Home » Rajamundry
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి, అనకాపల్లిలో సభల్లో పాల్గొని మోదీ ప్రసంగించారు. ఈ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేదికల్లో అధికార వైసీపీ, సీఎం జగన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) ఈనెల 13వ తేదీన జరుగుతుండటంతో తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఉమ్మడిగా రాజమండ్రిలోని వేమగిరిలో ‘ప్రజాగళం’ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్, మూడు పార్టీల్లోని కీలక నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు భారీగా కమీషన్లు కొట్టేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaih Chowdary) అన్నారు. గురువారం నాడు టీడీపీ (TDP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
రాజమండ్రి ( Rajahmundry ) బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతయ్యాడు. ఏపీలోని ఏలేశ్వరానికి చెందిన శెట్టి వినోద్ కుమార్ అనే యువకుడు శుక్రవారం ద్విచక్రవాహనంపై రాజమండ్రి బ్రిడ్జి వద్దకు చేరుకుని, బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకాడు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
లోకేశ్తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయడు. పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఇక పవన్ కళ్యాణ్తో పాటు సమన్వయ కమిటీ
మంగళగిరి అన్నా క్యాంటీన్ ఆరంభమై 500 రోజులు అయ్యింది. టీడీపీ హయాంలో ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లను జగనాసురుడనే పెత్తందారుడు మూసేసి పేదల ఉసురు పోసుకున్నాడు. నిరుపేదల క్షుద్బాధ తీర్చేందుకు నా సొంత
రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న చంద్రబాబుని సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ను మంగళవారం నాడు రాత్రి రాజమండ్రి జైలు అధికారులు (Jail officials) విడుదల చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ (DIG Ravi Kiran) ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు.