Home » TG Govt
పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అసత్య ప్రచారాలను బలంగా తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలమూరుకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు.
మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.255 కోట్ల ట్రిప్స్ పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.
గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ ఘటన దురదృష్టకరమని తెలంగాణ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం విచారణకు అదేశించిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఐడీపీఎల్ భూముల ఆక్రమణలపై ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఓ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సదరు భూములపై విజిలెన్స్ అధికారుల విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ సర్కార్.
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాల స్వీకరణ ఈరోజు(సోమవారం)తో పూర్తికానుంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కానుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిల మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్రెడ్డి.
ఎన్టీఆర్ స్టేడియం వేదికగా హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదగా ప్రారంభమవుతుందని బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్ తెలిపారు.
తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.