Home » Andhra Pradesh » Srikakulam
ww
సాగు లో ఖర్చును తగ్గించి ఉత్పాదకతను పెంచు కోవాలని ఏవో వై.సురేష్ సూచించారు. మంగ ళవారం అల్లినగరం, అరిణాంఅక్కివలసల్లో నిర్వ హించిన పొలం పిలుస్తోంది కార్యక్ర మంలో రైతులకు పలు సూచనలు చేశారు.
సభ్యత్వ నమోదులో ఎచ్చెర్ల నియోజకవర్గం జిల్లాకే ఆదర్శంగా నిలవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. మం గళవారం ఎచ్చెర్లలో పార్టీ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమా వేశం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో పారదర్శకం పనిచేసేవారికి సరైన గుర్తింపు లభిస్తుందనడానికి తానే ఉదాహరణ అని చెప్పారు
జిల్లాలో ఆర్అండ్బీ పనులు సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలుతీసుకోవాలని ఆ శాఖ ఎస్ఈని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి జిల్లాలో నిర్మిస్తు న్న వివిధ ప్రాజెక్టుల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు.
యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసకావడం వల్ల జీవితాలు నాశనమైపోతాయని ఒన్టౌన్ ఎస్ఐ హరికృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని ఒన్టౌన్ పోలీసు స్టేషన్లో ఓపెన్హౌస్ కార్యక్రమంలో భాగంగా పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ-2 కృష్ణారావు,రైటర్ రవి పాల్గొన్నారు.
రణస్థలంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జనవరి నుంచి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసింది. టెండర్ల ప్రక్రియ సైతం దాదాపు కొలిక్కి వచ్చింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రీ సర్వే జరిగే గ్రామాల్లో మంగళవారం నుంచి రెవెన్యూ అధికారులు గ్రామసభలు ప్రారంభించారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో గత ఐదేళ్లూ ఇసుక అక్రమాలతో రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని వంశధార, మహేంద్రతనయ నదుల్లో ఇసుకను గ్రామస్థాయి వైసీపీ నాయకులు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారింది. దీనికి ‘దానా’గా నామకరణం చేశారు. ఈ తుఫాన్ ఒడిశాలో తీరం దాటనుండడంతో.. జిల్లాపై పెద్దగా ప్రభావం చూపనుంది.
సైబర్ నేరగాళ్లు రోజుకొక విధానం అనుసరిస్తున్నారని వారిపై అప్రమత్తంగా ఉండాలని డీఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు. మంగళవారం నరసన్నపేట సీఐ కార్యాల యం, పోలాకి పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ చేపట్టారు.