విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు ఏపీ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
క్రీడా సంఘాల ముసుగులో అక్రమాలకు పాల్పడిన వారిపై ఎట్టకేలకు చర్యలకు రంగం సిద్ధమైంది. నకిలీ సర్టిఫికెట్లు జారీచేసి అర్హులకు అన్యాయం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రకటించారు. రాష్ట్రంలోనే ఒంగోలులో ఈ అక్రమాలు ఎక్కువ జరిగినట్లు గుర్తించామని ఆయన చెప్పారు.
విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకొని శాస్త్రీయ దృక్పథంతో ప్రాజెక్టులు తయారు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు సమీపంలోని సాయిబాబా సెంట్రల్ స్కూలులో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్ గంగాడ సుజాతతో కలిసి జేసీ ప్రారంభించారు.
ఇదే స్పూర్తితో.. రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు మరింతగా పనిచేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్రాజు పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య కేసులో సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేసి, నిందితులను పసిగట్ట డంలో సమర్థవంతంగా పనిచేసినం దుకు పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.
జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహ రించిన 18మంది పంచాయతీ కార్యదర్శులు, సక్రమంగా పర్యవేక్షించని 12 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పల్స్ పోలియో నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కలు వేసేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది.
నేటి విద్యార్థులు భవిష్యత్ సమాజానికి నిర్దేశికులుగా మారాలని సమాచారశాఖ విశ్రాంత కమిషనర్ హీరాలాల్ సమారియా పిలుపునిచ్చారు. స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి.
జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్త లకు శుక్రవారం 5జీ సెల్ఫోన్లను అందజే శారు. మొత్తం 13 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని మూడు వేల మంది అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు శాసనస భ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు.
ఒంగోలు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ కంకణాల ఆంజ నేయులను బాధ్యతల నుంచి తొలగిస్తూ కార్పొరేషన్ కమిషనర్ కె.వెంకటేశ్వర రావు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేశారు.
విద్యావంతులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు.