ప్రభుత్వం ఆర్భాటంగా మంజూరు చేసిన డిగ్రీ కళాశాల వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో విద్యార్థుల విద్య కుంటుపడు తోంది.
ప్రస్తుతం మారిన వాతావరణ ప్రభావం వలన దోమల బెడదతో ప్రజలు వైరల్ ఫీవర్లతో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్నందున వైద్య శాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకో వాలని మార్కాపురం సబ్కలెక్టర్ రాహుల్మీనా కంభం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శివనాయక్కు సూచించారు.
మండలంలోని కోనంకి గ్రామంలో షేక్ ఖాజావలి అనే వ్యక్తి ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ద్విచక్రవాహనాలు, ఒక సోడాబండి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం అర్ధ్దరాత్రి జరిగింది శుక్రవారం ఉదయం బాఽధితుని కుమారుడు షేక్ మస్తానవలి మార్టూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ రాజశేఖర్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఖాజావలి కోనంకిలో సోడాబండిని నడుపుకుంటూ వ్యవసాయసీజన్లో బళ్లారి వెళ్లి వ్యవసాయం చేస్తుంటారు. ఇటీవల బళ్లారి వెళుతూ సోడాబండిని, తన ద్విచక్రవాహనాన్ని ఇంటి వరండాలో ఉంచాడు.
‘బయట ఎండ ఎక్కువగా ఉంది. ఉక్క పోస్తుంది. ఏరియా హాస్పిటల్లో చల్లగా ఉంటుంది. కాసేపు పడుకుని రెస్ట్ తీసుకుందామనిపించింది. ఆ మందుబాబుకి.. ఇంకేముంది క్వార్టర్ మందు వేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో బెడ్పై పడుకొని మత్తు నిద్రలోకి జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది వచ్చి లేపడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఈఘటన చీరాల ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వెలుగుచూసింది.
జిల్లా వైద్యారోగ్యశాఖలో ఎప్పుడో భర్తీచేసిన పోస్టులపై ఇప్పుడు విచారణలు జరుగుతుండటంతో ఆ శాఖ ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. 2004 నుంచి ఇప్పటివరకు జరిగిన నియామకాలపై రాష్ట్రస్థాయి అఽధికారులు విచారణలు చేస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఎయిడెడ్ పాఠశాలల యాజమానులలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. పాఠశాలల్లో పిల్లలు చేరకపోయినా ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు తమ స్కూళ్లల్లో నమోదు చేసి వారికి హాజరు వేస్తూ మోసానికి పాల్పడుతున్నారు.
దక్షిణాది పొగాకు మార్కెట్లో అదే జోరు కొనసాగుతోంది. దాదాపు మూడు వారాల అనంతరం ఈ ప్రాంతంలోని 11 వేలం కేంద్రాల్లో శుక్రవారం పొగాకు కొనుగోళ్లు పునఃప్రారంభం కాగా గతంలో ఉన్న డిమాండ్ కొనసాగింది.
కొందరు అక్రమార్కులు అధికారం ముసుగులో నిధులను అడ్డంగా దోచేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పంచాయతీల్లోని కొంతమంది సర్పంచ్లు, అధికారులు తాము చెప్పిందే రాజ్యాంగమన్న విధంగా వ్యవహరించారు. నిధులను ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేశారు. అందుకు సంబంధించిన రికార్డులు, రసీదులు సక్రమంగా లేనేలేవు. ముఖ్యంగా ఒంగోలు డివిజన్ పరిధిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మేజర్ పంచాయతీలైన సింగరాయకొండ, ఉప్పుగుండూరు, దొడ్డవరంల గ్రామాల్లో లక్షల రూపాయల నిధులను అక్రమంగా వినియోగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు విచారణ జరిపిన అధికారులు అవినీతికి పాల్పడిన ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తుండగా, సర్పంచ్లకు చెక్పవర్ రద్దుచేస్తున్నారు.
ఆర్టీసీలో కాం ట్రాక్టు, అవుట్సోర్సింగ్ కా ర్మికులకు వేతన బకాయిల ను ఆగస్టు 3లోపు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవా లని కార్మికశాఖ కమిషనర్ కె.కనకదుర్గాభవాని ఆదేశిం చారు.
టంగుటూరు వాణీనగర్లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇత్తడి విజయ్కుమార్ను గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నార్త్బైపాస్ రోడ్డులో అరెస్ట్ చేశామని కనిగిరి డీఎస్పీ ఆర్. రామరాజు ఆంధ్రజ్యోతికి తెలిపారు.