితి విజయ లక్ష్మీబాయి హాట్రిక్ సాధించారు.
బెంతు ఒరియాలు కవిటిలో చేపట్టిన నిరసన దీక్ష సోమవారం 82వ రోజుకు చేరుకుంది.
బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు.
జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లావ్యాప్తంగా 145 కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 29,243 మంది విద్యార్థులకుగానూ తొలిరోజు 28,785 మంది హాజరయ్యారు. 458 మంది గైర్వాజరయ్యారని డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు.
‘ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలకు సమీపంలో ఎమ్మెల్యే వర్గీయుల స్థలాల్లో టెంట్లు వేసి.. బెల్టు దుకాణాల తరహాలో మద్యం కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మనుషులమని.. నచ్చింది చేసుకోమని సవాల్ చేస్తున్నారు’ అంటూ ఎక్సైజ్ సిబ్బంది ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) బి.సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు.