Share News

CM Chandrababu: సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ చంద్రగిరి మండలం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 15 , 2026 | 09:46 PM

స్వర్ణనారావారిపల్లె తరహాలో స్వర్ణ చంద్రగిరికి సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. స్వర్ణకుప్పం, నారావారిపల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ చంద్రగిరి మండలాన్ని తీర్చిదిద్దనున్నారని చెప్పారు.

CM Chandrababu: సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ చంద్రగిరి మండలం: సీఎం చంద్రబాబు
CM Chandrababu

తిరుపతి, జనవరి 15: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నారావారిపల్లెలో ప్రకటించారు. స్వర్ణనారావారిపల్లె తరహాలో స్వర్ణ చంద్రగిరికి ఆయన ప్రణాళికలు రూపొందించారు. స్వర్ణకుప్పం, నారావారిపల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ చంద్రగిరి మండలాన్ని తీర్చిదిద్దనున్నారని చెప్పారు. ఇందుకు వీలుగా ప్రణాళికల్ని అమలు చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.


చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఈ అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయనున్నారు. గత ఏడాది సంక్రాంతికి కందులవారిపల్లి, చిన్న రామాపురం, ఎ రంగంపేట గ్రామాలను కలిపి స్వర్ణ నారావారిపల్లి కార్యక్రమానికి ఎంపిక చేసిన విషయం విదితమే. స్వర్ణనారావారిపల్లె ప్రాజెక్టు ద్వారా ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.


ఏడాది కాలంలోనే అన్ని ఇళ్లకూ నూటికి నూరు శాతం సౌర ప్యానెళ్లను అమర్చడం ద్వారా ఇంధన స్వయం సమృద్ధిని సాధించింది. తద్వారా ప్రతి ఇంటికీ ఉచితంగానే విద్యుత్ వెలుగులు వచ్చాయి. శాస్త్రీయ పద్ధతుల్లో పాడి పరిశ్రమను ప్రోత్సహించడం, ప్రకృతి సేద్యం విస్తరణ తదితర ప్రణాళికల ద్వారా వారి తలసరి ఆదాయం 20 శాతం మేర పెరిగింది.


మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా ప్రత్యేక స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కార్యక్రమాలను కూడా సమర్ధవంతంగా అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రతి లబ్దిదారుడికి చేరేలా చేయటంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పనకు స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమంలో భాగంగా అమలు చేశారు.


ఇప్పుడు ఇదే స్ఫూర్తితో చంద్రగిరి మండలం అంతటా ఈ ప్రాజెక్టును విస్తరించాలని నిర్ణయించారు. ఏడాది లోపు నిర్దేశించుకున్న ఫలితాలు సాధించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చండి: సీఎం రేవంత్

గాలిపటంలా జీవితంలో పైకి ఎదగాలి: హరీష్ రావు

For More AP News and National News

Updated Date - Jan 15 , 2026 | 09:58 PM