పట్టణాల అభివృద్ధికి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే నిధులే ఆధారమయ్యాయి. అవి పూర్తిస్థాయిలో వసూలు చేయకపోవడంతో ప్రస్తుతం పురపాలక సంఘాలు ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్నాయి. పనులు ముందుకు సాగడం లేదు. దీనికితోడు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈనెల 25న ఆయన వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. దోర్నాల మండలం కొత్తూరు వద్ద టన్నెళ్లను పరిశీలించను న్నారు. రూ.456 కోట్లతో జరుగుతున్న ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘంగా నెలరోజులపాటు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటాయి. గతంలో కేవలం 14 రోజులలో పరీక్షలు ముగిసేవి. ఈసారి 23 సబ్జెక్టులకు నెలరోజులపాటు కొనసాగనున్నాయి.
జిల్లావ్యాప్తంగా శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పలుప్రాంతాల్లో ముఖ్య ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతినెలా మూడో శనివారం ఒక్కో ప్రత్యేక అంశాన్ని తీసుకొని చేపడుతున్న ప్రభుత్వం ఈసారి జీరో వేస్ట్ను తీసుకుంది.
ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లపై బోర్డు ఉన్నతాధికారులు ఎట్టకేలకు దృష్టిసారించారు. గతంకన్నా ఈ ఏడాది వేలం జాప్యమయ్యే అవకాశాలు, దీంతో రైతులకు జరగనున్న నష్టంపై ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన వరుస కథనాలతో వారు కదిలారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు డిజిటలైజేషన్ (కంప్యూటరీకరణ) చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ మేరకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డిజిటలైజేషన్కు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో తదనుగుణంగా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్టూరు కమ్యూనిటీ హెల్త్ సెంటరును వందపడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అ న్నారు.
జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కోటా నిధులతో చేపట్టిన పనుల పూర్తికి యంత్రాంగం ఉరుకులు, పరుగులు తీస్తోంది. ఇటీవల రూ.110 కోట్లతో ఈ పనులు మంజూరు చేశారు. వాటిని వచ్చేనెల 15లోపు పూర్తిచేసి ఎం.బుక్ కూడా నమోదు చేయాల్సి ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నిర్వహించే ప్రకాశం, మార్కాపురం జిల్లాల సమా వేశంలో సాగు, తాగునీటికి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ముందస్తు సమావే శంలో రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు నిర్ణయిం చారు. శుక్రవారం విజయవాడలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం నివాసంలో సమావేశం జరిగింది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో మళ్లీ ఇష్టారాజ్యం నెలకొంది. గత కొన్నేళ్లుగా బోగస్ గ్రూపులు సృష్టించి అమాయక పొదుపు మహిళలను బాధ్యులుగా చేసి రూ.లక్షలు దండుకున్న పలువురిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది.