జిల్లాలో నూతన సందడి నెలకొంది. కొత్త సంవత్సర వేడుకలతోపాటు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటైంది. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో కలిశాయి. ఈ సందర్భంగా అన్నిచోట్లా నూతనోత్సాహం నెలకొంది.
కోల్ సొసైటీలో చోటుచేసుకున్న అక్రమాలపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఒంగోలు కేంద్రంగా నడు స్తున్న గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారుల, క్యూరర్ల సహకార మార్కెటింగ్ సొసైటీ (కోల్ సొసైటీ)పై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్ర, లోతైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా సహకార అధికారి (డీసీవో)ని ఆశాఖ ఉన్నతా ధికారులు ఆదేశించారు.
జిల్లాలోని రైతులకు శుక్రవారం నుంచి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వేను ఇష్టారీతిన చేయడంతోపాటు రైతులకు ఇచ్చిన పాసుపుస్తకాల్లో అప్పటి సీఎం జగన్ బొమ్మను ముద్రించారు.
జిల్లాలో గురువారం నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైంది. 15వతేదీ వరకు కార్డుదారులకు సరుకులు అందజేస్తారు.
పంగులూరు, మండలంలోని రేణంగివరంలో గురువారం రాష్ట్రస్థాయి పొట్టేళ్ల పందేలు ఉత్సాహభరితంగా సాగాయి.
కందుకూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కందుకూరును ప్రకాశం జిల్లాలో చేరుస్తూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర కానుకను అందించారు.
నిత్యావసర సరుకుల కోసమని పోలవరం నుంచి మోపెడ్పై అద్దంకికి వస్తున్నవారిని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రకాశం జిల్లాలో డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. నాగేశ్వరరావు అనే వ్యక్తి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసి రిటైర్డ్ అయ్యారు.
పేదలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించటమే ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు.
మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా, అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ పాలన బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. మార్కాపురం జిల్లా, అద్దంకితోపాటు కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశంలో కలిపేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.