Home » AP Govt
విశాఖపట్నంలో హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. హోం మంత్రి ప్రోత్సాహంతో మొదటి విడతగా 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమా అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్కు కేంద్రప్రభుత్వం భారీ పారిశ్రామిక ప్రాజెక్టును ప్రకటించింది. రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర నౌకాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ నెల్లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై కీలక సమీక్షా సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, అలాగే ఎస్ఐపీబీ ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల అమలుపై మంత్రుల కమిటీతో సీఎం సమీక్షించారు.
దేశ ప్రగతి ఎంత ముఖ్యమో... ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధితో పాటు ప్రజలకు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమని పేర్కొన్నారు.
కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు విదేశీ ప్రయాణాలు తగ్గించి.. దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఇంధన పొదుపుతో పాటు విదేశీ ప్రయాణాలు తగ్గించాలని ప్రధాని కోరారని పేర్కొన్నారు.
ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఏపీ ఎన్ఆర్టీ భవన్లో మంత్రి కొండపల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ సమావేశమైంది.
దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో డీఈవోలు, ఏపీసీలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
లేపాక్షి షోరూమ్లు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూమ్లకు నూతన హంగులు ఇవ్వాలని మంత్రి సవిత సూచించారు.