తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాలోని తమ్ముళ్లు సిద్ధమయ్యారు. పండుగ వాతావరణంలో కార్యక్రమం జరిగేలా అన్ని ప్రాంతాలను ముస్తాబు చేశారు.
జిల్లాలో 2027 జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణన కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి చేపట్టిన కార్యక్రమం ఇప్పటికి 98 శాతం పూర్తయింది. వేసవి తీవ్రత అధికం గా ఉన్నప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎన్యుమరేటర్లు ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే ప్రక్రియను చేపడుతున్నారు.
రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయంపై అవసరమైన అంచనాకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తుందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్మిశ్రా తెలిపారు.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో భాగంగా మంగళవారం నిర్వహించిన హిందీ పరీక్షకు కేవలం 57మంది విద్యా ర్థులు మాత్రమే హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 23 కేంద్రాల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు.
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బ స్టాండు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహావి ష్కరణ జూన్ 6వ తేదీన జరగనుంది. కేంద్ర ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ హాజరుకానున్నారు.
మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. బక్రీదు పండుగ సందర్భంగా ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మూగజీవాల అక్రమ రవాణా, వధలపై నిఘాను ఉంచామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం సరికొత్త వ్యూహానికి శ్రీకారం పలికింది. నియోజకవర్గాలలో పార్టీ నాయకులు, కూటమి పార్టీలతో సఖ్యతను పెంచుకుని సమైక్యంగా ముందుకు వెళ్లాలని సూచించింది.
జిల్లా జనసేనలో బహిర్గతమైన విభేదాలు, వివాదాలపై ఆపార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సీరియస్ అయ్యారు. మొత్తం పార్టీ ప్రక్షాళనకు నిర్ణయం తీసుకున్నారు. అందులోభాగంగా ఒడా చైర్మన్ రియాజ్ అధ్యక్షుడిగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేశారు.
తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో మహానాడు జోష్ కనిపి స్తోంది. నెల్లూరు మహానాడు రద్దు అయినప్ప టికీ ప్రత్యామ్నాయంగా క్లస్టర్ స్థాయిలో నిర్వ హణకు అధినేత నిర్ణయించడంతో ద్వితీయ, తృతీయశ్రేణి నేతలు రంగంలోకి దిగారు.
జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రూ.లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేసి తీరా అమ్ముకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.