పాహిమాం చెన్నకేశవ.. జైజై చెన్నకేశవ.. నమో చెన్నకేశవ.. మమ్మేలు ఇలవేల్పా.. శరణఘోషలతో మార్కాపురం పట్టణం హోరెత్తింది. శ్రీదేవిభూదేవి సమేతుడై చెన్నుడు రథంపై కొలువైన వేళ భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు. దేవదేవుని దివ్యమంగళ స్వరూపం తిలకించి భక్త జనం పులకించిపోయారు.
టిడ్కో గృహ సముదాయాన్ని నాణ్యతా ప్రమాణాలతోపాటు అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
ఈత సరదా యువకుని ప్రాణం తీసింది. శనివారం ముగ్గురు యువకులు సరదగా రామతీర్థం ఆలయం సమీపం నుంచి వెళ్తున్న ఒంగోలు బ్రాంచ్ కాలువలో ఈత కొడదామని దిగారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకొని సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట-కోటప్పకొండ మార్గంలో యడవల్లి గ్రామం సమీపంలో చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ (39) శుక్రవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా 22ఏ కాలంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. క్లరికల్ తప్పుల వలన నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు భూములను నిర్ధిష్ట గడువులోపు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.
మార్కాపురం జిల్లా ఏర్పాటై మూడు నెలలు పూర్తయినా నేటికీ ఇరిగేషన్ శాఖ కార్యకలాపాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నట్టుగానే కొనసాగుతోంది. డివిజన్, సబ్డివిజన్ వ్యవస్థలో మార్పుల ఊసేలేదు. కొత్తగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నాలుగు నియోజకవర్గాలతో నూతన జిల్లా ఏర్పాటైన తరువాత అంతకు ముందు ఉన్న రూపు నుంచి అన్ని శాఖల పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. మొత్తం 21 మండలాల పరిధిలోని సబ్ డివిజన్లు జిల్లా పరిధిలో ఉండేలా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే పలు శాఖలు మార్పులు జరగ్గా ఇంకా కొన్ని శాఖల్లో పాత పద్ధతిలోనే కార్యకలాపాలు కొనసాగుతూ సాంకేతిక వివరాల నమోదు కూడా ఒంగోలు పేరుతోనే జరుగుతోంది. అటువంటి శాఖల్లో ఇరిగేషన్ ఒకటి.
రీ సర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్ ఎల్పీ నెంబర్లు లేకుండా చూడాలని జేసీ కల్పనా కుమారి ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలతో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
:గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయి రెమ్యూనరేషన్ అందుకోని రైతులకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తహసీల్దార్ సింగారావును ఆదేశించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ బుధవారం ముప్పవరం వద్ద (బీకేవీ 544జీ) గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించారు.
యర్రం చిన్నపొలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకం పునరావాస గ్రామాల వారికి వెంటనే పరిహారం చెల్లిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి తెలిపారు. బుధవారం కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయంలో పునరావాస గ్రామాలు అయిన కొరిశపాడు, ఆగ్రామశివారు తూర్పు గ్రామాల ప్రజలతో ఎస్డీ తో పాటు డిప్యూటీ తహసీల్దార్ మెహతాజ్లు సమావేశం అయ్యారు.