Home » CM Chandrababu Naidu
రాయలసీమను సీఎం చంద్రబాబు సస్యశ్యామలం చేశారని ఏపీ మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ ఫరూక్ వ్యాఖ్యానించారు. రాయలసీమకు నేడు చంద్రబాబు వల్లే సాగునీరు వస్తోందని పేర్కొన్నారు.
ఏపీలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్, పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి ఏపీ రెండు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిశారు. దాదాపు 45 నిమిషాలు కీలక చర్చలు జరిపారు.
రాష్ట్రాల మధ్య సాగునీటి వాటాల కోసం వివాదాలు సహజమేనని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సీఎం చంద్రబాబుకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సూచించారు.
జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలతోనే దేశ ప్రగతి సాధ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తు టెక్నాలజీల కోసం ఏపీలో బలమైన ఎకో సిస్టమ్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. పలువురు కేంద్రమంత్రులతో సమావేశాలు పూర్తి చేసిన అనంతరం అస్సాం రాజధాని గౌహతికి సీఎం బయలుదేరారు.
పారిశ్రామిక పురోగతిలో సీఐఐది కీలక పాత్ర అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో లక్ష్యాలు చేరుకోవచ్చని వివరించారు.
జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పోఖ్రాన్ విజయంతో భారతదేశ సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు.
పీపీఏ, సీడబ్ల్యూసీ నిర్దేశించిన గడువు ప్రకారం 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేసినట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చడంలో పోలవరం కీలకమని తెలిపారు.