Home » Anakapalli
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో గురువారం పర్యటించారు. నక్కపల్లిలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాతృత్వం మంట గలిసింది. డబ్బు కోసం కన్నబిడ్డనే ప్రియుడికి అప్పగించింది. వాయివరుసలు మరచి.. తల్లితోపాటు ఆమె కూతురిపైనా కన్నేసిన ఆ ప్రబుద్ధుడు సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు.
రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం 'సంకల్పం 2.0' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సోమవారం అనకపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించామని అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి సుమారు 1600 మందిని దివ్యదర్శన యాత్రకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా పోస్టింగులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో సైబర్, సోషల్ మీడియా కేసులు పెరిగాయని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలోని టోరెంటో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉద్యోగి ఎన్. నాగరాజు (36) తీవ్రంగా గాయపడ్డారు.
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో పడవ బోల్తా ఘటనలో మత్స్యకారుల గల్లంతుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.
చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజానికి కృషి చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హోం మంత్రి వంగలపూడి అనిత కృషితో గురుకుల పాఠశాల మంజూరు అయ్యింది.
అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.