గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాసు సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మరో సంచలన ఆడియో విడుదల చేశారు. ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
90 percent of grievances are revenue issues ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితా 22-ఏలో చిక్కుకున్న భూ సమస్యలకు, భూ కబ్జాలకు ఇకపై విముక్తి లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు, ప్రజలకు సమస్యలు ఎదురయ్యాయి.
Farmers' lands were destroyed and sold గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో చేసిన నిర్వాకంతో జిల్లాలో వందలాది మంది రైతులు, ప్రజలు తమ భూములను, స్థలాలను కోల్పోయారు. వీటి పరిష్కారం కోసం శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ‘మీ చేతికి మీ భూమి- 22-ఏ నుంచి స్వేచ్ఛ’ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.
'Medical' racket of private hospitals in the srikakulam జిల్లాలో సామాన్యుడికి వైద్యం పెనుభారంగా మారుతోంది. రోగానికి చికిత్స కోసం వెళ్తే.. ఆసుపత్రి ఫీజుల కంటే మందుల బిల్లులే తడిసి మోపెడవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, వాటి అనుబంధ మెడికల్ షాపుల మధ్య నడుస్తున్న కమీషన్ల బంధమే.
Clashes over removal of flexi మడపాం టోల్ప్లాజా వద్ద వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయి. టోల్గేట్లు అన్నీ మూసివేసి రోడ్డుమీద బైఠాయించి శుక్రవారం సాయంత్రం హల్చల్ చేశాయి.
ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికే ప్రతి శుక్రవారం ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని... అందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు.
మిల్లు యజ మానులు ధాన్యం తూకంలో దోపిడీని ఆపకపోతే వేటు తప్పదని జిల్లా సివిల్ సప్లయిస్ డీఎం టి.వేణు గోపాల్ హెచ్చరిం చారు.
Marijuana eradication కాశీబుగ్గ డివిజన్లో ఎక్కువగా ఒడిశా సరిహద్దులు ఉండడంతో గంజాయి అక్రమ రవాణా అధికంగా జరుగుతోందని డీఎస్పీ షేక్ సహబాబజ్ అహ్మద్ అన్నారు.
డ్రగ్స్ లేని సమాజ నిర్మాణానికి అందరూ చేయూత అందించాలని ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు వరమని, దరఖాస్తు పెట్టుకోగానే భరోసా లభిస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.