Share News

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:20 PM

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.387 కోట్లని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే.

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..
Central Government

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.387 కోట్లని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజా విడతతో కలిపి మొత్తం నిధులు రూ. 646.36 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద సుమారు రూ. 3,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి, కేంద్రం కోరిన సమాచారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సమర్పించింది. ఇందుకు అనుగుణంగా విడతలవారీగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇంకా సుమారు రూ. 2,400 కోట్లు విడుదల కావాల్సి ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 03:03 PM