Home » Rajamundry
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. ఎర్రంపాలెం, కృష్ణయ్య కాలనీ సమీప ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పులిని సురక్షితంగా బంధించేందుకు అత్యాధునిక సాంకేతికతతో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు..
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
ఎస్ఎంటీవీ బెంగళూరు- బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సూచించారు.
ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కాకినాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త బార్ పాలసీపై అబ్కారీ శాఖ దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. త్వరలో కొత్త బార్లకు నోటిఫికేషన్ వెలువడనుంది. జగన్ హయాంలో ఇచ్చిన బార్ల లైసెన్స్లకు ఈ నెలాఖరుతో కాల పరిమితి ముగుస్తుంది. దీంతో ఈనెల 15వ తేదీలోగా కొత్త బార్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం నాడు రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి అఖండ గోదావరి ప్రాజెక్ట్కి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారైంది.
భారత్ గౌరవ్ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
ఢిల్లీలో పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు గురువారం నాడు ఢిల్లీ వెళ్లారు. కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి శనివారం రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.