Home » Anakapalli
Andhrapradesh: అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారి అరులైన్లు విస్తరించేలా త్వరలో చర్యలు తీసుకుంటామని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ అనుమానించినట్లుగానే నిందితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం (Koppugondupalem) బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్(Suresh) కోసం అనకాపల్లి(Anakapalli) జిల్లా పోలీసులు(Police) గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నిందితుడు ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. సురేశ్ పరారైన సమయంలో బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, ట్రాక్ పాయింట్ ధరించి ఉన్నాడు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలికను హత్యచేసిన నిందితుడ్ని వదిలిపెట్టేది లేదని హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను శనివారం దారుణంగా హత్య చేసిన నిందితుడు బోడా బత్తుల సురేశ్ (26) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
గత వైసీపీ ప్రభుత్వంలో తనపై 23కేసులు బనాయించారని హోంమంత్రి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసిందని, మద్యం దుకాణాల ఎదుట వారిని కాపలాగా పెట్టారని దుయ్యబట్టారు. జగన్ అరాచకాలు భరించలేక గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులు సైతం రాజకీయాలపై దృష్టి పెట్టి వైసీపీని ఇంటికి సాగనంపారని చెప్పారు.
కొప్పుగుండుపాలెం(Koppgundupalem)లో బాలిక హత్యపై హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) సీరియర్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి అనిత చెప్పారు. పరారీలో ఉన్న నిందితుణ్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అనిత అన్నారు.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు...
అల్లూరి జిల్లా: గిరి పుత్రుల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం ఉదయం పాడేరులో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలు, ఘట్టాలతో సతకంపట్లు వరకు బారిగా ఊరేగించారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు.