Home » Central Govt
విమాన ప్రయాణికులను దోపిడీ చేసే స్థాయిలో ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణికులపై భారం పడనివ్వబోమని పేర్కొన్నారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
సైబర్ మోసాలకు గురై డబ్బు పోగొట్టుకున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్ను ఆవిష్కరించింది. ఆ వివరాల కోసం ఈ వీడియోను వీక్షించండి.
ఇతర దేశాలతో వాణిజ్యంలో నైతికతకు పెద్దపీట వేస్తూ భారత్ తాజాగా నిబంధనలు మరింత కట్టుదిట్టం చేసింది. వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతులను నిషేధిస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఉడాన్ పథకాన్ని మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రూ.30 వేల కోట్లతో 100 కొత్త ఎయిర్పోర్టులు, 200 హెలిపోర్టులే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై చర్చించారు.
వరంగల్ విమానాశ్రయం ఆకృతిలో కాకతీయ సంస్కృతికి పెద్ద పీట వేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దిశగా మోదీ చేస్తున్న కృషి ఫలితమిస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.