Home » TG Govt
తెలంగాణ అభివృద్ధికి రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నా. రాష్ట్ర ప్రభు త్వం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
Congress MLA Mega Reddy: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వనపర్తి నియోజకవర్గంలో అవినీతి, అక్రమలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మెగారెడ్డి ఆరోపించారు.
KTR: హైదరాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటాయని చెప్పారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కొంతమంది కావాలనే వక్రీకరించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్లో కేసు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియా అసత్య ప్రచారాలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న విధానం అమలు చేస్తామని చెప్పారు.
Minister Seethakka: దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని మంత్రి సీతక్క చెప్పారు. అందుకే నిబంధనల పేర ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి సీతక్క సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు.
Minister Sridhar Babu: కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.
CM Revanth Reddy: దేశానికి మహిళలు ఆదర్శం, మహిళా శక్తి దేశానికి అండ అని నిరూపించినా ఘనత కాంగ్రెస్దని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
Minister Thummala: దేశంలోనే ఏకైక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కొత్తగూడెం కేరాఫ్గా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం ప్రభుత్వ పక్షాన గట్టి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
CM Revanth Reddy: వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వానాకాలం సాగుకు సిద్ధమవ్వాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు.
రాబడుల్లో ఆశించిన పురోగతి లేకపోయినా, కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు పూర్తి స్థాయిలో రాకపోయినా, పన్నేతర రాబడి లక్ష్యాన్ని చేరుకోకపోయినా..