Home » AP Govt
Andhrapradesh: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలయ్యే వరకు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 62 వేల మంది రాజీనామా చేశారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు ఈసీ న్యాయవాది తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని ఈసీ న్యాయవాది వెల్లడించారు.
Andhrapradesh: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ను (CAT) వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... ఒకే ఆరోపణలపై రెండవ సారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది.
Andhrapradesh: స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈ పిటిషన్పై విచారణను మే 7 వరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మంగళవారం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది.
జగన్ సర్కారు(Jagan Govt)కు ఎన్నికల కమిషన్ (Election Commission) మరో షాక్ ఇచ్చింది. స్వయం సహయక బృందాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించకూడదని సంబంధిత అధికారులకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. సిద్ధం సభలకు స్వయం సహాయక గ్రూపు సభ్యుల ద్వారా జనసమీకరణ చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, ఇతరులపై నమోదైన కేసుల్లో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేందుకు సర్కార్ ముందుకొచ్చింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. కేసుల వివరాలను చంద్రబాబు, ఇతరులకు మెయిల్లో పంపామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితిపై ప్రొఫెసర్, ఆర్థికవేత చిన్నయసూరి సంచలన విషయాలు వెల్లడించారు. అభివృద్ధి అంటే ఉన్నదాన్ని మరింత వృద్ధి చేయడమని.. లేనిదాన్ని సృష్టించటం కాదని తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్లో ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఏం విధానం అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రస్తుతం తలసరి ఆదాయంలో 16వ స్థానంలో ఉందని.. దక్షిణ భారత్లో అధమ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) సమీపిస్తుండటంతో వైసీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఈసారి కూడా అధికారంలోకి ఎలాగైనా రావడానికి అధికార పార్టీ పలు అడ్డదారులు తొక్కుతోంది. ఇదే అదునుగా ప్రభుత్వంలోని కొంతమంది కీలక అధికారులు, రెవెన్యూ అధికారులు ఒక్కటై ప్రజలనూ ప్రలోభాలకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు.
Andhrapradesh: మన్యంలో స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీకి ఏపీ ప్రభుత్వం అప్పగించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ కోసం గిరిజన చట్టాలను జగన్ సర్కార్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మన్యంలో స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు అదానీకి అప్పగించటం గిరిజన హక్కులను హరించడమే అని అన్నారు.
‘అదానీ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన చట్టాలను సైతం తుంగులో తొక్కుతోంది. మన్యంలో జలాశయాల నుంచి నీటిని ఎత్తిపోస్తూ విద్యుత్ను ఉత్పత్తి చేసి నిల్వచేసే ప్రాజెక్టులను చట్ట విరుద్ధంగా అదానీ (Adani) పవర్ సంస్థలకు కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలను రూపొందించి అనేక రాయితీలతో ఆయా విద్యుత్ సంస్థలకు ప్రాజెక్టులు కట్టబెడుతున్నాయి.
జగన్ రుణ దాహం ఖండాంతరాలను దాటుతోంది. దేశంలోని బ్యాంకులు, ఆర్బీఐ, ఇతర దేశీయ ఆర్థిక సంస్థలతో తెచ్చిన అప్పులు చాలక... ఏకంగా విదేశీ సంస్థల నుంచీ అప్పులు తెచ్చేస్తున్నారు. అదేదో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం జైకా, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే అప్పు కాదండోయ్! ప్రభుత్వ ఆస్తులు, భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టుపెట్టి మరీ తెస్తున్న అప్పు!..