Home » Trains
క్రిస్మస్ పండుగను పురష్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-వేలాంకణి మధ్య మంగళవారం) రాత్రి 7.25గంటలకు ఓ రైలు. అలాగే.. బుధవారం సాయంత్రం 5.30గంటలకు మరో రైలు వేలాంకణికి బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రైళ్లు అనంతపురం జిల్లా గుంతకల్లు మీదుగా వెళతాయని రైల్వేశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి రోజూ 74 ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వైశాఖ తెలిపింది. 430 కోట్లతో చర్లపల్లి టర్మినల్ ఏర్పాటు చేశారు. చర్లపల్లి స్టేషన్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఒక ఎంఎంఎటీఎస్ మాత్రమే నడుస్తుండగా, మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.
తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్కు మధ్య నడుస్తాయని తెలిపారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. హైదరాబాద్-తిరుపతి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 11వ తేదీన ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే.. చర్లపల్లి-మంగళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి, నర్సాపూర్కు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు, అలాగే 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే ఓ సూచన చేసింది. బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని కోరింది. ఈ కర్పూర హారతుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున కర్పూర హారతులు ఇవ్వవద్దని కోరింది.