Home » Central Govt
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినా.. వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కడం ఆపడం లేదు. ఎయిర్ పోర్టుకు నీరు, దారి.. లేదంటూ విషయం లేకుండా.. విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు.
‘‘వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
భోగాపురం విమానాశ్రయంలో ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఎయిర్పోర్ట్కు వచ్చిన ప్రయాణికులు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులు విమర్శలపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎత్తిపొడుపు మాటలు సరికాదంటూ.. ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, అవగాహన కీలకమని చెప్పింది.
దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినూత్నంగా కొన్ని ఆఫర్లు తీసుకువచ్చింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ CGM ఎం. శేషాచలం ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్రీడం 2.0 ఆఫర్ కింద ఒక్క రూపాయికే సిమ్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నజేషన్ పెట్టామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆరు నెలలుగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వివిధ స్థాయిలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పన్నుల శాఖ సంస్కరణలను జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులు ప్రశంసించారు. దేశానికే ఆదర్శంగా ఏపీ ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన ఉందని వ్యాఖ్యానించారు.