Home » AP News
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - తెలుగుదేశం - జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ చీఫ్, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) అన్నారు. ఏప్రిల్ 4 వ తేదిన ఉమ్మడి పార్టీల పార్లమెంట్ సమన్వయ సమావేశం జరుగుతుందని తెలిపారు.
అన్ని పార్టీలు డబ్బులున్న వారికి, ఎన్ఆర్ఐలకు, రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి టికెట్లు ఇస్తున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Laxminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... డబ్బులు పెట్టలేని తనలాంటి వారు ఎంతోమంది ఉన్నారని.. అలాంటి వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.
ఈ అరాచక జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే యువతకు భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర గురువారం విజయవాడలోని కానూరులో కొనసాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు.
ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు (AP High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ లెక్చరర్లకు పదోన్నతి కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఐదుగురు పిటీషనర్లు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటీషన్ల వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది.
Andhra Pradesh News: వైఎస్ జగన్ తీరుపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కూతురు సునీత(YS Sunitha) కన్నెర్ర చేశారు. అసలు చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని జగన్ను(YS Jagan) నిలదీశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సునీత..
అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైతు పోరాటమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana) అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు గత టీడీపీ ప్రభుత్వానికి భూమి ఇచ్చారని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు నేరం చేయలేదని.. కానీ జగన్ ప్రభుత్వం వారిపై దమనకాండ సాగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆత్మకూరు(Atmakur) నియోజకవర్గంలో నేటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ప్రారంభమవుతుందని నియోజకవర్గ టీడీపీ(TDP) అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana reddy) అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏఎస్ పేటలో జరగబోయే బహిరంగ సభలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులను నియమించింది. ఈ మేరకు ఈసీ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ కలిగింది. స్కిల్ కేస్లో ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
ఎర్రగుంట్లలో జనంతో సీఎం జగన్ ముఖాముఖి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు భూమా అఖిల వచ్చారు. ఆమెకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. భూమా వర్గీయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.