Home » Central Govt
కాళేశ్వరం (Kaleshwaram) బ్యారేజీల అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం తదితర విషయాలపై విచారించడానికి జస్టిస్ చంద్ర గోష్ (Justice Chandra Ghosh) కమిషన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన విషయం తెలిసిందే. నేటి(గురువారం) నుంచి జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను దృష్టిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి విజయం సాధించాలని కోరుకున్నానని అన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, ఈ ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
కాంబోడియాలో చిక్కుకుపోయిన ఎన్నారైలను స్వదేశానికి సురక్షితంగా తరలించామని విదేశాంగ శాఖ శనివారం ప్రకటించింది.
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉపాధి హామీ కూలీల వేతనాలు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాలకుగానూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద (MGNREGS) 4 - 10 శాతం వరకు వేతనాలు పెంచింది. వేతనాల సవరణలో భాగంగా ప్రభుత్వం పెంపుదలను ప్రతిపాదించింది.
పదేళ్లు ప్రధానిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ఎలాంటి కృషి చేయలేదని అన్నారు. బుల్లెట్ ట్రైన్ను గుజరాత్కు తీసుకెళ్లిన మోదీ, వికారాబాద్కు ఎంఎంటీఎస్ రైలును కూడా తీసుకురాలేదని మండిపడ్డారు.
మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ కేంద్ర హై కమాండ్ది ఒక దారి... సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది మరో దారిలా ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీకి బీ టీమ్ లీడర్గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం నాడు ఓ పత్రికా ప్రకటనలో సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, కంటెంట్పై గట్టి నిఘా ఉంచేందుకు కేంద్రం సిద్ధమైంది. కంటెంట్ పర్యవేక్షణకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్(FCU)ని జారీ చేసింది. ఈ చర్య ఇటీవల సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు అనుగుణంగా ఉంది.
ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తావ అని బీజేపీ(BJP) కేంద్ర నేతలు తనను అడిగారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని వారికి చెప్పానని అన్నారు. ముందు రాష్ట్రం, ఆ తర్వాత దేశానికి సేవ చేయాలని చెప్పానని తెలిపారు.తన కోసం త్యాగం చేసిన ఉదయ్ను కాకినాడ ఎంపీగా పంపిస్తున్నానని చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిబంధనలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. పిటిషన్లపై కేంద్రప్రభుత్వం తన స్పందన తెలియజేయాలంటూ తదుపరి విచారణకు ఏప్రియల్9వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈకేసును విచారించింది.
సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్ (Sridhar) కు కేంద్ర ప్రభుత్వం (Central Govt) షాక్ ఇచ్చింది. ఎన్ఎండీసీ సీఎండీగా శ్రీధర్ నియామక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. గత ఏడాది మార్చి 18వ తేదీన పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ సెలక్షన్ బోర్డ్ సీఎండీ పోస్ట్ కోసం 7 మందిని ఇంటర్వ్యూ చేసింది.