Home » Anakapalli
Andhrapradesh: ఆ ముస్లిం కుటుంబీకులు ఎంతో ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకున్నారు. తర్వాతి రోజు జరిగిన అనుకోని ఘటన వారిని విషాదంలోకి నెట్టేసింది. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న బాలుడిని ఒక్కసారిగా ప్రమాదం చుట్టిముట్టి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీమున్నీరుగా విలపించారు. అనకాపల్లి జిల్లాలో అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బీభత్సానికి ఓ బాలుడు బలయ్యాడు. శుక్రవారం ఉదయం కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి కాలేజ్ బస్సు దూసుకెళ్లింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్(Pawan Kalyan) దూసుకెళ్తున్నారు. అధికార వైసీపీ, సీఎం జగన్పై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం నాడు అనకాపల్లి జిల్లాలోని నెహ్రూ చౌక్ జంక్షన్లో ‘వారాహి విజయభేరి’ భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath)పై సెటైర్లు గుప్పించారు.
ఈసారి జరుగబోయే ఎన్నికలే తనకు చివరి అవకాశంగా భావించి తనను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీడీపీ(TDP) సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు(Chintakayala Ayyanna Patrudu). అనకాపల్లి(Anakapalle) జిల్లా నర్సీపట్నంలో(Narsipatnam) నిర్వహించిన మహిళా మేలుకో కార్యక్రమంలో చింతకాయ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన..
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఆదివారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు.
రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న సాండ్, ల్యాండ్, గ్రావెల్ మాఫియాపై దాడులు చేయాలని ఉన్నతాధికారులకు అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ సూచించారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో ప్రజలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలోని మండలం కేఎన్ఆర్ పేటలో నిర్మిస్తున్న జిల్లా వైసీపీ కార్యాలయం వద్ద జనసేన , టీడీపీ , బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. సర్వే నంబర్ 75- 1 నంబర్లో వైసీపీ నాయకులు అక్రమంగా వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నా రని తేలియడంతో కూటమి నేతలు ఉమ్మడిగా వెళ్లి అడ్డుకున్నారు.
అమరావతి: అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన భారీ వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో నిర్వహించి చూయూత బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ... చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వీరిద్దరి పేర్లు చెబితే ఏం గుర్తుకొస్తుంది అంటూ ప్రశ్నించారు.
Andhrapradesh: జిల్లాలోని జరిగిన చేయూత బహిరంగ సభలో ఓ దళిత మహిళ నిరసనకు దిగింది. తన కొడుకుని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్ పర్యటనలో బంధువులతో కలిసి దళిత మహిళ నిరసన తెలిపింది. హత్యకు గురైన సోమాదుల రవితేజ ఫొటోతో నిరసన చేపట్టారు.
Andhrapradesh: ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన చేయూత బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని స్పష్టం చేశారు. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్ను నియమించారని తెలిపారు. ‘‘చాలా మంది నీ పరిస్థితి ఎంటి ఎక్కడ పోటీ చేస్తావని నన్ను అడుగుతున్నారు’’ అని అన్నారు.