Home » Kuppam
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. జూలై 3 నుంచి 5వ తేది (మూడు రోజులు) కుప్పంలో ఉండనున్నారు.
మండల పరిధిలో ఏనుగుల దాడుల కట్డడికి అడవి మధ్యలోని గ్రామాల చుట్టూ త్వరలో సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్టు కుప్పం అటవీ రేంజ్ అధికారి జయశంకర్, పీకేఎం ఉడా చైర్మన్ డా.సురే్షబాబులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన క్షణాన్ని పంచుకున్నారు. బుధవారం సీఎం దంపతులు కుప్పంకు బయలుదేరారు.
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టుకు పెద్ద ఊరట లభించింది. భూసేకరణపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టించారనే ఆరోపణల నేపథ్యంలో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిరీశ్ కుమార్ రెడ్డిని కుప్పం పోలీసులు అరెస్టు చేశారు.
కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హడావుడి చేశారు. ఇదంతా గతంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ అవినీతి కేసులో పట్టుబడ్డ వెంకటసుబ్బయ్య, నాటి జూనియర్ అసిస్టెంటు మోహన్తోపాటు ఇతర సాక్షుల విచారణ నిమిత్తమేనని తేలింది.
‘మీ బాధ్యత మాది. అధైర్య పడకండి’ అంటూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐటీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రవికుమార్ కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
‘పేదల ఆకలి తీర్చడమే అన్న ఎన్టీఆర్ ఆశయం. కూడు.. గూడు.. గుడ్డ నినాదంతో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇప్పుడా పథకాలు దేశమంతా అమలవుతున్నాయి.
‘చంద్రబాబు మీద నమ్మకంతో కుప్పంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తుకు పరిశ్రమలు దోహదపడతాయి. అందుకు అడ్డుపడకండి. స్వర్ణ కుప్పం సాకారానికి సహకరించండి’ అని కుప్పం ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు.