Share News

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

ABN , Publish Date - Jan 21 , 2026 | 07:58 AM

ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (పశ్చిమబెంగాల్‌) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

- ఎస్‌ఎంటీవీ బెంగళూరు-బాలూర్‌ఘాట్‌ల మధ్య

- నేటి నుంచి రెండు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మీదుగా వెళ్లి వచ్చే ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (పశ్చిమబెంగాల్‌) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (16523) కొత్త రైలు ప్రతి బుధవారం 10.15 గంటలకు ఎస్‌ఎంవీటి బెంగళూరు నుంచి ప్రారంభమై నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు,


city3.2.jpg

రాజమండ్రి, సామర్లకోట జంక్షన్‌, అనకాపల్లి, దువ్వాడ(Anakapalli, Duvvada), పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, బరంపూర్‌ నుంచి బాలూర్‌ఘాట్‌ చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి శనివారం బాలూర్‌ఘాట్‌-ఎస్‌ఎంవిటీ బెంగుళూరు (16524)బయలుదేరి సోమవారం ఉదయం 3.00 గంటలకు బెంగుళూరు(Bengaluru)కు చేరుకుంటుందన్నారు.


city3.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

వచ్చే ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త సిలబస్‌

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2026 | 07:58 AM