ఒంగోలులో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతమైంది. గురువారం ఒంగోలులోని పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి లోకే్షకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు.
పెళ్లి బృందానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న టెంపో ముందు టైరు పగిలిపోవడంతో డివైడర్ మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయింది.
ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ కార్యకర్తలు, నాయకుల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు ఐక్యతగా పని చేస్తున్నారని తెలిపారు. ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు.
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూటమి ప్రజా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. కటాఫ్ డేట్ ముగిసినా అర్హులైన 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్థిక సాయం అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా రూ.100 కోట్ల పెట్టుబడితో చదలవాడలో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్కు మంత్రి శంకుస్థాపన చేశారు.
పొగాకు పంటపై అధికంగా విధించిన అపరాధ రుసుంను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని వేలం కేంద్రాల ప్రతినిధులు కోరారు.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకే్షఒంగోలు పర్యటనకు విచ్చేయనుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మొదలైంది. యువగళం యాత్ర అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మంత్రి హోదాలో ఒంగోలు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు ఇటు పార్టీ శ్రేణులు, అటు అధికార యంత్రాంగం భారీఏర్పాట్లు చేస్తున్నారు.
టీడీపీ శ్రేణులు జోష్లో కనిపిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్లు మూడు రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో పర్యటించనుండటమే అందుకు కారణం.
జిల్లా వాసుల జీవనాడి అయిన వెలిగొండ ప్రారంభానికి సిద్ధమైంది. కృష్ణమ్మ నల్లమల సాగరానికి పరవళ్లు తొక్కే రోజు సమీపిస్తోంది. ఈనేపథ్యంలో జిల్లా అంతటా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిం దని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కౌశలం ద్వారా స్వర్ణ వార్డు, గ్రామ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.