Home » CM Chandrababu Naidu
తెలుగు రాజకీయ ముఖ చరిత్రను మార్చిన సమావేశం రాజమండ్రి సెంట్రల్ జైలులో జరిగింది. పవన్ కల్యాణ్తో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారాయని ఆన్ స్టాపబుల్ సీజన్-4 ఎపిసోడ్లో ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు.
Andhrapradesh: ‘‘నేను మంత్రిని అయ్యాక చాలా మంది ముఖ్యమంత్రులు ఎయిర్పోర్టులు, హెలిపోర్టుల గురించి అడిగారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఎయిర్పోర్టులతో పాటు కనెక్టివిటీ, డ్రోన్ల ప్రాధాన్యం గురించి మాట్లాడారు’’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ 2024 మంగళవారం ఉదయం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నిర్వాహకులు సీఎంకు డ్రోన్లతో స్వాగతం పలికారు.
గిరిజనుల సంక్షేమానికి, గిరిజన ప్రాంతాల అభివృద్దికి అమలు చేస్తున్న పలు పథకాల ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. గిరిజనుల సంక్షేమానికి, వారి ప్రాంతాల అభివృద్దికి కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తి స్తాయిలో వినియోగించుకోవాలని, అందుకు తగిన మ్యాచింగ్ గ్రాంట్ను రాష్ట్ర ప్రభుత్వ పరంగా విడుదల చేసేందుకు తాను సిద్దంగా ఉన్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం దీపం పథకం ప్రవేశ పెట్టబోతుంది. దీపావళి రోజున ఆ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు.
శాంతి, భద్రతల పరిరక్షణకు ఏపీ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతిలో జరగనున్న డ్రోన్ షో విజయవంతం చేయాలని డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం సీకే కన్వెన్షన్ సెంటర్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమగ్నమయ్యారు.
గొర్లలో డయేరియాతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ప్రేమోన్మాది పెట్రోల్ దాడి ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సినీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్గా నిర్వహించే అన్స్టాపబుల్ సీజన్-4 (Unstoppable season-4) టాక్ షో చిత్రీకరణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.