Home » Trains
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే ఓ సూచన చేసింది. బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని కోరింది. ఈ కర్పూర హారతుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున కర్పూర హారతులు ఇవ్వవద్దని కోరింది.
విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ సహా ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వాల్తేరు సీనియర్ డీసీఎం కె.పవన్కుమార్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని
రన్నింగ్ రైల్లో ఓ యువకుడు, మహిళ చేసిన నిర్వాకం అందరికీ కోపం తెప్పిస్తోంది. బోగీ డోరు వద్ద ప్రమాదకరంగా నిలబడ్డ వారు.. ఏకంగా అక్కడే సరసాలు మొదలెట్టారు. పక్కన ప్రయాణికులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఆ వ్యక్తి..
సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతాయని తెలిపారు.
నమో భారత్ రైళ్లు కేవలం ప్రయాణాల కోసం మాత్రమే కాదు.. అంతకు మించి సందడిని అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఇరుకైన ప్రదేశాలు, కళ్యాణ మండపాల్లో ఫంక్షన్లు చేసుకుని బోర్ కొడుతోందా? అయితే మీ వేడుకలకు ఇకపై నమో భారత్ రైళ్లు వేదికలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.
రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ అంతా అవాక్కయ్యేలా చేసింది. సీట్ల కోసం కుస్తీ పట్టలేదు గానీ.. సీట్లో కూర్చుని ఆమె చేసిన పనే.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో మీరే చూడండి..
ఓ రైల్లో జనం రద్దీగా ఉన్నారు. బోగీలో అటూ, ఇటూ నడవడానికీ ఇబ్బందిగా ఉంది. ఈ సమయంలో ఓ పిల్లాడికి మూత్రం అర్జంట్ అయింది. అయితే పిల్లాడిని బాత్రూం తీసుకెళ్లడానికి తండ్రికి పెద్ద సమస్యగా మారింది. దీంతో చివరికి ఏం చేశాడో మీరే చూడండి..
శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుండి కేరళలోని కొట్టాయం వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు.
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దూరప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లలో వెళ్లే నగర ప్రయాణికులకు దక్షిణ మధ్యరైల్వే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్ప్రెస్ రైళ్లకు హైటెక్సిటీ స్టేషన్లో ప్రత్యేకంగా హాల్టింగ్ ఏర్పాటు చేసింది.