Home » TG Govt
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అధికారులు గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్కు మారాలని సీఎం రేవంత్రెడ్డి మార్గనిర్దేశం చేశారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి ప్రారంభించాలని నిర్దేశించారు. నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే సరిపోతోందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోతుందా.. నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. పర్యాటక అద్భుతాలను ప్రపంచానికి చూపాలని అన్నారు. తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుదామని తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల అనంతరం ప్రజలు ఇంటికి చేరుకునే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశారు.
కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్రావు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు.
జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సస్పెండ్ చేశారు. బదిలీల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డిని అల్వాల్ సర్కిల్ నుంచి కవాడిగూడకు ట్రాన్స్ఫర్ చేశారు.
జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేస్తున్న 60 మంది డిప్యూటీ ఇంజినీర్లను బదిలీలు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
మెడికల్ కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్డ్ కల్చర్ సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారని ఆక్షేపించారు.
డ్రగ్స్ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబసభ్యుల భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు.