రైల్వేశాఖ కీలక నిర్ణయం.. కుప్పంలో ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం
ABN , Publish Date - Feb 17 , 2026 | 09:41 PM
చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుదలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేఖ రాశారు..
అమరావతి, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో (Kuppam Railway Station) రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపేజ్కు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేఖ రాశారు. వాస్కోడగామా - వేలంకణి మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును కుప్పం రైల్వే స్టేషన్లో స్టాపేజ్కు ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు. దాదర్ సెంట్రల్ - పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ రైలు కూడా ఇక నుంచి కుప్పం రైల్వేస్టేషన్లో నిలుపుదల చేసేందుకు ఆమోదించినట్లు తెలిపారు రైల్వే శాఖ మంత్రి.
ఈ నెల10 తేదీన ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి కుప్పం రైల్వే స్టేషన్లో ఈ ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పం మీదుగా నడిచే దూరప్రాంత ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కోసం స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని గతంలో రైల్వేమంత్రికి తెలిపారు సీఎం. ఈ రెండు రైళ్ల స్టాపేజ్కు ఆమోదం లభించిట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. కుప్పంలో ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపేజ్కు అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..
వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News