Home » Kuppam
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబానాయుడు సతీమణి భువనేశ్వరి తమిళంలో మాట్లాడారు. ఎలారిక్కిం సౌగ్యమా... అంటూ పలకరించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. అయితే.. అక్కడికి విచ్చేసిన వారితో తమిళంలో మాట్లాడారు.
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని ఇంట్లోనే పూడ్చి వేశాడు.
కుప్పం నియోజకవర్గానికి రూ.2979 కోట్ల పెట్టుబడితో మరో రెండు భారీ పరిశ్రమలు రానున్నాయి. రాష్ట్ర రాజధానిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రజాప్రతినిధులు వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని ప్రజా సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.
కుప్పం నియోజకవర్గంలో రూ. రూ.2,203 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఏడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 23 వేల మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంది.
కుప్పం మండలం బైరప్ప కొట్టాలలో భార్యను అతికిరాతకంగా కత్తితో నరికాడు ఓ భర్త. బైరప్ప కొట్టాలు గ్రామానికి చెందిన కీర్తనకు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లె సమీపంలోని తీర్థం గ్రామానికి చెందిన రాజేష్కు సుమారు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది.
పంచెకట్టులో నిండైన రూపం.. పెదవులపై చెరగని దరహాసం..ఆనందంతో జనాలకు అభివాదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలా కాకుండా భిన్నంగా కనిపించారు, వ్యవహరించారు. అధినేతకు జేజేలు.. ప్రాంగణమంతా ఈలలు.. మాటమాటకీ పట్టలేని ఆనందంతో గోలగోలలు.. జడత్వాన్ని వదుల్చుకున్న జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబులో ఎన్నడూ లేని పులకింత కనిపించగా.. జనంలో నిస్తేజం పటాపంచలై కేరింతలతో వెల్లువెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఎప్పటిలా కాకుండా, నూతనత్వంతో ఆద్యంతం ఉత్సాహం ఉరకలు వేసేలా విజయవంతంగా సాగి ముగిసింది.
ఈనెల 30వ తేది కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చి స్వాగతించనున్నట్లు హెచ్ఎన్ఎ్సఎస్ ఎస్ఈ విఠల్ ప్రసాద్ తెలిపారు.
కుప్పం మున్సిపాలిటీతోపాటు నాలుగు మండలాలకు పార్టీ అధ్యక్షుల నియామకంకోసం అధిష్ఠానం ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎంతకాలంగానో తామెదురుచూస్తున్న ఉచిత విద్యుత్తు పరిమితిని కూటమి ప్రభుత్వం పెంచడంతో నాయీ బ్రాహ్మణులు సంబరాలు చేసుకున్నారు.