Home » TG Govt
ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్కు మళ్లీ వస్తానని.. రోజంతా సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్లో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు.
భూదార్ కార్డులపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదార్ కార్డులు సిద్ధం చేశామని.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు గట్టిగానే తెలుపుతామని హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని గురువారం విచారణ చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్పై రేవంత్రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సమ్మిట్కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
భాగ్యనగరంలో మరోసారి భూముల వేలానికి హెచ్ఎండీఏ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కోకాపేట, మూసాపేట భూములకు సోమవారం నుంచి ఈ వేలం వేయనున్నారు