Home » Central Govt
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో.. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
ధూమపాన ప్రియులకు, పాన్ మసాలా తినేవారికి బిగ్ షాక్. పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధానం గురించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఏజీఆర్ సంబంధిత అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ అమలు చేయనుంది. అయితే, పూర్తిస్థాయి నోటిఫికేషన్ తరువాతే పెరిగిన శాలరీలు ఉద్యోగులకు అందనున్నాయి. రేపటి నుంచీ ఏరియర్స్ లెక్కింపు ఉంటుందని సమాచారం.
శ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక గ్రామం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శ గ్రామీణ నైపుణ్య కేంద్రానికి వేదికగా నిలిచింది. గ్రామీణ ఉపాధిని ప్రోత్సహిస్తూ, యువత, మహిళలకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘సైయెంట్ ఏఐ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ హబ్’ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.
వాజ్పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ క్రమంలో అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ గురువారం వెంకటపాలెం వద్ద నిర్వహించారు.
తెలంగాణ బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు టీబీజేపీ నేతలు.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ని కీలక పదవి వరించింది. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆయన నియమితులవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఏపీలో మోదీ జీరో అని ఎద్దేవా చేశారు. మోదీ హామీలపై, కాంగ్రెస్ హామీలపై కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి చర్చకు సిద్ధమా..? అని ఛాలెంజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో శుక్రవారం పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.