తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారిలో ఉన్న హిందూ దళితుల శ్మశానాన్ని ఆక్ర మించుకునేందుకు ప్రయత్నించిన, శ్మశానంలోని సమాధులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ స్థానిక ఎంపీడీవో కార్యలయం వద్ద, తహసీల్దార్ కార్యలయం వద్ద నాయుడుపల్లెలోని హిందువులు, దళితులు ధర్నా నిర్వహించారు.
మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుంటూరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన గిద్దలూరు మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
క్రిస్మస్ పండుగవేళ మండలంలోని తంగెళ్లలో విషాదచాయలు అలుముకున్నాయి. తంగెళ్ల-జగ్గిరాజుపాలేల మధ్య గురువారం రాత్రి ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి మోటార్సైకిల్ ఢీకొట్టిన ప్రమాదంలో ఎస్సీకాలనీకి చెందిన డేవిడ్(23) అక్కడికక్కడే మృతిచెందాడు.
దోర్నాలలో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. 4 ఇళ్లల్లో చోరీకి యత్నించి ఒకరి ఇంట్లో రూ.2,50,000 నగదు, 26 తులాల బంగారు నగలు, బైక్ను అపహరించుకుపోయిన ఘటన ఇందిరానగర్లో చోటుచేసుకుంది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం బెల్ట్ దుకాణాలపై టాస్క్ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. గురువారం ఎస్పీ వి.హర్షవర్ధనరాజు ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ అధికారులు పలు బెల్ట్ దుకాణాలపై దాడులు చేసి ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
: క్రిస్మస్ వేడుకలకు చర్చీలు, ప్రార్థనామందిరాలు ముస్తాబ య్యాయి. గ్రామాలు, పట్టణాలు, పల్లెలోని ఆయా మందిరాలను విద్యుత్దీపాలతో సుందరంగా అలంకరిం చారు.
క్రిస్మస్ వేడుకల నిమిత్తం మండలంలోని అన్నీ చర్చీలు సర్వాంగ సుందరంగా అలంకరించబడ్డాయి. బుధవారం అర్ధరాత్రి నుండి మిడ్నైట్ ప్రత్యేక ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు. అందుకోసం దొనకొండలోని ప్రధానమైన ఆర్సీఎం, ఏబీఎం, సీయ్సఐ, లూథరన్తో పాటు అన్నీ చర్చీల్లో ప్రత్యేక ఆకర్షణీయమైన విద్యుత్ లైట్లు, నక్షత్రాలు, క్రిస్మస్ చెట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
జిల్లాలో పంచాయతీల విభజనకు భారీగా ప్రతిపాదనలు అందాయి. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో పంచాయతీల విభజన కోసం వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందుకోసం ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి పంచాయతీల విభజనకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలన చేపట్టారు.
మిస్ అయిన సెల్ఫోన్లను ఆధునిక సాంకేతిక విధానంతో గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని ఎస్పీ వి.హర్షవర్ధనరాజు చెప్పారు.
:రాష్ట్రంలో వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యార్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం వసతి గృహాల్లో సమగ్రమైన మార్పులు చేపట్టిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. తాళ్లూరులో 8 ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోని కేజీబీవీ టైప్ 2 బాలికల వసతి గృహాన్ని మంత్రితోపాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి బుధవారం ప్రారంభించారు.