మార్కాపురం అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక 27వ వార్డులోని దత్తసాయి గుడి వద్ద గురువారం రాత్రి మార్కాపురం జిల్లాకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
పశుగణాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తూ పాడి రైతులకు చేయూత అందిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.
: నేటి యువత ఆలోచనలు, మేధో సంపత్తి సమాజంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార దిశగా ఉండటంతో పాటు మేలు చేకూర్చేలా ఉండాలని కలెక్టర్ పీ రాజాబాబు సూచించారు.
వేటపాలెం మండలం పాపాయిపాలెంలో బుధవారం నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య, యువనాయకులు గౌరీఅమర్నాధ్తో కలిసి పాల్గొన్నారు.
‘తప్పుచేసిన వారు ఎక్కడున్నా తప్పించుకోలేరు. ఉద్యోగ విరమణ చేసి వెళ్లినా వదిలి పెట్టేది లేదు. అక్రమాలకు పాల్పడిన వారు ఎప్పుడైనా సరే దానికి బాధ్యత వహించాల్సిందే’! ఇదీ ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సరికొత్త మార్పు. గతంలో అక్రమాలకు పాల్పడి ఉద్యోగ విరమణ చేసిన పలువురు తహసీల్దార్లకు ఇటీవల వరుసగా ఉన్నతాధికారుల నుంచి నోటీసులు అందుతున్నాయి.
జిల్లాకు దిత్వా తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ దానివల్ల నెలకొన్న మంగు వాతావరణం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగు రోజులుగా చిరుజల్లులు, చలిగాలులతో కూడిన తేమ వాతావరణం కొనసాగుతోంది. దీంతో పైర్లపై తెగుళ్ల దాడి, పురుగుల ఉధృతి అధికమైంది.
జిల్లాలో మూడో విడత స్వామిత్వ సర్వే ప్రారంభమైంది. గ్రామాల్లోని ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 508 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇప్పటివరకు రెండు విడతల స్వామిత్వ సర్వే నిర్వహించారు.
సాగర్ ఆయకట్టు భూముల్లో సాగు చేసిన వరి పైరు కోతలు ముగిసి ధాన్యం రైతు ముంగిళ్లకు చేరుతున్నప్పటికీ కొనుగోళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారులు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ ఒక్క దానికి కూడా గోతాలు, కాటాలు ఇతర మెటీరియల్ చేరలేదు. దీంతో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు.
జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ప్రభుత్వం అకడమిక్ ఇన్స్ట్రక్టర్ (ఏఐ) పోస్టులు మంజూరు చేసింది. ప్రతి స్కూలులో కనీసం ఒక టీచరైనా ఉండాలన్న లక్ష్యంతో వీరిని నియమిస్తోంది.
కొనకన మిట్ల సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ వార్డెన్ ఎం.శివశంకర్ తోపాటు కామటిగా పనిచేస్తున్న లక్ష్మీదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు.